పీఆర్సీపై మున్ముందుకే!
పదకొండో వేతన సవరణ సంఘం సిఫారసుల అమల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం
ఉద్యోగుల ఉద్యమాన్ని తోసిరాజని కేబినెట్ ఆమోదం
గ్రామీణ ప్రాంతాల్లో రెండు వాయిదాల్లో ఓటీఎస్
అంగన్వాడీలకు అమూల్ పాలు
రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు
ఈనాడు, అమరావతి: పదకొండో వేతన సవరణ సంఘం సిఫారసుల అమల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తన వైఖరికే కట్టుబడి ఉంది. ఫిట్మెంట్ను 23 శాతమే ఖరారు చేయడం, ఇంటి అద్దెభత్యం తగ్గించడం, సీసీఏ తొలగించడం వంటి నిర్ణయాలపై ఉద్యోగవర్గం ఉద్యమిస్తున్నా, పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయాలకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పదకొండో పీఆర్సీ ప్రతిపాదనలు, దానిపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ సిఫారసులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోదించింది. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద అంగన్వాడీలకు అందించే బాలామృతం, పాలు, ఫోర్టిఫైడ్ ఆహారాన్ని అమూల్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వీటిని ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ద్వారా సేకరిస్తారు. కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విలేకరుల సమావేశంలో వివరించారు. కీలక నిర్ణయాలివీ..
* అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపారు. 45-60 ఏళ్ల వయసు గల 3,92,674 మంది మహిళలకు వర్తించే ఈ పథకాన్ని జనవరి 25న ప్రారంభిస్తారు. ప్రభుత్వం రూ.589.01 కోట్లు వెచ్చించనుంది.
* ఓటీఎస్ లబ్ధిదారులకు, టిడ్కో పథకం ద్వారా ఇచ్చే ఫ్లాట్లకు, విశాఖలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపునిచ్చారు. ఓటీఎస్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఉగాదికి, దీపావళికి రెండు వాయిదాల్లో డబ్బు చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.
* ఎంఐజీ వర్గాలకు ఉద్దేశించిన స్మార్ట్ టౌన్షిప్ల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం స్థలాల రిజర్వు నిర్ణయాన్ని ఆమోదించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20% రిబేటుకు స్థలాలు ఇవ్వనున్నారు.
* రూ.7,880 కోట్లతో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి, రూ.3820 కోట్లతో పాత వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు అనుమతులు.
* ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
* సామాజిక పింఛను మొత్తాన్ని నెలకు 2,250 నుంచి రూ.2,500కు పెంపునకు ఆమోదం.
* తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి వీలు కల్పిస్తూ దేవాదాయ చట్టానికి చేసిన సవరణ ఆర్డినెన్స్కు ఆమోదముద్ర.
* తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడెమీకి క్రీడాకారుడు శ్రీకాంత్కు ఐదెకరాలు కేటాయింపు.
* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతను 25 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు.
* కడప, కర్నూలు విమానాశ్రయాల నుంచి విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం. కడప-విజయవాడ, కడప-చెన్నై, కర్నూలు-విజయవాడ మధ్య వారానికి నాలుగు సర్వీసులు. మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం.
* రైతుల ధాన్యం కొనుగోలు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు రూ.5వేల కోట్ల రుణ సేకరణకు అనుమతి.
* కొవిడ్ మరణాలను అరికట్టేందుకు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతి. విధి నిర్వహణలో ఉంటూ కొవిడ్తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్ 30లోగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్నారు.
* మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 7, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 13 ఉద్యోగాలు, వైద్య విద్యాశాఖలో 8 అదనపు డైరెక్టర్ పోస్టులు, ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో ఒక్కోదాంట్లో ముగ్గురు చొప్పున 78 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.
* విజయవాడ నగరంలో భాగంగా ఉన్న తాడిగడప పంచాయతీని ప్రత్యేక మున్సిపాలిటీగా చేసినందున అక్కడి 59 పోస్టులను మున్సిపాలిటీకి బదలాయించారు. కర్నూలు జిల్లా డోన్లో బాలికల బీసీ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలల్లో 58 పోస్టులు మంజూరుచేశారు.
* అనకాపల్లిలోనిప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి 50 ఎకరాలు ఉచితంగా కేటాయింపు.
* ఏపీఐఐసీ నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్లలోని భూములను బహుళ అవసరాలకు వినియోగించేందుకు ఉద్దేశించిన గ్రోత్పాలసీకి అంగీకారం.
* విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహకల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూముల్ని హెచ్ఐజీ, ఎంఐజీ కాలనీలకు వాడుకునేందుకు వెసులుబాటు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.