ఉద్యమం.. ఇక ఉద్ధృతం
ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని
ఉద్యోగుల సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు
ర్యాలీలు, ధర్నాలు.. కార్యాచరణ అమలుకు ప్రణాళిక
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు
ఈనాడు, అమరావతి: ఉద్యోగులు సమ్మెకు సమాయత్తమయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన కార్యాచరణ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 24న సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 25 నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాల్లోనూ నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. పీఆర్సీ ఉత్తర్వుల రద్దు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు చేయాలనే డిమాండ్లతో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగులు రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల నాయకులు హాజరయ్యారు. సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అశుతోష్ మిశ్ర నివేదికను బహిర్గతం చేయాలని నాయకులు డిమాండు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సమ్మెకు అనూహ్య మద్దతు
ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి చేయనున్న ఉద్యోగుల సమ్మెకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాలతోపాటు పీడీఎఫ్ ఎమ్మెల్సీలూ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ సైతం సమ్మెలో పాల్గొననుంది. విజయవాడలో లారీ యాజమానుల సంఘం మద్దతు తెలిపింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ఉద్యోగులందరూ ఉద్యమ కార్యాచరణలో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘం సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాల్లోనూ ఆందోళనలు, ర్యాలీలు, రిలే దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 25న జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ర్యాలీలకు పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యేలా ఏర్పాట్లపైనా ఉద్యోగులు చర్చించారు. దీన్ని అన్ని సంఘాలూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. 27 నుంచి 30 వరకు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించారు.
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమ్మెబాట
సాధారణ ఉద్యోగులతో పాటు తామూ సమ్మెకు వెళ్తామని ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ (ఏపీ హంస) అధ్యక్షుడు అరవపాల్ తెలిపారు. ఈ పోరాటంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొంటారని.. దీంతో కరోనా, ఇతర వైద్యసేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులూ పోరాటంలో పాల్గొంటారన్నారు.
నల్ల బ్యాడ్జీలతో గ్రామ సచివాలయాల్లో విధులు
పీఆర్సీ సాధన సమితి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ భోజన విరామ సమయంలో సంఘీభావం తెలపాలన్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్రకమిటీ తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
పోరాటానికి విశ్రాంతి లేదు
ఈనాడు, విజయనగరం: ఉద్యోగ సంఘాలు విజయనగరంలో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి 91 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత ఉద్యోగి సోమయాజుల వెంకట సుబ్బారావు హాజరయ్యారు. మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడిగి మరీ ప్రసంగించారు. తనకు 91 ఏళ్లు కాదని.. 19 ఏళ్లంటూ అందరిలో ఉత్సాహం నింపారు. తాను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, ఏనాడూ ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదన్నారు. ఉద్యోగుల పోరాటంలో న్యాయం ఉందన్నారు. ధర్మం మనవైపే ఉందని.. కచ్చితంగా గెలుస్తామని పేర్కొన్నారు. గాంధీజీ చెప్పినట్లు ‘డూ ఆర్ డై’ అంటూ ఆయన చేసిన ప్రసంగ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం