AP High Court: న్యాయస్థానంతో ప్రభుత్వం దోబూచులాడుతోంది
న్యాయస్థానం నుంచి విచారణను తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. సదుద్దేశంతో
విచారణను తప్పించుకునేందుకే ‘మూడు రాజధానులు’ రద్దు
హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు
ప్రభుత్వ వాదనల కోసం విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా
ఈనాడు, అమరావతి: న్యాయస్థానం నుంచి విచారణను తప్పించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. సదుద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేయలేదన్నారు. బహుళ రాజధానుల చట్టాన్ని మళ్లీ తీసుకొస్తామని బహిరంగంగానే చెబుతోందన్నారు. పట్టుకోండి చూద్దాం అన్నట్లు కోర్టుతో ప్రభుత్వం దోబూచులాడుతోందని ఆరోపించారు. మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చే శాసనాధికారం, మళ్లీ దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్న నేపథ్యంలో... రాజధాని అమరావతి నిర్మాణాన్ని బృహత్ ప్రణాళిక ప్రకారం నిర్దిష్ట కాలంలో పూర్తి చేసేలా ఆదేశించాలని కోరారు. తాము దాఖలు చేసిన పలు వ్యాజ్యాల్లో రాజధానిలో నిలిచిపోయిన పనులను కొనసాగించాలని, భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ప్లాట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరామన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, శాసనసభ కార్యదర్శి తరఫు వాదనల కోసం విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా పడింది. అమరావతి అభివృద్ధికి గతంలో ఇచ్చిన ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు అడ్డంకి కాదంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టాలను ‘రద్దు’ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం (యాక్ట్ 11/2021) తీసుకొచ్చిన తర్వాత దాఖలైన వ్యాజ్యాల్లో మిగిలిన అభ్యర్థనలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
అడ్డుకోవడం మొదటిసారి కాదు
న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... ‘రాజధాని వ్యాజ్యాలపై విచారణను ప్రభుత్వం అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదు. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులపై సవతితల్లి ప్రేమ చూపుతోంది. రాజధాని కోసం ఇప్పటివరకు రూ.16,500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేశారు. జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల సొమ్ముకు ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి. అందుకు భిన్నంగా వృధా చేస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక పెయిడ్ రిపోర్టు. దాని కోసం ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చుచేసింది’ అన్నారు.
రాజకీయ ఎజెండాతో రాజధాని మార్పు సరికాదు
పిటిషనర్ల తరఫు మరికొందరు సీనియర్ న్యాయవాదులు ఎ.సత్యప్రసాద్, జంధ్యాల రవిశంకర్, ఎంఎస్ ప్రసాద్, న్యాయవాదులు కేఎస్ మూర్తి, వాసిరెడ్డి ప్రభునాథ్, అంబటి సుధాకరరావు, వై.సూర్యప్రసాద్, పీఏకే కిశోర్, డీఎస్ఎన్వీ ప్రసాదబాబు, నర్రా శ్రీనివాసరావు, కారుమంచి ఇంద్రనీల్బాబు, జీవీఆర్ చౌదరి, వీవీ లక్ష్మీనారాయణ, తదితరులు వాదనలు వినిపించారు. ‘పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగాకే రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ప్రజల కోణం నుంచి చూసినా అమరావతి ఆమోదయోగ్యమైంది. మూడు రాజధానుల చట్టాన్ని చేసే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దాన్ని రద్దు చేస్తూ మళ్లీ చట్టం చేసే అధికారం అసలే లేదు. రాజధాని వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరిట ప్రాంతాల వారీగా ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు. అమరావతి నిర్ణయం కేంద్ర ప్రభుత్వ సమ్మతితో జరిగింది. కాబట్టే అభివృద్ధి కోసం రూ.1500 కోట్ల ఆర్థికసాయం చేసింది. రాజకీయ ఎజెండాతో రాజధాని మార్పు నిర్ణయించడం సరికాదు. నిర్దిష్ట సమయంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇస్తామన్నారు. ఆ సమయం దాటిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. రాజధానిలో 25% పూర్తయిన పనులను కొనసాగిస్తున్నామని సీఆర్డీఏ చెబుతోంది. ఒక్క రూపాయి ఖర్చుచేయలేదు. అఫిడవిట్ రూపంలో కోర్టుకు అబద్ధాలు చెబుతోంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు జరిగేలా ఆదేశించండి. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం జిల్లా పేరు, సరిహద్దులను మార్చే వెసులుబాటు మాత్రమే రాష్ట్రానికి ఉంది. అంతేతప్ప... రాజధాని ప్రాంతంపై రాష్ట్రానికి అధికారం కల్పించలేదు. అమరావతిలో ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చాక... ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలు అమరావతిలోనే కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’ అన్నారు.
అలాంటి ఆదేశాలివ్వలేం: ధర్మాసనం
మరో న్యాయవాది పీబీ సురేశ్ వాదనలు వినిపిస్తూ... ‘మూడు రాజధానుల చట్టం, దాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన తాజా చట్టం చెల్లుబాటు కానివిగా ప్రకటించండి. అధ్యయనం చేసి మరోసారి మూడు రాజధానుల చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి శాసనం చేయకుండా నిలువరించండి’ అని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ మీ వాదన వింటుంటే... చట్టాలు చేయకుండా ముందే నిలువరించాలని కోరుతున్నట్లుందని వ్యాఖ్యానించింది. చట్టాలు చేయకుండా నిలువరించలేమని, అలాంటి ఆదేశాలను ఇవ్వలేమంది.
ఏజీ అభ్యంతరం
న్యాయస్థానం విచారణను ప్రభుత్వం అడ్డుకుంటోందని న్యాయవాది చేసిన వాదనలపై ఏజీ శ్రీరామ్ అభ్యంతరం తెలిపారు. శుక్రవారం విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగియడంతో ప్రభుత్వ వాదనల కోసం విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ