పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలి: సోమువీర్రాజు

పీఆర్సీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసి ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చర్చలు జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

Published : 21 Jan 2022 05:36 IST

కర్నూలు బి.క్యాంపు, అరవిందనగర్‌(అనంతపురం), న్యూస్‌టుడే: పీఆర్సీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేసి ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ చర్చలు జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇంటి అద్దెలు పెరిగిపోతే ప్రభుత్వం హెచ్‌ఆర్‌ను తగ్గించి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా కాకుండా శత్రువుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని