Tirumala: నేటి నుంచి శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులకు అనుమతి
తిరుమలకొండకు నడిచి వెళ్లేందుకు అనుగుణంగా శ్రీవారిమెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకపూజలు
ఈనాడు, తిరుపతి, న్యూస్టుడే, చంద్రగిరి: తిరుమలకొండకు నడిచి వెళ్లేందుకు అనుగుణంగా శ్రీవారిమెట్టు మార్గంలో గురువారం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఆ మార్గంలో నడిచివెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో మెట్టుమార్గం అక్కడక్కడ ధ్వంసమైంది. పునరుద్ధరణ పనులకు తితిదే రూ.3.60 కోట్లు మంజూరు చేసింది. 5 నెలలుగా కార్మికులు శ్రమించి పనులు పూర్తి చేశారు. 800, 1,200వ మెట్ల వద్ద వంతెనలు కూలిపోవడంతో అక్కడ నిర్మాణ పనులు పటిష్ఠంగా చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..