TDP leader Somireddy: ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయరు?
వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో వచ్చిన పార్టీ కార్యకర్తలు తెదేపా కేంద్ర కార్యాలయంపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఇంతవరకు వాళ్లను ఎందుకు
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో కార్యకర్తలు వచ్చి దాడి చేశారు
దాడి చేసిన వారిలో విజయవాడ కార్పొరేటర్, అప్పిరెడ్డి అనుచరులు, అవినాష్ సన్నిహితులు
ఇవిగో ఆధారాలంటూ ఫొటోలు, వీడియోలు చూపించి నిప్పులు చెరిగిన తెదేపా నేత సోమిరెడ్డి
ఈనాడు, అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో వచ్చిన పార్టీ కార్యకర్తలు తెదేపా కేంద్ర కార్యాలయంపై పోలీసుల సమక్షంలోనే దాడి చేసినట్టు స్పష్టమైన ఆధారాలున్నా ఇంతవరకు వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపా కార్యాలయంపై దాడి చేస్తున్న దృశ్యాలను.. వారు ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, వైకాపా నేత దేవినేని అవినాష్తో ఉన్న చిత్రాలు ఇవిగో అంటూ విలేకరుల సమావేశంలో వాటిని ఆయన చూపించారు. కొందరు అప్పిరెడ్డి కారులోనూ వచ్చారంటూ దానికి సంబంధించి సీసీ కెమేరాలో రికార్డయిన దృశ్యాలను చూపించారు. దాడి చేసిన అనంతరం వైకాపా వారిని ఒక డీఎస్పీ దగ్గరుండి మరీ వాహనాలు ఎక్కించి పంపిస్తున్నారంటూ ఒక వీడియో చిత్రాన్నీ ప్రదర్శించారు. ‘కళ్లకు కట్టినట్టు సీసీ కెమేరాల్లో, వీడియోల్లో రికార్డయిన దాడి దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతున్నా.. వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదో డీజీపీ సమాధానం చెప్పాలి’ అని ఆయన శుక్రవారం తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిలదీశారు.
పోలీసులు ఇంత హీనంగా ఎందుకు మారారు?
‘‘తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతున్నంతసేపూ పట్టించుకోని డీఎస్పీ.. దాడి పూర్తయిన వెంటనే వైకాపా వారి భుజాలపై చేతులు వేసి పెళ్లికొడుకుల్లా కార్లు ఎక్కించి పంపించారు. తెదేపావాళ్లు వచ్చేస్తున్నారు త్వరగా వెళ్లిపోండని సాగనంపుతున్నారు. ఎక్కండీ.. ఎక్కండీ అని అందరినీ బతిమాలుతున్నారు. ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం? అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? రాష్ట్రంలో పోలీసులు ఇంత హీనంగా ఎందుకు దిగజారారు? పోలీసు డ్రెస్సును, వారి ప్రతిష్ఠను రోడ్లపాలు చేశారు. మీరు జగన్తోపాటు ప్రజలకు బాధ్యులని మర్చిపోకండి. ఇంతగా దిగజారిన పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదు. దాడి చేసినవారిని వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్న వీడియోను ప్రదర్శించారు.
ముఖ్యమంత్రే హింసను ప్రోత్సహించడమేంటి?
‘పోలీసు మీట్లో ముఖ్యమంత్రి జగన్ హింసకు మద్దతిచ్చేలా మాట్లాడారు. తనను తిట్టారు కాబట్టి అందరినీ కొట్టండని ముఖ్యమంత్రే చెప్పారు. ప్రజలపై దాడులు చేసేవాళ్లకు మద్దతివ్వమని పోలీసులకు చెప్పకనే చెప్పారు. డీజీపీ, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలున్న సమావేశంలో నేనే రాజ్యాంగాధినేతను, మీరు ఏం కావాలన్నా చేయండని చెప్పడం దారుణం. ప్రజలపై హింసను ఇలా ప్రోత్సహిస్తుంటే ఇక ప్రజలు వారి ప్రాణాల్ని వారే కాపాడుకోవాలి’ అని సోమిరెడ్డి సూచించారు. ‘దేశానికి రాష్ట్రపతి, రాష్ట్రానికి గవర్నర్ రాజ్యాంగాధిపతులు. ఈ సభలో జగన్ తనను తానే రాజ్యాంగాధిపతిగా ప్రకటించుకున్నారు. జగన్ మాట్లాడిన అంశాలనుబట్టి డాక్టర్ అంబేడ్కర్ మళ్లీ వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలేమో?’ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఫొటోలను చూపిస్తూ సోమిరెడ్డి చెప్పిన అంశాలివి..
‘‘ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కారులో కార్యకర్తలు దాడికి వచ్చిన దృశ్యం సీసీ కెమేరాల్లో రికార్డయింది. ఆయనపై ఈ రోజుకీ చర్యలెందుకు తీసుకోలేదు? (కారులో దాడికి వస్తున్న దృశ్యం, 2345 నంబరుగల కారు వెనుక భాగంలో ‘ఏఆర్’ అని రాసి ఉన్న ఫొటోలతో కూడిన చిత్రాన్ని చూపించారు.)
‘‘ఎర్రచొక్కా వేసుకుని దాడికి పాల్పడుతున్న ఈయన పేరు జోగరాజు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టరుగా ఇటీవలే నియమితులయ్యారు. ఆయన్ని అరెస్టు చేయడానికి మీకు ఇంకా టైంకావాలా? (జోగరాజు వైకాపా కండువా వేసుకుని ఆ పార్టీ నేత అవినాష్తో దిగిన ఫొటో.. కార్యాలయంపై దాడికి వస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని చూపించారు.)
‘‘ఈయన పేరు అరవ సత్యం. విజయవాడ కార్పొరేటర్. మీ వైకాపా కార్పొరేటర్ తెదేపా కార్యాలయంపై దాడి చేస్తే.. అరెస్టు చేయరా? (జగన్తో సత్యం ఉన్న ఫొటోను, తెదేపా కార్యాలయంపై దాడికి సంబంధించి సీసీ కెమేరాలో రికార్డయిన దృశ్యంలో ఒకరిని మార్కర్తో రౌండ్ చేసిన ఫొటో చూపించారు.)
‘‘ఈయన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముఖ్య అనుచరుడు పానుగంటి చైతన్య. (చైతన్య కర్రతో దాడి చేస్తున్న ఫొటోను.. అప్పిరెడ్డితో ఉన్న ఫొటోనూ చూపించారు.)
‘‘ఈయన అప్పిరెడ్డికి మరో ముఖ్య అనుచరుడు రోషన్ షైక్. (తెల్లచొక్కా, మాస్కు ధరించి దాడికి పాల్పడుతున్న వ్యక్తి ఫొటోను, జగన్తో రోషన్ షైక్ ఉన్న ఫొటోనూ చూపించారు.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM