AP news: జగన్పై ఎత్తేసిన కేసులివే
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై గతంలో నమోదైన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తప్పుడు (ఫాల్స్) కేసులంటూ కొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ మరికొన్నింటిని,
హైకోర్టు సుమోటో విచారణ నేపథ్యంలో చర్చనీయాంశం
ఈనాడు - అమరావతి
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై గతంలో నమోదైన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. తప్పుడు (ఫాల్స్) కేసులంటూ కొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ మరికొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ లా, ఆధారాలు లేవనే కారణంతో ఇంకొన్నింటిని ఎత్తేసింది. ఆయా కేసుల దర్యాప్తు అధికారులు న్యాయస్థానాల్లో క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసి వాటి కథ ముగించారు. చర్యల ఉపసంహరణ (యాక్షన్ డ్రాప్డ్) పేరిట పలు కేసుల్ని న్యాయస్థానాల్లో విచారణ అవసరం లేకుండా మూసేశారు. గతేడాది సెప్టెంబరు 16 తర్వాత వరుసగా ఈ కేసుల ఎత్తివేత వ్యవహారం సాగింది. దర్యాప్తు అధికారులు సంబంధిత డీఎస్పీల నుంచి అనుమతి తీసుకుని.. తర్వాత న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టులు దాఖలుచేసి వాటికి స్వస్తి పలికారు. అలా ఎత్తేసిన 11 కేసులపై హైకోర్టు బుధవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ కేసుల వివరాలివీ..
పోలీసుస్టేషన్: మంగళగిరి గ్రామీణం
నమోదైన తేదీ: 2016 మార్చి 9
ఫిర్యాదు సారాంశం: వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శత్రుత్వం పెంచేలా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఫిర్యాదుదారులు: ఎ.వెంకటేశ్వరరావు, తోట ముసలయ్య, వై.భాగ్యారావు, కర్రి ప్రభాకర్రావు, ఆర్.సాంబశివరావు, డి.వీరాంజనేయులు
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్ (తప్పుడు) కేసులు అని న్యాయస్థానానికి నివేదిక సమర్పించి ఎత్తేశారు.
పోలీసుస్టేషన్: నల్లచెరువు (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్ 5
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘చంద్రబాబు నాయుడిని చచ్చేవరకూ చెప్పులతో కొట్టండి’ అంటూ ప్రసంగించి ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: దాడెం వెంకటశివారెడ్డి (కమ్మవారిపాలెం గ్రామం)
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్ ఆఫ్ లా
పోలీసుస్టేషన్: యాడికి (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా యాడికిలో 2016 జూన్ 3న జరిగిన రైతు భరోసా యాత్రలో ప్రసంగిస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతకర భాషను ఉపయోగించారు. ఆయన గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు.
ఫిర్యాదుదారు: వేలేరు రంగయ్య (టి.కొత్తపల్లి గ్రామం)
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్ డ్రాప్డ్ (చర్యల ఉపసంహరణ)
పోలీసుస్టేషన్: పెదవడగూరు(అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్ 3
ఫిర్యాదు సారాంశం: అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం క్రిష్టపాడులో నిర్వహించిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్ అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టారు. పెదవడగూరు మండలంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారు.
ఫిర్యాదుదారు:కొండూరు కేశవరెడ్డి (కొండూరు గ్రామం)
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: యాక్షన్ డ్రాప్డ్ (చర్యల ఉపసంహరణ)
పోలీసుస్టేషన్: అనంతపురం రెండో పట్టణం
నమోదైన తేదీ: 2016 జూన్ 6
ఫిర్యాదు సారాంశం: అనంతపురం సప్తగిరి సర్కిల్లో 2016 జూన్ 5న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు.
ఫిర్యాదుదారు: తమ్మినేని పవన్కుమార్
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ (ఆధారాలు లేవు)
పోలీసుస్టేషన్: పుట్టపర్తి అర్బన్ (అనంతపురం జిల్లా)
నమోదైన తేదీ: 2016 జూన్ 3
ఫిర్యాదు సారాంశం: ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు.
ఫిర్యాదుదారు: బోయ రామాంజనేయులు (బ్రాహ్మణపల్లి గ్రామం)
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: -
ఎత్తేసిన కేసుల్లో హైకోర్టు సుమోటో విచారణ పరిధిలో లేనివీ మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు..
పోలీసుస్టేషన్: పులివెందుల (కడప జిల్లా)
నమోదైన తేదీ: 2011 అక్టోబరు 9
ఫిర్యాదు సారాంశం: అల్లర్లకు పాల్పడ్డారని, మారణాయుధాలు కలిగి ఉన్నారని, ప్రభుత్వోద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించి నేరపూరిత బలప్రయోగం చేశారని, నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని, అక్రమ చొరబాటు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్న ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వై.అన్నయ్య
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్ (తప్పుడు) కేసు
పోలీసుస్టేషన్: చిలకలూరిపేట టౌన్
నమోదైన తేదీ: 2015 జూన్ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్ఫోన్ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: గొర్రపాటి వెంకట హనుమ శివప్రసాద్
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్ (తప్పుడు) కేసు
పోలీసుస్టేషన్: నరసరావుపేట ఒకటో పట్టణం
నమోదైన తేదీ: 2015 జూన్ 8
ఫిర్యాదు సారాంశం: నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం, అవతలి వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాల వినియోగం, చట్టవిరుద్ధంగా సెల్ఫోన్ సందేశాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారని, ట్యాంపరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలు.
ఫిర్యాదుదారు: వేల్పుల సింహాద్రి యాదవ్
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: ఫాల్స్ (తప్పుడు) కేసు
పోలీసుస్టేషన్: నందిగామ (కృష్ణా జిల్లా)
నమోదైన తేదీ: 2017 ఫిబ్రవరి 28
ఫిర్యాదు సారాంశం: 2017 ఫిబ్రవరి 28 కృష్ణా జిల్లా నందిగామ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. ఆరి మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్న సమయంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కొలుసు పార్థసారధి, సామినేని ఉదయభాను తదితరులు శవపరీక్ష గదిలోకి చొరబడి వైద్యాధికారిణిని అడ్డుకున్నారని, ఆమెతో వాగ్వాదానికి దిగి తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారన్న ఫిర్యాదులు.
ఫిర్యాదుదారు: కేవీ లక్ష్మీకుమారి (వైద్యురాలు)
క్లోజర్ రిపోర్టులో పేర్కొన్న కారణం: మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!