Azadi Ka Amrit Mahotsav: తెల్లవారు కాళ్లావేళ్లా పడ్డ వేళ...
ఆంగ్లేయులు భారత్లో 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించటమేగాదు... తప్పైపోయిందని... కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డ సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది... తొలినాళ్లలో జరిగిన చైల్డ్స్ వార్! తమకు మాయని మచ్చగా నిలిచిన
ఆంగ్లేయులు భారత్లో 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చెలాయించటమేగాదు... తప్పైపోయిందని... కాళ్లు పట్టుకొని ప్రాధేయపడ్డ సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది... తొలినాళ్లలో జరిగిన చైల్డ్స్ వార్! తమకు మాయని మచ్చగా నిలిచిన ఈ తొలి ఆంగ్లో-ఇండియన్ యుద్ధాన్ని తెల్లవారు తెలివిగా చరిత్ర పుటల్లో మరుగున పడేలా చేశారు.
పదిహేడో శతాబ్ది తొలినాళ్ల సమయమది. మొఘల్ సామ్రాజ్యం బలహీన పడుతున్న దశ. అప్పటికే... డచ్, ఫ్రెంచ్, పోర్చుగీసులు భారత్లో, చుట్టుపక్కల సముద్రజలాల్లో వాణిజ్యంపై పట్టుకు ప్రయత్నిస్తున్నారు. వీరందరి తర్వాత ఆలస్యంగా వచ్చిన ఆంగ్లేయులు పశ్చిమ ప్రాంతాల్లో కొన్ని చోట్లకే పరిమితమయ్యారు. అదీ మొఘల్ రాజుల కనుసన్నల్లో! తూర్పుతీరంలో ముఖ్యంగా హుగ్లీ (బెంగాల్) వైపు పోర్చుగీసు వాణిజ్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతుండటంతో... ఆంగ్లేయులకు కన్నుకుట్టింది. అక్కడా తాము కాలుమోపాలనుకొని... ఈస్టిండియా కంపెనీ ప్రతినిధి విలియమ్ హెడ్జెస్ను 1682లో బెంగాల్ (మొఘల్)రాజు షాయిస్తాఖాన్ వద్దకు పంపించారు. మొఘల్ పాలనలోని అన్ని ప్రాంతాల్లో తాము వ్యాపారం చేసుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి తోడు తమ వస్తువులపై ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆంగ్లేయులు అడిగే పద్ధతి నచ్చని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఇందుకు నిరాకరించాడు. చర్చలు విఫలమయ్యాయి. ఆ సమయంలో ఈస్టిండియా కంపెనీ ముంబయి గవర్నర్గా ఉన్న సర్ జోసియా చైల్డ్... ఆగ్రహంతో ఔరంగజేబుపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. మొఘల్ల వాణిజ్య ఓడలను తెల్లవారు అటకాయించి దోచుకోవటం ఆరంభించారు. అంతేగాకుండా మక్కా పర్యటనకు వెళుతున్న ఓడలను కూడా దోపిడీ చేశారు. చిట్టగాంగ్ను (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకొని బంగాళాఖాతంలో వాణిజ్యంపై పట్టుబిగించాలని వ్యూహం రచించారు. ఈ మేరకు 1685లో అడ్మిరల్ నికోల్సన్ 12 పడవల్లో వెయ్యిమంది సైనికులతో చిట్టగాంగ్పై దాడికి వచ్చాడు. కానీ... దారితప్పి హుగ్లికి చేరుకున్నాడు. అక్కడ మొఘల్ అధికారులకు, ఆంగ్లేయులకు మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకవైపు ఇలా మొఘల్లను ఇబ్బంది పెడుతూనే... మరోవైపు చర్చలు సాగదీశారు ఆంగ్లేయులు. కారణం మరింత సైన్యాన్ని కూడగట్టు కోవటం కోసమే. 1688లో మద్రాసు నుంచి కెప్టెన్ హీత్ ఆధ్వర్యంలో సైన్యం బాలాసోర్, చిట్టగాంగ్లపై విరుచుకుపడింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేక మద్రాసుకు తిరుగుముఖం పట్టింది.
ఈ సంఘటనలన్నింటితో ఆగ్రహించిన ఔరంగజేబు... భారత్లో ఈస్టిండియా కంపెనీ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశాడు. ఫలితంగా.. ముంబయి, మద్రాసు తప్పిస్తే... అన్ని చోట్లా కంపెనీ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. సిబ్బందిని, వారి సైనికులను నిర్బంధించారు. చేశారు. 1689లో మొఘల్ సైన్యాధిపతి సిది యాకుబ్ సారథ్యంలోని నౌకాదళం ముంబయిలోని ఈస్టిండియా కంపెనీపైనా దాడి చేసింది. ఆంగ్లేయులు తీవ్రంగా ప్రతిఘటించినా అదే సమయంలో వచ్చిన క్షామం దెబ్బతీసింది. ఫలితంగా... ఈస్టిండియా కంపెనీ లొంగిపోయింది. తప్పైందని... క్షమించమని కోరుతూ... 1690లో ఔరంగజేబు ముందు ప్రాధేయపడింది. తమ ఆస్తులను విడిచిపెట్టాలని... వాణిజ్యం చేసుకునేందుకు తిరిగి అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడి బతిమిలాడింది. ఆ కాలంలోనే లక్షన్నర రూపాయల జరిమానా చెల్లించటానికి సిద్ధపడింది. అంతేగాకుండా మునుముందు తమ ప్రవర్తన మార్చుకుంటామని హామీ ఇచ్చింది. మెత్తబడ్డ ఔరంగజేబు- ఈస్టిండియా కంపెనీ ఆస్తులకు, సిబ్బందికి విముక్తి ప్రకటించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు