పెద్ద తలకాయలను పట్టుకోరా?
మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది.
మాదకద్రవ్యాల కేసుల్లో డ్రైవర్లు, క్లీనర్లే నిందితులా?
దర్యాప్తు తీరుపైనా సందేహం కలుగుతోంది
జస్టిస్ లలిత కీలక తీర్పు
ఈనాడు, అమరావతి: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్డీపీఎస్) కింద నమోదవుతున్న గంజాయి అక్రమ రవాణా కేసుల్లో లారీ డ్రైవర్లు, అందులో ఉన్నవాళ్లను మాత్రమే నిందితులుగా పేర్కొంటున్నారని, దీని వెనుకున్న పెద్దతలకాయలను ఎప్పుడూ నిందితులుగా చేర్చడం లేదని హైకోర్టు ఆక్షేపించింది. ఇది దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తునకు ‘ప్రత్యేక విభాగం’ ఏర్పాటు చేయాలన్నారు. డీజీపీ క్రమం తప్పకుండా ప్రత్యేక విభాగంతో సమీక్షించాలని స్పష్టంచేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో(పీపీ) సైతం సంప్రదింపులు చేస్తుండాలంది. ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో గంజాయి సాగవుతున్నట్లు కనిపిస్తోందని, ఇది చట్టవిరుద్ధమనే విషయం స్థానికులకు తెలియదని వ్యాఖ్యానించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు అవగాహన శిబిరాలతో ఛైతన్య పరచాలని ఆదేశించింది. ఎన్డీపీఎస్ కింద నమోదైన కేసుల్లో పోలీసులు, ప్రత్యేక కోర్టుల న్యాయాధికారులు, పీపీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను నిర్దేశిస్తూ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. సంబంధిత ప్రతి హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేసిన కేసులో నిందితులైన లారీ డ్రైవర్, క్లీనర్కు బెయిలు మంజూరు చేశారు.
గడువు పొడిగింపునకు అభ్యర్థించకపోవడంపై ఆక్షేపణ
ఎన్డీపీస్ కింద నమోదైన కేసుల్లో 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయకుంటే నిందితులకు డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి గుర్తుచేశారు. ఒకవేళ 180 రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేయలేనప్పుడు.. నిందితుల రిమాండ్ సమయాన్ని పొడిగించాలని పోలీసులు సంబంధిత కోర్టులో పోలీసులు దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుపట్టారు.
డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా...
నిందితుల రిమాండ్ సమయం పొడిగింపుపై దిగువ కోర్టుల్లో దరఖాస్తులు చేయడం లేదనే విషయాన్ని న్యాయస్థానం ఉత్తర్వుల ద్వారా డీజీపీ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో డీజీపీ కౌంటర్ దాఖలు చేస్తూ.. ఎన్డీపీఎస్ కేసుల దర్యాప్తు విషయమై సమావేశాలు నిర్వహించి మార్గదర్శనం చేశామన్నారు. నిందితుల రిమాండ్ను పొడిగించాల్సినవి విజయనగరంలో 8, విశాఖ జిల్లాలో 44 కేసులున్నాయన్నారు. సమయం పొడిగింపునకు కోర్టులో మెమోలు వేశామన్నారు. 2020లో విశాఖ జిల్లాలో 252, 2021లో 248 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయన్నారు.
ఇవీ న్యాయమూర్తి ఇచ్చిన మార్గదర్శకాలు...
* కేసు మూలాలను కనుగొనలేక కొన్నింట్లో పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోతున్నారు. కేసు నమోదైన తర్వాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తిచేయాలి.
* సోదాలు, జప్తుల సమయంలో అధికారులు ఎన్డీపీఎస్ చట్ట నిబంధనలను, సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు తప్పకుండా పాటించేలా అవగాహన కల్పించాలి.
* నిందితుల రిమాండ్ను పొడిగించాలని పోలీసు అధికారులు కోరినా తగిన సమయంలో స్పందించని పీపీ/ఏపీపీలపై చర్యలు తీసుకోవాలి.
* రిమాండ్ పొడిగింపు పిటిషన్లను ప్రత్యేక కోర్టులు నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలి. తరచూ వాయిదాలు వేస్తుండటంతో నిందితులు 200పైగా రోజులు జైళ్లలో మగ్గుతున్నారు.
* విశాఖలోని ప్రత్యేక కోర్టులో బెయిలు కోసం వేసిన పిటిషన్లకు 10 నుంచి 15 రోజులకు నంబరు ఇస్తున్నట్లు హైకోర్టు దృష్టిలో ఉంది. 2021 సెప్టెంబరు నుంచి నవంబరు 1 మధ్య.. బెయిలు పిటిషన్లు ఎప్పుడు దాఖలయ్యాయి, వాటికి నంబరు ఎప్పుడు కేటాయించారు. విచారణకు ఎప్పడొచ్చాయి. న్యాయస్థానం తుది ఉత్తర్వులు ఎప్పుడు జారీచేసిందనే వివరాలతో విశాఖలోని ఎన్డీపీఎస్ కేసుల విచారణ ప్రత్యేక జడ్జి.. హైకోర్టుకు నివేదిక ఇవ్వాలి’ అని తీర్పులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన సంజు, జురెల్.. లఖ్నవూపై రాజస్థాన్ విజయం
-
మందుగుండు సామగ్రి పేలి.. 20 మంది సైనికులు మృతి!
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM