AP High Court: అమరావతి అభివృద్ధికి అడ్డంకి కాదు
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
సీఆర్డీఏలో యథాతథ స్థితి ఉత్తర్వులపై హైకోర్టు
కార్యాలయాల తరలింపు నిలిపివేత ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయి
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టీకరణ
యథాతథ స్థితి ఉత్తర్వులపై హైకోర్టు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించవచ్చని పేర్కొంది. స్టేటస్కో కారణంగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోవడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది. న్యాయస్థానం జోక్యంతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాలనను తాము చేయాలనుకోవడం లేదని, వారి ప్రతి నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు, ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని తేల్చిచెప్పింది. సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను ‘రద్దు’ చేస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లుకు గవర్నర్ సమ్మతి తెలపాల్సి ఉందని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం కోసం ఈ నెల 25న బిల్లును గవర్నర్కు పంపించామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతోంది, హైకోర్టు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర వివరాలతో కోర్టు ముందు మెమో దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలన్నారు. దీంతో విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 22న విచారణ సందర్భంగా ఏజీ జోక్యం చేసుకుంటూ సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారన్నారు. దీంతో ధర్మాసనం.. బిల్లుతో పాటు, దాన్ని తీసుకురావడానికి కారణాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అఫిడవిట్ దాఖలు చేశారు. బిల్లులను ఈ నెల 22న శాసనసభ, 23న శాసనమండలి ఆమోదించాయని పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.
విచారణ కొనసాగించాలన్న పిటిషనర్లు
రాజధాని రైతు పరిరక్షణ సమితి, తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్, పీబీ సురేశ్ వాదనలు వినిపిస్తూ.. బిల్లు ఇంకా చట్టం కాలేదన్నారు. గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నాం అంటూనే.. మరోవైపు మూడు రాజధానుల కోసం బిల్లు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తమ వాదన అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యాల్లో అభ్యర్థించామన్నారు. వాటిపై విచారణను కొనసాగించాలని కోరారు. సీజే స్పందిస్తూ.. సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ ఇటీవల వాదనలు వినిపిస్తూ రాజధాని అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్ సిటీగా మార్చిందన్నారని గుర్తుచేశారు. ఈ వ్యాజ్యాలను అపరిష్కృతంగా ఉంచితే అవి కూడా ‘ఘోస్ట్ పిటిషన్లు’గా మారతాయని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చర్యలు విచారణలో జోక్యం చేసుకోవడమే
రాజధాని రైతులు మరికొందరి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కోరిన అభ్యర్థనలు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. వాటిపై విచారణ కొనసాగించాలన్నారు. ‘ఈ వ్యాజ్యాలను తేల్చకుండా ప్రభుత్వం మూడుసార్లు ప్రయత్నం చేసింది. ఈ తరహా చర్యలు కోర్టు విచారణ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన సుమారు 200 మంది రైతులు కన్నుమూశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకు బాధ్యులెవరు? అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వివిధ శాఖల కార్యాలయాలు, ఉద్యోగులను తరలించేందుకు గతంలో ప్రయత్నం చేయగా.. హైకోర్టు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది’ అన్నారు. ఆ ఉత్తర్వులు అమలులో ఉండేలా చూడాలని కోరారు.
చట్టాలు చేయకుండా నిషేధించలేం: ధర్మాసనం
న్యాయవాది పీబీ సురేశ్ స్పందిస్తూ.. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపుతారా? పునఃపరిశీలన చేయమని కోరతారా? రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారా అని పలు సందేహాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం చట్టాలు చేయకుండా నిషేధ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.
* పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ స్పందిస్తూ.. మూడు రాజధానుల చట్టాన్ని (పాలన వికేంద్రీకరణ) చేసే శాసనాధికారం గానీ, దాన్ని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తాజా బిల్లును సవాలు చేస్తూ వ్యాజ్యం వేస్తానన్నారు.
* శాసనసభ కార్యదర్శి తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖర్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టసభల్లో పెట్టిన బిల్లు ఆమోదం పొందాక.. ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు వ్యర్థమవుతాయన్నారు. కొత్త చట్టం తెచ్చినప్పుడు దానిపై అభ్యంతరాలుంటే సవాలు చేసుకోవచ్చన్నారు.
* తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు తరఫున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పందిస్తూ.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరామన్నారు. రాజధానుల విషయంలో శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తమ వ్యాజ్యంపై విచారణ కొనసాగించేందుకు అనుమతివ్వాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!