Dollar Seshadri: డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతి
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు....
గుండెపోటుతో విశాఖలో ఆకస్మిక మృతి
నేడు తిరుపతిలో అంత్యక్రియలు
హాజరుకానున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు- విశాఖపట్నం, ఈనాడు డిజిటల్ -తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకాధికారి (ఓఎస్డీ) డాలర్ శేషాద్రి(73) విశాఖలో హఠాన్మరణం చెందారు. సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విశాఖ వచ్చారు. అదేరోజు సాయంత్రం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవమూర్తుల కల్యాణ రథంలో విశాఖలోని తితిదే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులను దించి, స్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కల్యాణ మండపంలోనే నిద్రకు ఉపక్రమించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఛాతీనొప్పి రావడంతో వ్యక్తిగత సహాయకులు రాంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేజీహెచ్లో శేషాద్రి భౌతికకాయానికి ఎంబామింగ్ చేసి రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు తితిదేకు సమాచారం అందింది.
చిన్న ఉద్యోగంలో చేరి... శ్రీవారి సేవకుడై
తమిళనాడులోని కంచి సమీపంలో ఉన్న నాగల్పాకంలో డాలరు శేషాద్రి జన్మించారు. తిరుపతిలో విద్యాభ్యాసం తర్వాత 1978లో తితిదేలో కొలువులో చేరారు. అనతికాలంలోనే స్వామివారి కైంకర్యాల నిర్వహణలో పట్టు సాధించారు. 2007లో బొక్కసం ఇన్ఛార్జిగా విరమణ చేశారు. నాటి నుంచి ఆలయ ప్రత్యేకాధికారిగా కొనసాగారు. శ్రీవారి ఆలయం, కైంకర్యాలు, స్వామివారి ఆభరణాల గురించి శేషాద్రికి తెలిసినంతగా.. ఇంకెవ్వరికీ తెలియదంటారు. ఆలయ ఆచారాలు, కైంకర్యాలను వివరిస్తూ... డాలరు శేషాద్రి ఆధ్వర్యంలో 2014 నుంచి పుస్తక రూపంలో తితిదే తీసుకొస్తోంది. ప్రస్తుతానికి రెండు సంపుటాలను ముద్రించారు. మిగిలిన మూడు ముద్రణ దశలో ఉన్నాయి.
శేషాద్రి ఎక్కడ?
శంకర్దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తరచూ తిరుమలకు వచ్చేవారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగగానే మొట్టమొదట అడిగేది... డాలరు శేషాద్రి ఎక్కడా అని. ఈయన్ని ఒకసారి తిరుమల నుంచి బదిలీ చేయగా అత్యున్నత స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. శేషాద్రికి సంతానం లేరు. ఆయన కుటుంబానికి కూడా దాదాపు దూరంగా ఉన్నారు. శ్రీవారి ఆలయం వెనకవైపున్న గోవింద నిలయంలోని చిన్న గదిలో నివాసం ఉంటున్నారు.
పొట్టేలు డాలర్... పేరు మార్చింది
తనకు డాలర్ శేషాద్రిగా పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయనే ‘ఈనాడు-ఈటీవీ’కి ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నలభై ఏళ్ల క్రితం ఓ జ్యోతిష్యుడు నా జాతకచక్రం ప్రకారం పొట్టేలు బొమ్మ కలిగిన డాలర్ను ధరించాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే నేను జంతువు బొమ్మను ధరించడం సరికాదన్నా. ఆ శ్రీవారే జంతువులను ఆధారంగా చేసుకుని ఉన్నారని జ్యోతిష్యుడు అనడంతో నాటి నుంచి డాలర్ ధరిస్తున్నా. దీంతో మీడియా ప్రతినిధులు నాఇంటి పేరు పాల శేషాద్రి నుంచి డాలర్ శేషాద్రిగా మార్చారు’ అని వివరించారు.
ఆయన నిష్క్రమణ బాధాకరం
-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
‘స్వామి వారికి నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించిన డాలరు శేషాద్రి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆరోగ్యం ముఖ్యమంటూ నేను పదేపదే వారించాను. తుదిశ్వాస వరకు శ్రీవేంకటేశ్వరుడి సేవలో తరించడమే తన జీవితాశయమని ఆయన చెప్పేవారు. అలాగే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో తరించారు. ఇటీవలే నా పుట్టినరోజున శ్రమకోర్చి దిల్లీదాకా వచ్చి ఆత్మీయ ఆలింగనంతో నన్ను ఆశీర్వదించి వెళ్లారు. ఇంతలోనే నిష్క్రమణ ఎంతో బాధాకరం.
శేషాద్రి సేవలు మరువలేను
-ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
డాలర్ శేషాద్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించా. తితిదేలో పదవులతో నిమిత్తం లేకుండా వివిధ హోదాల్లో అత్యున్నత సేవలందించారు. నేనెప్పుడు తిరుమల వెళ్లినా దర్శన సమయంలో పక్కనే ఉండి ఆలయ విశేషాలను వివరించేవారు.
శ్రీవారి సేవలోనే తరించిన ధన్యజీవి..
డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని, ప్రతిరోజు స్వామి వారి సుప్రభాత సేవ నుంచి శయనోత్సవం వరకు ఆయన చేయి తాకని సేవలు ఉండవని శ్రీత్రిదండి రామానుజ చినజీయర్ స్వామి గుర్తుచేశారు. శేషాద్రి హఠాన్మరణం ఎంతో బాధాకరమని, వేంకటేశ్వర స్వామి సేవలో తరించిన ఆయన తితిదేకు విశేష సేవలందించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. డాలర్ శేషాద్రి తన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని తితిదే ఈవో జవహర్రెడ్డి ఆకాంక్షించారు. డాలర్ శేషాద్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని అదనపు ఈవో ధర్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మాట్లాడుతూ... శ్రీవారి ఆలయంలోని అర్చకులంతా ప్రేమతో ఆయన్ని డాలర్ మామగా పిలుచుకునేవాళ్లమని, ఆయనలేని లోటు ఎవరూ తీర్చలేనిదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!