నేడు జిల్లాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఐకాసల ప్రతినిధులతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై ఐకాస నేతలు శనివారం సుదీర్ఘంగా చర్చించారు.
ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ ఆదివారం నుంచే ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లోనూ ఐకాసల ప్రతినిధులతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణపై ఐకాస నేతలు శనివారం సుదీర్ఘంగా చర్చించారు. రౌండ్టేబుల్ సమావేశాలకు ఎవరెవరు హాజరుకావాలనే దానిపై జిల్లాలకు సమాచారం పంపారు. ఫిబ్రవరి ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టే సమ్మెలోకి ప్రతి ఉద్యోగిని తీసుకురావాలనే లక్ష్యంతో సాధన సమితి ముందుకు కదులుతోంది. ఇప్పటికే చాలా సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. మిగతా సంఘాలను కలిసిరావాలని సమావేశాల సందర్భంగా కోరనున్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమ్మె నోటీసు అందిస్తారు. ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర స్థాయిలో 12మంది సభ్యులతో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ ఆదివారం సమావేశం కానుంది.
ఉద్యమ కార్యాచరణలోకి వీఆర్వోలు: ఉద్యోగుల సమస్యల కోసం చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణలో గ్రామ రెవెన్యూ అధికారులంతా పాల్గొంటారని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతిరాజు రవీంద్రరాజు, అప్పలనాయుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
కర్ణాటకలో అధునాతనం.. మన రాష్ట్రంలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
ఇదీ సంగతి!
ఉన్న కొద్ది భూమిలో కొంత రీసర్వేలో పోగా.. మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పుణ్యమాని మింగేశారు. మరి నువ్వో!!
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం