Delhi: దిల్లీయే లక్ష్యం!
ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,
ముగ్గురు సీఎంల సరికొత్త రాజకీయం
కేంద్రంపై గళమెత్తుతున్న కేసీఆర్, స్టాలిన్, మమత
సామాజిక న్యాయ సమాఖ్యలో చేరాలని తమిళనాడు సీఎం ఆహ్వానం
దిల్లీ, చెన్నై-న్యూస్టుడే: ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు పార్టీలకు చెందినవారు. ఇప్పుడు వారందరి నోట వినిపిస్తున్న మాట కేంద్రంలో ‘ప్రత్యామ్నాయం’. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది. ఎవరికి వారు తమదైన శైలిలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మున్ముందు ఇది ఎలాంటి మలుపు తిరగనుంది? 2024 నాటికి జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? కేంద్రంలోని మోదీ- అమిత్ షా ద్వయానికి ప్రాంతీయ నేతల కూటమి ధీటుగా నిలుస్తుందా? 2019 సార్వత్రిక ఎన్నికల నాటి లోపాల్ని అధిగమిస్తూ.. ఈసారి గేరు మార్చి గమ్యస్థానం చేరగలుగుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతకంతకూ ప్రాబల్యం కోల్పోతున్న నేపథ్యంలో వీరి వ్యాఖ్యలు, ఎత్తుగడలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. దేశంలో సామాజిక న్యాయ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్న ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలంటూ పలు పార్ట్టీల నేతలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆహ్వానం పలికారు. సోనియాగాంధీ, కేసీఆర్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, కేజ్రీవాల్, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరి, అసదుద్దీన్ ఒవైసీ సహా 37 మందికి లేఖలు రాశారు. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ నిర్మాతలు చూడాలనుకున్న సమ సమాజాన్ని నిర్మించగలం. సామాజిక న్యాయానికి రిజర్వేషన్ ఒక్కటే సరిపోదు. ప్రతి అడుగులోనూ కొన్ని ప్రత్యేక అధికారాలు ఉండాలి. మండల్ కమిషన్ ఏర్పాటుకు చూపిన అదే సంకల్పం, ఉద్దేశాన్ని ప్రస్తుతం కూడా చూపించాలి...’ అని దానిలో పేర్కొన్నారు. ఆయా పార్టీల నుంచి అర్హులైన వ్యక్తులను సమాఖ్యలో ప్రతినిధులుగా నియమించాలని కోరారు.
బెంగాల్ వెలుపల పనిపై దృష్టి సారిస్తా: మమత
‘పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు మీరు హామీ ఇస్తే.. నేను రాష్ట్రం వెలుపల నా పనిపై ఎక్కువ దృష్టి సారించగలను. దేశవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ను విస్తరించగలను’ అని మమత బుధవారం పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా కోల్కతాలో కార్యకర్తలకు చెప్పారు. ప్రాంతీయ పార్టీలంతా ఓ తాటిపైకి వచ్చి 2024 లోక్సభ ఎన్నికల్లో భాజపాని ఓడించాలని పిలుపునిచ్చారు. ‘మా లక్ష్యం.. భాజపా పరాజయమే. పశ్చిమ బెంగాల్లో సీపీఎంను ఓడించినట్లే జాతీయ స్థాయిలో భాజపాను మట్టి కరిపించగలం’ అని చెప్పారు. భాజపాపై వ్యతిరేక పోరాటంలో ఏ పార్టీ అయినా అందరితో కలవకుండా అహంకారం ప్రదర్శిస్తూ కూర్చుంటే చేసేదేమీ లేదన్నారు. తమ పార్టీ ఒంటరిగానైనా కమలంతో అమీతుమీ తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్ నేత సుబ్రతా బక్షి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు.
త్వరలో దిల్లీకి కేసీఆర్
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్యేతర, భాజపాయేతర కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలను కలిసిన ఆయన.. తన ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయబోతున్నారు. ఇందుకోసం త్వరలో దిల్లీకి వెళ్లనున్నారు. ఇలాంటి కూటమి కోసం 2019 సాధారణ ఎన్నికల నుంచే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తమిళనాడు వెళ్లి స్టాలిన్తో సమావేశమైనప్పుడు, కేరళ సీఎం పినరయి విజయన్ సహా వామపక్ష నేతలు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కూటమి ఆవశ్యకతను వివరించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM