ap news:డిసెంబరుకల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ
డిసెంబరు కల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో రూ.32,909 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. శాసనసభలో గురువారం ‘ఇళ్ల స్థలాల పంపిణీ-గృహాల నిర్మాణం’ అనే అంశంపై
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు
అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
కేంద్ర సహకారంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఈనాడు, అమరావతి: డిసెంబరు కల్లా టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తవుతుందని, జగనన్న కాలనీల్లో రూ.32,909 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. శాసనసభలో గురువారం ‘ఇళ్ల స్థలాల పంపిణీ-గృహాల నిర్మాణం’ అనే అంశంపై సీఎం మాట్లాడారు. ‘టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. ఇప్పటికే 1,07,814 పూర్తయ్యాయి. 63,305 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. గత జనవరిలోనే వీటి పంపిణీ ప్రారంభించాం. వచ్చే డిసెంబరు నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. నిర్మాణాల పురోగతిని అనుసరించి బిల్లుల చెల్లింపులు సాగుతున్నాయి’ అని తెలిపారు.
తెదేపావల్లే పంపిణీ ఆగింది....
విశాఖలో భూముల సేకరణకు ఇటీవల హైకోర్టు నుంచి క్లియరెన్స్ లభించిందని సీఎం జగన్ తెలిపారు. వచ్చేనెలలో అక్కడికి వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, నిర్మాణాల్ని ప్రారంభిస్తామని చెప్పారు. ‘మాకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో రకరకాల కారణాలు చూపుతూ తెదేపా కోర్టులను ఆశ్రయిస్తోంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులసహా విశాఖలోనూ ఇలాగే జరిగింది. దీనివల్ల ఏడాదిపాటు పట్టాల పంపిణీ ఆగింది. లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 215 చదరపు అడుగులను నిర్మాణానికి నిర్దేశించారు. మా ప్రభుత్వం 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టింది. ప్రభుత్వమే 20 వేల ఇళ్లను స్వయంగా కట్టించి ఆ అనుభవంతో ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేసి, ముందుకు సాగుతున్నాం. ఇళ్ల నిర్మాణంవల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది’ అని వివరించారు. గృహాల నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తోందని సీఎం జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదనరెడ్డి మాట్లాడుతూ... ‘సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల నన్నే కాదు.. మరొకరిని నిల్చోబెట్టినా ఎన్నికల్లో గెలుస్తారు’ అని వ్యాఖ్యానించారు. జగన్ పరిపాలనలో ప్రజల కష్టాలు తీరుతున్నాయని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.
ఈ నెలాఖరుకు 45 వేల టిడ్కో ఇళ్లిస్తాం
ఈ నెలాఖరుకు మొదటి దశలో 45వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని.. ఇప్పటికే 3,488 గృహాలను ఇచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టిడ్కో గృహాలపై శాసన మండలిలో తెదేపా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ఈ ఏడాది జులైలో 95 వేలు, డిసెంబరులో 1.22 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 18 బాల్య వివాహాలు జరిగాయని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత మూడేళ్లలో 1,508 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న 1.53 లక్షల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొడాలి నాని సమాధానంగా చెప్పారు. నూనెల ధరలను నియంత్రించడానికి రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన 229 మందిపై కేసులు నమోదు చేసి 54,145 మెట్రిక్ టన్నుల నూనెలను సీజ్ చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!