Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొదట సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇచ్చిన...
అదృశ్యమైన అధికార పార్టీ నేత
గతంలో ఆయనపై రౌడీషీట్.. ఎత్తివేత
అరెస్టు చేయకుంటే ఉద్యమిస్తామన్న దళిత సంఘాలు
జి.మామిడాడలో డ్రైవరు సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి
ఈనాడు డిజిటల్-రాజమహేంద్రవరం, న్యూస్టుడే-కాకినాడ మసీదు సెంటర్, బాలాజీచెరువు, పెదపూడి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొదట సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా.. తర్వాత హత్య కేసు, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో సెక్షన్లు జోడించారు. కలెక్టర్ ప్రత్యేక అనుమతితో శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసు బందోబస్తు నడుమ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అతని స్వగ్రామం పెదపూడి మండలం జి.మామిడాడకు తరలించి... అంత్యక్రియలు చేశారు. అనంతబాబును పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదనే ప్రశ్న ప్రజా, దళిత సంఘాల నుంచి వినిపిస్తోంది. ఆదివారం సాయంత్రంలోగా అరెస్టు చేయకపోతే సోమవారం నుంచి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ, సీపీఎం నాయకులు ప్రకటించారు.
అదిగో.. ఇదిగో అంటూ..
పోస్టుమార్టం ఆలస్యం కావడం వల్లే కేసులో తాము ముందుకు వెళ్లలేకపోయామని పోలీసులు చెబుతూ వచ్చారు. శనివారం రాత్రే పోస్టుమార్టం పూర్తయింది. ఆదివారం ఉదయం అంత్యక్రియలూ అయిపోయాయి. ఇప్పటికీ ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం అదుపులోకి తీసుకుంటే కస్టడీలో ఉంచాలనే ఉద్దేశంతో పోలీసులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీ ఆదివారం కాకినాడలో ఓ అపార్ట్టుమెంటులో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి చూడగా, ఆయన అక్కడ లేరు. అనంతబాబు భార్య, తల్లి, ఇతర కుటుంబసభ్యులే ఉన్నారు. దీంతో పోలీసులు వారిని ఎమ్మెల్సీ గురించి విచారించారు. ఆయన ఈ రెండు రోజులూ రాజమహేంద్రవరం, కాకినాడ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి తన ఇద్దరు గన్మెన్లను వదిలి వెళ్లినట్లు పోలీసువర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఎమ్మెల్సీ కోసం ఐదు బృందాలు గాలిస్తున్నాయి.
హత్య కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1) ఎమ్మెల్సీ పేరును సవరించిన ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇందులో ఆయనతోపాటు మరికొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. వాళ్లెవరు.. అసలు ఎంతమంది పాత్ర ఉందనే విషయాలు చర్చనీయాంశమయ్యాయి. సుబ్రహ్మణ్యం ఉదంతంలో ఆరుగురు పాల్గొన్నారనీ.. వీరంతా వేరేచోట తలదాచుకున్నారని సమాచారం. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన వాహనంలో తెచ్చినప్పుడు ఆయన ఒక్కరే వచ్చారని కుటుంబసభ్యులు చెబుతున్నా.. మిగిలినవారూ ఆ చుట్టుపక్కలే ఉండొచ్చనే అనుమానం ఉంది.
పోస్టుమార్టం నివేదికలో ఏముంది?
శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసి, నివేదికను పోలీసులకు ఇచ్చారు. తలపై రెండు గాయాలు, రెండు చేతులు విరిచిన ఆనవాళ్లు, ఒళ్లంతా తీవ్రంగా కవుకు గాయాలు, ఎడమ కాలు బొటనవేలు, కుడికాలు మడమ దగ్గర గాయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మర్మావయవం మీద కూడా గట్టిగా తన్నడంతో గాయాలైన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ అనంతబాబుపై గతం నుంచి నేరారోపణలు ఉన్నాయి. రంపచోడవరం పోలీసులు గతంలో రంగురాళ్ల కేసులో రౌడీషీట్ నమోదు చేశారు. మన్యంలో ఈయన చెప్పిందే వేదమని.. ఆయన చెప్పినట్లు ఎవరైనా వినకపోతే ఊరుకోరని అంటారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఉన్న రౌడీషీట్ను ఎత్తేశారు. మరికొన్ని ఇతర కేసులనూ ఆ తర్వాత ఉపసంహరించినట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరిలో ఈయన ప్రముఖుడు. ఈ సాన్నిహిత్యంతోనే డీసీసీబీ ఛైర్మన్ పదవి వరించింది. సాంకేతికంగా ఆ పదవి కోల్పోవడంతో వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కడం.. పార్టీలో ఆయనకున్న పట్టుకు సంకేతం.
రోజంతా తీవ్ర భావోద్వేగాల మధ్యే..
ఓ వైపు భర్త చనిపోయాడనే ఆవేదన.. మరోవైపు అధికార పార్టీ నాయకుల వెతుకులాట.. బేరసారాలు, రాజీ ప్రయత్నాలు... ఇంకో వైపు పోస్టుమార్టంకు ఒప్పుకోవాలని పోలీసుల ఒత్తిడి. ఇవీ శుక్ర, శనివారాల్లో సుబ్రహ్మణ్యం భార్య, కుటుంబసభ్యులకు ఎదురైన అనుభవాలు. ఎంతమంది బెదిరించినా.. ఆశచూపి బేరాలాడినా.. సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ మాత్రం చాలావరకూ పట్టు వదల్లేదు. తొలుత ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డిమాండు చేసినా, తర్వాత 302 సెక్షన్ పెట్టాల్సిందేనన్నారు. ఆమెకు నచ్చజెప్పి పోస్టుమార్టం చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. శనివారం మధ్యాహ్నం సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని వైకాపా నేతల వద్దకు తీసుకెళ్లి రాజీ చేసినట్లు కొద్దిసేపు ప్రచారం జరిగింది. కొద్దిసేపటికే వారు తమకు న్యాయం చేయాలంటూ వీడియో విడుదల చేయడంతో.. ఆ ప్రచారం తప్పని అర్థమైంది. ఇదేతరుణంలో దళిత సంఘాలు, ప్రజాసంఘాలు బలంగా నిలబడటం అపర్ణకు ఊతమిచ్చింది. 302, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ సెక్షన్లు పెట్టినట్లు ఎస్పీ ప్రకటించాకే ఆమె పోస్టుమార్టంకు అంగీకరించారు. శనివారం ఉదయం నుంచి పోస్టుమార్టం జరిగే వరకూ ఉద్యమాన్ని దగ్గరుండి నడిపించడంలో హైకోర్టు న్యాయవాది శ్రవణ్కుమార్ కీలకపాత్ర పోషించారు. కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా పోస్టుమార్టం చేస్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని బైఠాయించారు. దీంతో అపర్ణ సరేనన్న తర్వాతే అర్ధరాత్రి పోస్టుమార్టం చేశారు.
నల్లమిల్లి గృహ నిర్బంధం
అనపర్తి, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు నిరంకుశంగా ఉందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ పూర్వ కారు డ్రైవరు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ఆదివారం జి.మామిడాడ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలో గృహనిర్బంధం చేశారు. అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జిగా ఉన్న తాను మృతదేహాన్ని సందర్శించి, నివాళి అర్పించాల్సిన బాధ్యత ఉన్నా ఉదయం నుంచి పోలీసులు గృహనిర్బంధం చేయడం బాధాకరమని రామకృష్ణారెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?