సెయింట్‌ లూయిస్‌లో శ్రీవారి కల్యాణం

అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణం

Published : 29 Jun 2022 05:22 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి గరుడ వాహన సేవ కనులపండువగా జరిగింది. వేల మంది భక్తులు కల్యాణ ఘట్టాన్ని తిలకించడానికి తరలివచ్చారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఏఈవో వెంటేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, ది హిందూ టెంపుల్‌ ఆఫ్‌ సెయింట్‌ లూయిస్‌ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ రజనీకాంత్‌, అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని