ముక్కులో దూరిన రొయ్య

చెరువులో పట్టుబడి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ముక్కు రంధ్రంలోకి రొయ్య దూరి ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలంలో బుధవారం

Published : 07 Jul 2022 08:32 IST

ఎండోస్కోపీతో తొలగించిన వైద్యుడు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: చెరువులో పట్టుబడి చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ముక్కు రంధ్రంలోకి రొయ్య దూరి ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలంలో బుధవారం జరిగింది. ముక్కు నుంచి అది ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బాధితుడు ఉక్కిరిబిక్కిరయ్యారు. అతడిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు ఎం.రామకృష్ణ పరీక్షించి ముక్కు రంధ్రాల్లో రొయ్య ముళ్లు లోపలికి గుచ్చుకున్నట్లు గుర్తించారు. ఎండోస్కోపీ చికిత్సతో ఆ రొయ్యను బయటకు తీశారు. వైద్యుడు చాకచక్యంగా రొయ్యను బయటకు తీశారని, అప్పటికి అది బతికే ఉండటం విశేషమని వైద్య సిబ్బంది వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని