Andhra News: మొన్న ‘రెడ్డి’.. ఈసారి ‘గోవిందా’!: ఏపీ మంత్రికి తప్పని పేరు ఘోష..

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక ఇబ్బంది తప్పట్లేదు. ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాల్లో ఆయన ఇంటిపేరు మారిపోయింది. గతంలో తిరుపతి అపాచీ

Updated : 17 Aug 2022 08:15 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక ఇబ్బంది తప్పట్లేదు. ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాల్లో ఆయన ఇంటిపేరు మారిపోయింది. గతంలో తిరుపతి అపాచీ కంపెనీ ప్రారంభోత్సవంలో తనను అమర్‌నాథ్‌రెడ్డిగా సంబోధించారని.. ఈ తప్పు పునరావృతం కానీయొద్దని సమావేశం ఏర్పాటుచేసి మరీ అమర్‌నాథ్‌ చెప్పారు. మంగళవారం నాటి సమావేశంలో అందరూ బాగానే మాట్లాడారు. జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ టాగా మసయుకీ మాట్లాడుతూ ‘గోవిందా అమర్‌నాథ్‌’ అని పలికారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. అదే సమయంలో అమర్‌నాథ్‌ తన పక్కనే ఉన్న ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు చెవిలో ఏదో చెబుతూ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని