విలీన మండలాలు విలవిల

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలకు మరోసారి వరద ముప్పు ముంచుకొచ్చింది. గత నెల 9న ప్రారంభమైన వరద ఇప్పటికీ వేధిస్తుండగా... బుధవారం చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండల

Published : 18 Aug 2022 04:56 IST

చింతూరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలకు మరోసారి వరద ముప్పు ముంచుకొచ్చింది. గత నెల 9న ప్రారంభమైన వరద ఇప్పటికీ వేధిస్తుండగా... బుధవారం చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండల కేంద్రాలు మరోసారి నీటమునిగాయి. కూనవరం కొత్త బస్టాండ్‌, అటవీశాఖకు వెళ్లే రహదారితోపాటు చింతూరు, టేకులబోరు గ్రామాల్లోని అనేక ఇళ్లు, దుకాణాలు గోదావరి నీటిలో చిక్కుకున్నాయి. జులైలో మాదిరిగానే ప్రస్తుతం సంభవించిన వరద గ్రామాలను ముంచేస్తోంది. సహాయక చర్యలు లేక ముంపు బాధితులు విలవిలలాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని