Telangana News: ‘షెడ్యూల్ 9’ సంస్థల విభజన వద్దు
రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సర్కారు ఎదుట గట్టి వాదనలు వినిపించింది. హెడ్క్వార్టర్ అన్న అంశానికి కోర్టు నుంచి స్పష్టమైన నిర్వచనం వెల్లడయ్యేంతవరకు షెడ్యూల్ 9లోని సంస్థల విభజన జోలికి వెళ్లకూడదని కోరింది.
కోర్టు స్పష్టత ఇచ్చేంతవరకు ఆ అంశం జోలికి వెళ్లవద్దు
‘షెడ్యూల్ 10’ సంస్థలను ప్రాంత ప్రాతిపదికన పంచాల్సిందే
11 ‘విభజన అంశాల’పై తెలంగాణ గట్టి వాదనలు
ఈనాడు, దిల్లీ: రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర సర్కారు ఎదుట గట్టి వాదనలు వినిపించింది. హెడ్క్వార్టర్ అన్న అంశానికి కోర్టు నుంచి స్పష్టమైన నిర్వచనం వెల్లడయ్యేంతవరకు షెడ్యూల్ 9లోని సంస్థల విభజన జోలికి వెళ్లకూడదని కోరింది. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి షెడ్యూల్ 10లోని సంస్థలను ప్రాంత (లొకేషన్) ప్రాతిపదికన, వాటి నగదును జనాభా ప్రాతిపదికన పంచుకోవడానికి తాము సిద్ధమేనని, అందుకు విరుద్ధమైతే అంగీకరించబోమని స్పష్టం చేసింది. దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి అజయ్భల్లా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. సుమారు 1.50 గంటలపాటు జరిగిన ఈ సమావేశ ఎజెండాలోని 11 అంశాలపై తన వాదనలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా, ఏపీ సర్కారు మాత్రం వెల్లడించలేదు. తెలంగాణ లేవనెత్తిన అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తగు సూచనలు చేశారు. కొన్నిటిని న్యాయశాఖ పరిశీలనకు పంపాలని తమ సిబ్బందిని ఆదేశించారు. తెలంగాణ బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వం వహించారు. ఇంధన, ఆర్థికశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్శర్మ, కె.రామకృష్ణారావు, పరిశ్రమలు వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, రహదారులు- భవనాలశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్, దిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
ఇవీ తెలంగాణ వాదనలు
1. షెడ్యూల్ 9లోని సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల విభజన: విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థలను విభజించాల్సి ఉంది. షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ 90 సంస్థలకు సంబంధించి సిఫార్సులు చేసింది. ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాన్ని హెడ్క్వార్టర్గా పరిగణించనున్నట్లు 2017 మే నెలలో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం షీలా భిడే కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాలని కోరింది. కొన్ని సంస్థలకు సంబంధించిన కేసులు కోర్టులో ఉన్నందున అవి పరిష్కారమయ్యేవరకు తదుపరి చర్య తీసుకోవడం సాధ్యం కాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. హెడ్క్వార్టర్ అంశం కూడా కోర్టు ముందున్నట్లు తెలిపింది.
* షెడ్యూల్ 9లోని సంస్థ ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్రహోంశాఖకు కానీ ఎలాంటి న్యాయ పరిధీ లేదని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో హైకోర్టు చెప్పిన విషయాన్ని తెలంగాణ అధికారులు గుర్తుచేశారు.
2. ఏపీ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్ఎఫ్సీ): ఈ సంస్థ పాలకమండలిని పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ ప్రభుత్వం 2016 మే నెలలోనే కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసినా అది జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన పాలకమండలి ఏకపక్షంగా ఈ సంస్థ విభజన ప్రణాళికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 238 ఎకరాల భూమిని తెలంగాణ స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. 2015 నవంబరులో హైకోర్టు దీనిపై యథాతథ (స్టేటస్కో) ఉత్తర్వులిచ్చింది.
3. 10వ షెడ్యూల్లోని ఆస్తుల విభజన: పదో షెడ్యూల్లో 142 సంస్థలున్నాయి. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ సంస్థల నగదు నిల్వలను జనాభా నిష్పత్తి ప్రకారం, ఆస్తులను అవి ఉన్న ప్రాంతం ప్రకారం పంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం మౌఖిక ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కేంద్ర హోంశాఖ జారీచేసిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేయాలి తప్ప, పునస్సమీక్షించడానికి వీల్లేదు.
4. సింగరేణి బొగ్గు గనులు, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ విభజన: సింగరేణిలోని 51% ఈక్విటీ తెలంగాణకు దక్కుతుందని విభజన చట్టంలోనే ఉన్నందున దాని ఆస్తుల విభజన ప్రశ్నే తలెత్తదని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ సింగరేణికి అనుబంధ సంస్థగా ఉన్నందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఈక్విటీని మాత్రమే విభజించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
5.ఏపీ పౌరసరఫరాల సంస్థకు బకాయిలు: పౌరసరఫరాల కార్పొరేషన్ విభజనకు ముందు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉపయోగించుకున్న క్యాష్క్రెడిట్ బకాయి అంశంపై వివాదం ఉంది. కేంద్రం విడుదల చేసే ఆహారసబ్సిడీ మొత్తాన్ని తెలంగాణకు బదిలీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ హామీ ఇస్తేనే ఆ క్యాష్ క్రెడిట్కు సంబంధించిన అసలును చెల్లిస్తామని తెలంగాణ షరతు విధించింది.
6. చట్టంలో చెప్పని సంస్థల విభజన: చట్టంలో ఎక్కడా పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రస్తావించింది. అందుకు తెలంగాణ అభ్యంతరం చెబుతూ.. అలా చేస్తే చట్టాన్ని సవరించినట్లవుతుందని అభ్యంతరం తెలిపింది.
7. క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ విభజన: కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల పంపిణీపై కాగ్ సాయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి.
8. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదలలో జాప్యం: తెలంగాణ విజ్ఞప్తి మేరకు ఆ నిధులను విడుదల చేయాలని హోంశాఖ కార్యదర్శి ఆర్థికశాఖ అధికారులకు సూచించారు.
9. గిరిజన విశ్వవిద్యాలయం: గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయాన్ని తెలంగాణ ప్రధాన కార్యదర్శి ప్రస్తావించారు. ఇందుకు భూమిని కూడా కేటాయించినట్లు తెలిపారు.
10. రైల్ కోచ్ ఫ్యాక్టరీ: రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 150 ఎకరాల భూమిని కేటాయించినట్లు తెలంగాణ ప్రతినిధులు తెలిపారు.
11. పన్ను విషయాల్లో లోపాల దిద్దుబాటు: విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలను సరిదిద్దుతూ విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం కుదరదని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.