చదువును ప్రోత్సహించేలా పథకాలు
రాష్ట్రంలో పిల్లల చదువులను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలను నిరోధించేలా వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను రూపొందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్
ఆరోగ్యశ్రీ చికిత్సలను 3,254కు పెంచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో వెల్లడి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పిల్లల చదువులను ప్రోత్సహించేలా, బాల్య వివాహాలను నిరోధించేలా వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను రూపొందించామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఈ రెండు పథకాలను ప్రారంభించి, మాట్లాడారు. ‘కల్యాణమస్తు, షాదీ తోఫా ప్రోత్సాహకాలను పొందాలనుకునే వధూవరులిద్దరూ కచ్చితంగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన పెట్టడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివిస్తారు. పెళ్లి నాటికి అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు దాటి ఉండాలన్న నిబంధనతో బాల్య వివాహాలనూ నిరోధించొచ్చు. గత ప్రభుత్వంలో పెళ్లి కానుక పథకాన్ని ప్రకటించి 2018లో ఆపేశారు. 17,709 మంది లబ్ధిదారులకు రూ.68.68 కోట్ల వివాహ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మా ప్రభుత్వం అర్హులైన వారందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఇప్పుడు రెట్టింపు వివాహ ప్రోత్సాహం అందుతుంది. కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. పెళ్లైన 60 రోజుల్లో వాలంటీర్ల సాయంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన వారికి ప్రతి మూడు నెలలకోసారి పథకాన్ని వర్తింపజేస్తాం. అక్టోబరు, నవంబరు, డిసెంబరులో దరఖాస్తులు చేసుకునే లబ్ధిదారులకు జనవరిలో సాయం అందిస్తాం. ఇలా ప్రతి మూడు నెలలకోసారి అర్హులను గుర్తించి ప్రోత్సాహకాలు అందజేయనున్నాం. వివాహ ధ్రువీకరణ పత్రాలూ సచివాలయాల్లోనే జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
‘ఆరోగ్యశ్రీ’లోకి కొత్త సేవలు: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్త చికిత్సలను ముందుగా పేర్కొన్నట్లు అక్టోబరు 5కు బదులు 15 నుంచి అమల్లోకి తేవాలని సీఎం జగన్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుతున్న 2,446 చికిత్సల సంఖ్యను 3,254కు పెంచనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం ప్రకటించారు. ‘‘ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త చికిత్సల చేరిక దాదాపు ఖరారైంది. కొన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. పెరిగిన చికిత్సల సంఖ్యతో ఏటా ఆరోగ్యశ్రీ కింద రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీంతో పాటు ‘ఆరోగ్య ఆసరా’ కింద రూ.300 కోట్లు, 108, 104ల కోసం రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. వైద్య కళాశాలల నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలి. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని నవంబరు నాటికి పూర్తి చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.
రోగుల ఆహార ఛార్జీల పెంపు
‘‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఆహార ఛార్జీలను పెంచుతున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం చేరే వారితో సమానంగా రోజుకు రూ.100 ఆహార ఛార్జీల కింద చెల్లిస్తాం. జూనియర్ డాక్టర్లకు ఇచ్చే ఉపకార వేతనాన్ని పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ కింద ప్రకటించిన 10 అవార్డుల్లో 6 రాష్ట్రానికి వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి (కొవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీఎస్ నవీన్కుమార్, రాష్ట్ర వైద్య విధాన పరిషత్తు కమిషనర్ వినోద్కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం