దుకాణాలన్నీ కొనసాగిస్తుంటే.. మద్యనిషేధం ఇంకెప్పుడు?
రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.
దుకాణాలు మరో ఏడాది యథాతథం
వరుసగా మూడో ఏడాదీ వాటి సంఖ్య తగ్గింపు ఊసే లేదు
పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాకిన్ షాప్ల ఏర్పాటుకు అనుమతి
ఇప్పుడున్న వాటికి ఇవి అదనం!
2022-23కు విధానం ఖరారు చేసిన ప్రభుత్వం
ఈనాడు - అమరావతి
రెండేళ్లకో, మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. 5 నక్షత్రాల హోటళ్లు మినహా ఇంకెక్కడా మద్యం లభించకుండా చేస్తాం.
- ప్రతిపక్ష నేత హోదాలో విజయవాడలో 2015 డిసెంబరు 8న విలేకర్లతో జగన్ మోహన్రెడ్డి వ్యాఖ్యలు
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5 నక్షత్రాల హోటళ్లలోనే మద్యం దొరికేలా చేస్తాం.
- 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ
మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశలవారీ మద్యనిషేధం అమలు చేస్తాం. దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల నాటికి కేవలం 5 నక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతాం.
- ఎన్నికల్లో గెలిచాక దిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లో 2019 మే 26న జగన్
మద్యనిషేధం హామీకి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. మన ప్రభుత్వంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని ప్రతిపక్ష నేత హోదాలోనూ, దశలవారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచాక దిల్లీలో నిర్వహించిన ప్రెస్మీట్లోనూ చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఇప్పుడు నాలుక మడతేసి అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మద్యనిషేధానికి నీళ్లొదిలేసినట్లేనని తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. 2022-23కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఖరారు చేసిన నూతన మద్యం విధానమే అందుకు తార్కాణం. ఇప్పుడున్న మద్యం దుకాణాల సంఖ్య ఒక్కటి కూడా తగ్గించకుండా వాటన్నింటినీ మరో ఏడాది యథాతథంగా కొనసాగిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ విధానం నేటి నుంచి 2023 సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉంటుందని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తొలి ఏడాదే తగ్గింపు.. తర్వాత ఆ ఊసే లేదు
* వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ ఏడాదికి ఒకటి చొప్పున నాలుగుసార్లు మద్యం విధానాల్ని ఖరారు చేసింది. అయితే మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపు మాత్రం తొలి ఏడాదికే పరిమితమైంది. తర్వాత ఆ ఊసే లేదు. 2020 మార్చి 22 నుంచి ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తగ్గించలేదు. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో ఏడాది కూడా ఇప్పుడున్న దుకాణాల సంఖ్యలో మార్పు ఉండదు. దశలవారీ మద్యనిషేధం అంటే ఏటా దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వెళ్లాలి. కానీ అలా చేయలేదు.
* వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో నాటికి 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. 2019 అక్టోబరు 1 నుంచి 2020 వరకూ అమలైన విధానంలో వాటిని 3,500కు తగ్గించింది. 2020 మార్చి 22 వరకూ అవి అలాగే కొనసాగాయి. మొదటి దశ లాక్డౌన్ తర్వాత 2020 మే నెలలో వాటి సంఖ్యను 2,934కు తగ్గించింది. ఆ తర్వాత నుంచి తగ్గింపు అనే మాటే లేదు.
* 2020 అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ అమలైన విధానంలోనూ దుకాణాల సంఖ్యను తగ్గించలేదు. అంతకు ముందున్న 2,934 కొనసాగాయి. కొన్ని నెలల ముందే తగ్గించినందున మళ్లీ తగ్గించాల్సిన అవసరం లేదని అప్పట్లో ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు.
* 2021 అక్టోబరు 1 నుంచి 2022 సెప్టెంబరు 30 వరకూ అమలైన విధానంలోనూ, తాజాగా 2023 సెప్టెంబరు 30 వరకూ కాలపరిమితితో ప్రకటించిన విధానంలో కూడా దుకాణాల తగ్గింపు ఊసే లేదు.
చిత్తశుద్ధి ఉంటే.. ఈపాటికే దాదాపు తగ్గాలి కదా!
జగన్ హామీ ఇచ్చినట్లు, వైకాపా ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్లు 2024 నాటికి స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం కావాలంటే... ఏటా కనీసం 33 శాతం చొప్పున మద్యం దుకాణాలను తగ్గించుకుంటూ పోవాలి. వైకాపా అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడున్నరేళ్లయింది. ఆ లెక్కన చూసినా ఇప్పటికే దుకాణాలు నామమాత్రంగా ఉండాలి. కానీ తొలి ఏడాదిలో 33 శాతం మేర దుకాణాల తగ్గింపు మినహా ఆ దిశగా తగిన చర్యలు లేవు. శుక్రవారం ఖరారు చేసిన మద్యం విధానం 2023 సెప్టెంబరు 30 వరకూ అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ప్రస్తుత వైకాపా ప్రభుత్వ కాలపరిమితి మరో ఆరేడు నెలలే ఉంటుంది. మద్యనిషేధంపై చిత్తశుద్ధి, సంకల్పం నిజంగా ఉంటే తాజాగా ఖరారు చేసిన విధానంలోనే దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి ఉండాలి. కానీ జగన్ ప్రభుత్వానికి అది పట్టలేదు. మద్యనిషేధం హామీకి తూట్లు పొడవటానికే ఇలా చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పారదర్శకత, అక్రమాల నిరోధం మాటలు ఇప్పుడేమయ్యాయి?
‘ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడతాం. లావాదేవీల్లో పారదర్శకత, అక్రమాల నిరోధం కోసం డిజిటల్ చెల్లింపుల్ని అమలు చేస్తాం’ అని 2021-22 మద్యం విధానంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ అమలు చేయలేదు. తాజాగా 2022-23కి ఖరారు చేసిన విధానంలో అసలు డిజిటల్ చెల్లింపుల ప్రస్తావనే లేదు. దీని ఆంతర్యమేంటి? అంటే ఇప్పుడు పారదర్శకత వద్దనా? అక్రమాల నిరోధం వద్దనా? ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ప్రభుత్వం నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుబాటు తగ్గించాల్సింది పోయి.. ఎలైట్ షాపులా?
మద్యనిషేధం అంటే వీలైనంత వరకూ మద్యం అందుబాటును తగ్గించాలి. కానీ ప్రభుత్వ తీరు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మద్యం వాకిన్ షాప్ (ఎలైట్ షాప్)ల పేరిట మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకొస్తోంది. అంతకు ముందులాగే ఈ ఏడాది కూడా ఎలైట్ షాపులు పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. అయితే వీటితో కలిపినా మొత్తం దుకాణాల సంఖ్య 2,934కు మించకూడదని పేర్కొంది. మరింత ఆదాయం రాబట్టుకోవటమే లక్ష్యంగా వాకిన్ షాపులకు మళ్లీ అనుమతిచ్చింది.
మద్యనిషేధమే లక్ష్యమైతే.. పర్యాటక కేంద్రాల్లో ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు?
ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యే యథాతథంగా కొనసాగుతుందని ఓవైపు చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు పర్యాటక కేంద్రాల్లో లిక్కర్ అవుట్లెట్లు, వాకిన్ షాప్ల ఏర్పాటుకు తాజా విధానంలో అనుమతిచ్చింది. అంటే మరిన్ని మద్యం దుకాణాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. బెవరేజస్ కార్పొరేషన్ అనుమతితో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మద్యనిషేధమే ప్రభుత్వ లక్ష్యమైతే మరి వీటి ఏర్పాటుకు ఎందుకు అనుమతిస్తున్నట్లు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434