ఎవరి వెలుగులకీ విద్యుత్ బస్సులు?
ఆర్టీసీలో కొత్తగా 4 వేల విద్యుత్ ఏసీ బస్సులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తగా అవసరమైన బస్సులన్నింటినీ విద్యుత్ బస్సులే తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆర్టీసీలో 4 వేల వాహనాలు తీసుకునేందుకు ప్రణాళిక
అత్యధికంగా అద్దె ప్రాతిపదికనే
ఇప్పుడున్న ఏసీ బస్సులకు 50% దాటని ఓఆర్
ఈనాడు - అమరావతి
ఆర్టీసీలో కొత్తగా 4 వేల విద్యుత్ ఏసీ బస్సులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తగా అవసరమైన బస్సులన్నింటినీ విద్యుత్ బస్సులే తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత బస్సుల స్థానంలో తక్షణమే కొత్తవి అవసరమని ప్రభుత్వానికి ఆర్టీసీ కొంతకాలం కిందట తెలిపింది. దీనిపై ఇటీవల సీఎం వద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని బస్సులు అవసరమన్నది చర్చకు రాగా.. 4 వేలు వరకు తీసుకోవాల్సి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అవన్నీ విద్యుత్ ఏసీ బస్సులే తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని, తక్కువ ధరకు వస్తే కొన్ని కొనుగోలు చేద్దామని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ బస్సులను నాలుగు విడతలుగా తీసుకోవడంపై అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు.
హైవేలపైనే ఏసీ బస్సులు
కొత్తగా తీసుకోవాలనుకుంటున్న ఏసీ బస్సులను ప్రధాన మార్గాలు, హైవేలపై నడిచే సర్వీసుల స్థానంలో నడపాలని భావిస్తున్నారు. ఈ బస్సులు ఒకసారి పూర్తిస్థాయిలో ఛార్జింగ్ పెడితే 150 నుంచి 200 కి.మీ. వరకు నడిచేందుకు వీలుంటుంది. దీంతో ఓ జిల్లా పరిధిలో, రెండు జిల్లాల మధ్య నడిపేందుకు మాత్రమే వీలుంటుంది. ఇప్పటివరకు ఆ మార్గాల్లో ఉన్న ఎక్స్ప్రెస్, డీలక్స్ తదితర సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు రూట్లకు మళ్లించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. మున్ముందు అవసరమైతే గ్రామాలకు కూడా ఏసీ సర్వీసులు నడిపే విషయంపైనా ఆలోచిస్తున్నారు.
ఎవరికి మేలు?
వేల సంఖ్యలో విద్యుత్ ఏసీ బస్సులు తీసుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం కల్పించనున్నారు అనేది ప్రశ్నార్థకం అవుతోంది. కేంద్రం ఫేమ్-2 పథకం కింద ఆర్థిక సాయం చేయడంతో 350 విద్యుత్ ఏసీ బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని కొంత కాలం కిందట భావించారు. చివరకు 100 బస్సులు తీసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు తిరుపతి-తిరుమల మధ్య నడపాలనుకున్న 50 బస్సుల్లో 10 వచ్చాయి. అయితే ఇదేవిధంగా నాలుగు వేల విద్యుత్ బస్సులు తీసుకుంటే సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది. విద్యుత్ బస్సులు తయారుచేసే కంపెనీలు, అద్దెకు ఈ బస్సులు నడిపే కంపెనీలకు మాత్రమే మేలు కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉన్న వాటిలోనే ప్రయాణించే వారు తక్కువ..
ప్రస్తుతం ఆర్టీసీలో 350 వరకు వివిధ రకాల ఏసీ బస్సులు (డీజిల్ బస్సులు) ఉండగా, వీటిలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం సగటున ఓఆర్ 50% కూడా దాటడంలేదు. వీటిలో ప్రయాణించే వారు మరీ తక్కువగా ఉండటంతో ఇటీవలే వివిధ జిల్లాల ఆర్టీసీ అధికారులు టికెట్ ఛార్జీల్లో రాయితీలు సైతం ఇచ్చారు. విజయవాడ నుంచి బెంగళూరు మధ్య తిరిగే ఏసీ సర్వీసుల్లో వారాంతం మినహా మిగిలిన రోజుల్లో 20%, విజయవాడ-హైదరాబాద్ మార్గంలో 10% రాయితీ ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకునే యత్నం చేశారు. దూర ప్రాంతాలకు తిరిగే ఏసీ బస్సులకే ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ లేకపోతే.. దగ్గర ప్రాంతాలకు తిరిగే సర్వీసుల్లో ఏసీ బస్సులను ప్రవేశపెడితే ఆర్టీసీకి నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?