సంక్షిప్త వార్తలు(4)
రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులను శనివారం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యనిర్వాహక సహాయకుడిగా, సాధారణ పరిపాలనశాఖలో ఉప కార్యదర్శిగా (సమన్వయం) పని చేస్తున్న ఎన్.తేజ్ భరత్ను తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ ఉన్న శ్రీధర్ చామకూరిని భూపరిపాలన ప్రధాన కమిషనరు (సీసీఎల్ఏ) కార్యాలయంలో విజిలెన్స్ విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఆ పోస్టులో ఉన్న అపరాజిత సింగ్ సిన్సిన్వార్ను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ జేసీగా ఉన్న రావిరాల మహేష్ కుమార్ను పంచాయతీరాజ్శాఖ అదనపు కమిషనరుగా నియమించింది.
ఐఏఎస్ అధికారుల బదిలీ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొందరు ఐఏఎస్ అధికారులను శనివారం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కార్యనిర్వాహక సహాయకుడిగా, సాధారణ పరిపాలనశాఖలో ఉప కార్యదర్శిగా (సమన్వయం) పని చేస్తున్న ఎన్.తేజ్ భరత్ను తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ ఉన్న శ్రీధర్ చామకూరిని భూపరిపాలన ప్రధాన కమిషనరు (సీసీఎల్ఏ) కార్యాలయంలో విజిలెన్స్ విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఆ పోస్టులో ఉన్న అపరాజిత సింగ్ సిన్సిన్వార్ను కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా, అక్కడ జేసీగా ఉన్న రావిరాల మహేష్ కుమార్ను పంచాయతీరాజ్శాఖ అదనపు కమిషనరుగా నియమించింది. నంద్యాల సంయుక్త కలెక్టరు నారపురెడ్డి మౌర్య సెలవుపై వెళ్లారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న టి.నిశాంతిని ఆ స్థానానికి బదిలీ చేసింది. సెలవు నుంచి వచ్చిన తర్వాత సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా మౌర్యకు సూచించింది.
కేంద్ర సర్వీసుకు సాల్మన్ ఆరోఖ్యరాజ్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ కేంద్ర సర్వీసుకు వెళుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఐదేళ్లపాటు ఆయన ఆ పోస్టులో కొనసాగుతారు.
యాంటీ బయాటిక్స్ కట్టడికి చర్యలు
ఈనాడు, అమరావతి: మితిమీరిన యాంటీ బయాటిక్స్ వినియోగం పేదలపై ఆర్థిక భారాన్ని మోపుతోందని, వైద్య ఖర్చులనూ పెంచుతోందని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధిని తగ్గించే ప్రక్రియలో వీటి వాడకాన్ని చివరి ప్రయత్నంగా కాకుండా ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నియంత్రణ... రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఖరారు’పై సదస్సు ముగింపు సమావేశంలో కృష్ణబాబు మాట్లాడారు. ‘ఔషధ దుకాణాల్లో మందు, మందుల చీటీ అధికారికంగా నమోదైనప్పుడే యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని తగ్గించవచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఎంఆర్ కాల్ ఫర్ యాక్షన్’ పేరిట రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. సదస్సులో ఏఎంఆర్ కార్యాచరణ ప్రణాళిక బలోపేతానికి సంబంధించిన ‘విజయవాడ డిక్లరేషన్’ను విడుదల చేశారు.
ఇందూ ప్రాజెక్టు దివాలా ప్రక్రియలో ఎర్తిన్ అప్పీలు కొట్టివేత
ఈనాడు, హైదరాబాద్: ఇందూ ప్రాజెక్టు దివాలా ప్రక్రియలో రూ.500 కోట్లకు కంపెనీని దక్కించుకున్న ఎర్తిన్ కన్సార్షియానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎర్తిన్ సకాలంలో డబ్బు చెల్లించకపోవడంతో మరోసారి దివాలా ప్రక్రియ చేపట్టేందుకు ‘రిజల్యూషన్ ప్రొఫెషనల్’ చేసిన విజ్ఞప్తిని అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ శాఖ గతంతో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఎర్తిన్ సంస్థ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్లో అప్పీలుకు వెళ్లింది. ఎన్సీఎల్టీ హైదరాబాద్ శాఖ 2022 సెప్టెంబరు 5న జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి పొరపాట్లు లేవని, ఎర్తిన్ అప్పీలును కొట్టివేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ తీర్పు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం