చెన్నై వ్యాపారి చెప్పిందే శాసనం
తిరుపతి జిల్లాలో సిలికా శాండ్ తవ్వకాలు, రవాణాలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. చైన్నైకి చెందిన బడా వ్యాపారి ఇందులో చక్రం తిప్పుతున్నారు.
తిరుపతి జిల్లాలో ఇష్టారాజ్యంగా సిలికా శాండ్ తవ్వకాలు
అనుమతికి మించి రెట్టింపు లోతున ఖనిజం వెలికితీత
లీజు బయట ప్రభుత్వ భూముల్లోనూ దోపిడీ
ఈనాడు- అమరావతి, న్యూస్టుడే- చిల్లకూరు: తిరుపతి జిల్లాలో సిలికా శాండ్ తవ్వకాలు, రవాణాలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. చైన్నైకి చెందిన బడా వ్యాపారి ఇందులో చక్రం తిప్పుతున్నారు. అనేక లీజులను తమ ఆధీనంలోకి తీసుకుని.. పూర్తి స్థాయి అనుమతులు లేకపోయినా తవ్వడం, లీజు బయట ప్రభుత్వ భూముల్లోనూ వెలికితీయడం, పరిమితికి మించి ఖనిజాన్ని లోడ్ చేసి తరలించడం.. ఇలా అన్నింటా ఉల్లంఘనల పర్వం సాగుతోంది. వీటిపై ఆయాశాఖల అధికారులు ఎవరూ నోరెత్తడం లేదు. చిల్లకూరు, కోట మండలాల్లో ఉన్న సిలికా లీజుల్లో కొన్నింటిని చెన్నై వ్యాపారి రెండేళ్లుగా తన ఆధీనంలోకి తీసుకున్నారు. మినరల్ డీలర్ లైసెన్సులు పొందిన ఆయన లీజుదారులకు టన్నుకు రూ.100-150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పించారు. వీటిలో చాలా లీజుల్లో నిబంధనల ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
* చిల్లకూరు మండలంలోని బల్లవోలులో ఎస్.కృష్ణారెడ్డి పేరిట ఉన్న సిలికా శాండ్ లీజులో తవ్వకాలు సాగిస్తున్న చెన్నై వ్యాపారి.. దాని పక్కనున్న ప్రభుత్వ భూములనూ చెరబట్టారు. ఇప్పటికే వాటిలో 20 ఎకరాల్లో సిలికా తవ్వి తరలించారు. మరో 25 ఎకరాల్లో తవ్వకాలకు సిద్ధమయ్యారు. ఇందుకు ఓ స్థానిక నేత సహకరిస్తున్నారు. ఆ నాయకుడు ప్రభుత్వ భూముల్లో వేరుశెనగ సాగు చేసే రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు చొప్పున ఇస్తామని చెబుతున్నారు. సిలికా తవ్వకాలకు అంగీకరించని రైతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
* అదే మండలంలోని వరగలివద్ద వై.జానకిరామిరెడ్డి పేరిట ఉన్న లీజులో రెండేళ్లుగా చెన్నై వ్యాపారి సిలికా తవ్విస్తున్నారు. దీని గడువు సెప్టెంబరుతో ముగిసింది.
రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నట్లు గనులశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుత లీజుల్లో గడువు ముగిసిన వాటికి వచ్చే మార్చి నెలాఖరు వరకు లీజు కొనసాగించే వీలుంది. దీనికి మైనింగ్ ప్లాన్ అనుమతులు రాకున్నా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఆ లీజులో వాహనాలు వెళ్లేందుకు గతంలో వేసిన దారుల కింద సిలికా తవ్వేస్తుండటం అక్రమాలకు పరాకాష్ఠ.
* ఏ లీజులో సిలికా తవ్వినా తమిళనాడు వ్యాపారి యార్డుకే తరలిస్తున్నారు. దీంతో ఇతర మినరల్ డీలర్ లైసెన్సుదారులు నేరుగా లీజుదారుల నుంచి సిలికా కొనే పరిస్థితి ఉండటం లేదు.
* గనులశాఖ నిబంధనల ప్రకారం రెండున్నర మీటర్ల వరకే సిలికా తవ్వాలి. కానీ పలు లీజుల్లో 5 మీటర్ల కంటే ఎక్కువ లోతునే తవ్వేస్తున్నారు.
* ఎక్కువగా సిలికా శాండ్ లీజులున్న ప్రాంతాల్లో చెన్నై వ్యాపారి అనుచరులు రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు పెట్టి. సిలికా లోడ్తో వెళ్లే వాహనాలను పరిశీలించి పంపుతున్నారు. సిలికా తవ్వకాలు, తరలింపు పర్యవేక్షణలో తమిళనాడు వారినే ఎక్కువగా నియమించుకుని పట్టు కోల్పోకుండా చూసుకుంటున్నారు.
ఉల్లంఘనలను పరిశీలిస్తాం: శ్రీనివాసరావు, గనులశాఖ ఏడీ
లీజు బయట ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు, మైనింగ్ ప్లాన్ అనుమతి రాకుండానే వెలికితీతను పరిశీలిస్తాం. ప్రభుత్వ భూముల్లో తవ్వినందుకు గతంలో జరిమానా విధించాం. మరోమారు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం.
లెక్క చూపని మొత్తం ఎటుపోతోంది?
చెన్నై వ్యాపారి.. మినరల్ డీలర్ లైసెన్సు యార్డు ద్వారా ఇతర లైసెన్సుదారులకు ఇసుక అమ్ముతున్నారు. అందులో టన్నుకు అధికారికంగా తీసుకునేది రూ.630. అనధికారికంగా నగదు రూపంలో రాబట్టేది మరో రూ.700-800. నిబంధనల ప్రకారం టన్ను సిలికా శాండ్కు సీనరేజ్ రూ.100, కన్సిడరేషన్ నగదు రూ.212, జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్), మెరిట్ తదితరాలు కలిపి మొత్తం రూ.345 ప్రభుత్వానికి చెల్లించాలి. దీనితోపాటు లీజుదారుకు టన్నుకు రూ.150 చొప్పున చెన్నై వ్యాపారి ఇస్తున్నారు. ఇదంతా కలిపి రూ.495 అవుతోంది. ఇతర లైసెన్సుదారులకు సిలికా సరఫరా చేసే సమయంలో ఆ వ్యాపారి జీఎస్టీతో కలిపి టన్నుకు రూ.630 చొప్పున ఆన్లైన్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీనికి అదనంగా టన్నుకు రూ.700-800 వరకు నగదు రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ అదనపు సొమ్మంతా ఏమవుతుందంటే సమాధానం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం