Engineering: ఇంజినీరింగ్దే హవా!
దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాల్లో ట్రెండ్ మారుతోంది. తొలి నుంచీ పీహెచ్డీ ప్రవేశాలు ఆర్ట్స్ గ్రూపుల్లో ఎక్కువగా ఉండేవి. కొంతకాలంగా ఇంజినీరింగ్, టెక్నాలజీలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
పెరుగుతున్న పీహెచ్డీలు
యూజీతోపాటు పరిశోధనలోనూ మారుతున్న తీరు
వెల్లడించిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే
ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా పీహెచ్డీ ప్రవేశాల్లో ట్రెండ్ మారుతోంది. తొలి నుంచీ పీహెచ్డీ ప్రవేశాలు ఆర్ట్స్ గ్రూపుల్లో ఎక్కువగా ఉండేవి. కొంతకాలంగా ఇంజినీరింగ్, టెక్నాలజీలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేషన్లో వస్తున్న మార్పులు పరిశోధనపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల వెలువడిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే నివేదిక ఈ తీరును వెల్లడించింది. ఇవీ వివరాలు...
పరిశోధన(పీహెచ్డీ)లో ప్రవేశాల తీరును అఖిల భారత ఉన్నత విద్య విభాగం పరిశీలించింది. ఇందుకు 2020-21 గణాంకాలను ఆధారంగా చేసుకుంది. సర్వే వివరాలను ఇటీవలే వెల్లడించింది. 2020-21లో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం పీహెచ్డీ ప్రవేశాల్లో అత్యధికంగా 27.3% మంది ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు. ఆ తర్వాత 23.4% మంది సైన్సును ఎంచుకున్నారు. సైన్సు విభాగంలో మహిళలు, ఇంజినీరింగ్లో పురుషులు అత్యధికంగా చేరారు. ఇంజినీరింగ్, టెక్నాలజీలోని 21 కోర్సుల్లో 56,625 మంది అడ్మిషన్లు పొందగా... ఇందులో మహిళలు 18,875 (33.33%), పురుషులు 37,750 (66.66%) మంది ఉన్నారు. సైన్సు స్ట్రీమ్లో 48,600 మంది చేరగా... వారిలో అమ్మాయిలు 23,710 (48.8%) ఉండగా... అబ్బాయిలు 24,890 (51.21%) మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 2,11,852 మంది ప్రవేశాలు పొందగా... వీరిలో పురుషులు 1,16,764, మహిళలు 95,088 మంది ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లో 16.07%, మహారాష్ట్ర 10.98%, తమిళనాడులో 8.06% మంది పీహెచ్డీలో చేరారు.
కంప్యూటర్ కోర్సుకే డిమాండ్
అండర్ గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్కే ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఈ ప్రభావం పీహెచ్డీపైనా కనిపిస్తోంది. ఎక్కువ మంది కంప్యూటర్ ఇంజినీరింగ్కు ప్రాధాన్యం ఇస్తుండగా... ఆ తర్వాత మెకానికల్, ఎలక్ట్రానిక్, సివిల్, ఎలక్ట్రికల్లో ప్రవేశాలు పొందారు. ఆంధ్రప్రదేశ్లో 2020-21లో 6,991 మంది పీహెచ్డీలో చేరగా... వారిలో పురుషులు 4,283 మంది, మహిళలు 2,708 మంది ఉన్నారు. మరోవైపు నైజీరియా, యెమన్, భూటాన్, నేెపాల్లాంటి దేశాలకు చెందిన 1,454 మంది మన దేశంలో పీహెచ్డీలు చేస్తున్నారు. ఇక 2020లో దేశవ్యాప్తంగా 25,550 మంది పీహెచ్డీ పూర్తి చేయగా... వారిలో పురుషులు 14,422, మహిళలు 11,128 మంది పట్టాలు అందుకున్నారు. అత్యధికంగా తమిళనాడు(3,206), ఉత్తర్ప్రదేశ్(2,217), కర్ణాటక(2,125)లు వీటిని ప్రదానం చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!