ముగుస్తున్న 700 మైనింగ్ లీజుల గడువు
రాష్ట్రంలో వివిధ ఖనిజాలకు చెందిన దాదాపు 700 లీజుల గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. వీటిని పునరుద్ధరించాలని పదేపదే విజ్ఞప్తులు చేయడంతో.. అమాత్యులు, అధికారులు సానుకూలంగా స్పందించి కూడా ఏడెనిమిది నెలలవుతోంది.
పునరుద్ధరణపై ఇప్పటివరకు ఆదేశాలివ్వని సర్కారు
ఆందోళనలో లీజుదారులు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వివిధ ఖనిజాలకు చెందిన దాదాపు 700 లీజుల గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. వీటిని పునరుద్ధరించాలని పదేపదే విజ్ఞప్తులు చేయడంతో.. అమాత్యులు, అధికారులు సానుకూలంగా స్పందించి కూడా ఏడెనిమిది నెలలవుతోంది. అయినా ఇప్పటికీ దీనిపై ఉత్తర్వులు వెలువడకపోవడంతో లీజుదారుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఈ-వేలం ద్వారా కొత్త లీజులు కేటాయించే విధానం తీసుకొచ్చారు. పాత లీజు గడువు ముగిస్తే, వాటిలో ఈ నెల 31 వరకు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని, తర్వాత వాటికీ ఈ-వేలం నిర్వహిస్తామని ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం లీజుల గడువు ముగియగానే, వాటిని పునరుద్ధరించేవారు. రాష్ట్రప్రభుత్వ కొత్త విధానంతో పునరుద్ధరణకు వీలులేకుండా పోయింది.
సానుకూలంగా స్పందించినా..
లీజు పొందినప్పటి నుంచి వాటికి అనుమతులు తెచ్చుకొని, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చామని, ఇప్పుడు పునరుద్ధరించకపోతే అన్నివిధాలా నష్టపోతామని లీజుదారుల సంఘాలు తెలిపాయి. దీంతో కొత్త పాలసీపై పునఃసమీక్షించేందుకు గనులశాఖ అధికారులు, లీజుదారుల సంఘాల ప్రతినిధులతో కమిటీలు వేశారు. అవి కూడా లీజుల పునరుద్ధరణే సరైనదని సూచించాయి. దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కొన్ని నెలల క్రితం గనులశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నెలాఖరుతో గడువు ముగిసే 700 లీజుల్లో.. అత్యధికంగా రోడ్ మెటల్వి ఉండగా, ఆ తర్వాత గ్రానైట్ లీజులున్నాయి.
ప్రీమియం బాదుడుతో పునరుద్ధరిస్తారా?
కొత్త లీజుల ఈ-వేలం సమయంలో ఆయా ఖనిజాలకు వేర్వేరు రిజర్వ్ ధరలను నిర్ణయించారు. ఇప్పుడు దాదాపు అంతే మొత్తాలను ప్రీమియం నగదుగా తీసుకొని, గడువు ముగిసే లీజులను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.
* గ్రానైట్ లీజులకు వార్షిక డెడ్రెంట్ హెక్టారుకు రూ.1.30 లక్షలు. ఇందులో బ్లాక్గెలాక్సీ రకానికి 8 రెట్లు పెంచి హెక్టారుకు రూ.10.40 లక్షలు రిజర్వ్ ధరగా చేశారు. కలర్, శ్రీకాకుళం బ్లూ, మూన్వైట్, రివర్వైట్ విశాఖపట్నం, బ్లాక్ పెరల్, సిల్వర్ వేవ్స్ రకాలకు 7 రెట్లు, చిత్తూరు, మదనపల్లి తదితర రకాలకు 5 రెట్లు పెంచి రిజర్వ్ ధరగా నిర్ణయించారు.
* మార్బుల్, లైమ్స్టోన్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ తదితరాలకు వార్షిక డెడ్రెంట్ హెక్టారుకు రూ.65 వేలు ఉండగా, దానికి అయిదు రెట్లతో రూ.3.25 లక్షలు రిజర్వ్ ధర చేశారు.
* కాల్సైట్, క్లే, డోలమైట్ తదితరాలకు వార్షిక డెడ్రెంట్ హెక్టారుకు రూ.20 వేలు ఉండగా, దానికి 8 రెట్లు పెంచి రూ.1.60 లక్షలు రిజర్వ్ ధరగా పేర్కొన్నారు.
* గ్రావెల్, మొరం, మట్టి లీజులకు వార్షిక డెడ్రెంట్ రూ.52 వేలు ఉండగా, దానికి 5 రెట్లు.. రూ.2.60 లక్షలు రిజర్వ్ ధర చేశారు.
* ఇపుడు ఈ రిజర్వ్ ధరలనే ప్రీమియంగా చెల్లిస్తే, లీజులు పునరుద్ధరించేలా నిబంధనల్లో సవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏయే ఖనిజ లీజులకు ఎంత ప్రీమియం మొత్తం ఉండాలనేది పేర్కొంటూ ప్రభుత్వానికి ఇప్పటికే గనులశాఖ దస్త్రాన్ని పంపింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మైనింగ్ పాలసీలో సవరణ చేస్తూ ఉత్తర్వులిస్తే, లీజుల పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం