Sharmila - Vijayamma: పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది.
అరెస్టు..14 రోజుల రిమాండ్
జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
మహిళా సిబ్బందిపై విజయమ్మ దురుసు ప్రవర్తన
పోలీసులు అనుచితంగా వ్యవహరించారు: షర్మిల
జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అబిడ్స్, న్యూస్టుడే: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయిచేసుకోవడం వివాదానికి దారితీసింది. ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టడంతో పాటు ఒక ఎస్సైని వెనక్కి నెట్టారు. పోలీసులు నిలువరిస్తున్నా ఆగకుండా వాహనాన్ని ఆమె డ్రైవర్ ముందుకు పోనివ్వడంతో ఒక కానిస్టేబుల్ కాలిపైకి టైరు ఎక్కింది. బంజారాహిల్స్ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆమెను కలవడానికి ఠాణాకు వచ్చిన తల్లి విజయమ్మ కూడా ఓ మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు. షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రిమాండ్ను రద్దు చేయాలని కోర్టును కోరారు.ఇరుపక్షాల వాదనల అనంతరం సోమవారం రాత్రి 9.30 గంటలకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో ఆమెను నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చంచల్గూడ జైలుకు తరలించారు.
ఉదయం నుంచి హైడ్రామా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని లోటస్పాండ్ వద్ద సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షర్మిల టీఎస్పీఎస్స్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్ అధికారులను కలిసేందుకు వెళ్తున్నారనే సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు ఆమెను గృహనిర్బంధం చేశారు. అడ్డుకున్న పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. తాను ఎలాగైనా సిట్ అధికారులను కలుస్తానంటూ షర్మిల ఇంటి బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కారు ఎక్కకుండా అడ్డగించిన బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ను ఆమె నెట్టేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ కొద్దిదూరం వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ఆమె చుట్టూ పోలీసులు ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మీకు ఏం పనిలేదా.. లేకపోతే వెళ్లి గాడిదలు కాసుకోండంటూ దూషించారు. అక్కడి నుంచి తరలించే క్రమంలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. అనంతరం అడ్డుకోవాలంటూ సిబ్బందిని ఆదేశిస్తున్న ఎస్సై రవీందర్ చేయి పట్టి నెట్టేశారు. పోలీసుల వద్ద ఉన్న మ్యాన్ప్యాక్ లాక్కొని నేలకేసి కొట్టారు. బంజారాహిల్స్ కానిస్టేబుల్ గిరిబాబు కారును అడ్డుకోబోగా డ్రైవరు అలాగే ముందుకు పోనివ్వడంతో టైరు ఆయన కాలుపైకి ఎక్కింది. పరీక్షించిన వైద్యులు కాలి లిగ్మెంట్కు గాయమైనట్టు తేల్చారు. పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. కుమార్తె అరెస్ట్తో మధ్యాహ్నం విజయమ్మ జూబ్లీహిల్స్ స్టేషన్ వద్దకు చేరారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న ఓ మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు.
* పోలీసులపై చేయిచేసుకున్నందుకు షర్మిలతోపాటు, ఆమె డ్రైవరు బాలు, జాకబ్లపై ఐపీసీ సెక్షన్ 332, 353, 509, 427, 109, 337, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. విజయమ్మపై కేసు నమోదును పరిశీలిస్తున్నామన్నారు.
నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా: షర్మిల
సిట్ కార్యాలయానికి ఒంటరిగా వెళ్లి, సిట్ అధికారిని కలిసి టీఎస్పీఎస్సీ దర్యాప్తు మీద వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నా. నన్ను బయటకు రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు...? నేనేమైనా క్రిమినల్నా...? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా...? పోలీసులు నాపై అనుచితంగా ప్రవర్తించారు. నా మీద పడితే నేను భరించాలా...? ఆత్మరక్షణ చేసుకోవడం నా బాధ్యత.\
అందుకే ఆవేశం వచ్చింది.. విజయమ్మ
పది మంది పోలీసులు నాపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తుంటే అడ్డుకొనేందుకు ప్రయత్నించాను. ఆ నేపథ్యంలో నాకు ఆవేశం వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం