ఆదాయం మెరుగు.. సేవలే తరుగు!
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్నింటిలో ఒక్క అధికారినే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి.
కీలక సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క అధికారి ఉండటం వెనక మతలబేంటి?
మరొకరిని నియమిస్తే వాటాదారులు పెరుగుతారని భావిస్తున్నారా?
కక్షిదారులకు అందని ఉత్తమ సేవలు
ఈనాడు, అమరావతి: రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉండే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కొన్నింటిలో ఒక్క అధికారినే కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆదాయపరంగా కీలకమైన ఈ కార్యాలయాల్లో పోస్టింగులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో రెండో అధికారి నియామకం తప్పనిసరి అయినప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఆయా కార్యాలయాల్లో మరో అధికారిని నియమిస్తే తమ వాటాలు తగ్గుతాయన్న ఉద్దేశమే దీని వెనక కారణమన్న విమర్శలున్నాయి. పోస్టింగులకు డిమాండ్, దస్తావేజుల రిజిస్ట్రేషన్ల పరంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో కలిపి సుమారు 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు కీలకంగా ఉన్నాయి. శాఖకు వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ కార్యాలయాలే సమకూరుస్తున్నాయి.
ఆయా కార్యాలయాల్లో అదనంగా ఒకరిద్దరు సబ్రిజిస్ట్రార్లను నియమిస్తే కక్షిదారులకు సేవలు మరింత సులభమవుతాయి. ఈ విషయంలో అడపాదడపా చర్చిస్తున్నప్పటికీ కార్యాచరణలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. విజయవాడ పటమట సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా ఏటా రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఆదాయపరంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యాలయం అగ్రస్థానంలో ఉంది. సబ్రిజిస్ట్రార్ సెలవు పెట్టినా, కోర్టు పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లినా సీనియర్ అసిస్టెంట్కు బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతంలో ఇక్కడి పోస్టింగు విషయంలోనే ముగ్గురు డీఐజీలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీన్నిబట్టి ఈ కార్యాలయ ప్రాధాన్యం స్పష్టమవుతుంది. ఇంతకంటే కాస్త తక్కువగా రిజిస్ట్రేషన్లయ్యే కొన్ని కార్యాలయాల్లో ఇద్దరు చొప్పున సబ్రిజిస్ట్రార్లు ఉన్నారు.
విశాఖ, తిరుపతి, గుంటూరు జిల్లాల్లోనూ..
విశాఖ జిల్లాలో ఎనిమిది సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఏడాది కిందట జరిగిన బదిలీల తరువాత మధురవాడ, భీమిలి కార్యాలయాలను ఒక్కొక్కరితోనే కొన్నాళ్లు కొనసాగించారు. కొద్ది నెలల కిందట మధురవాడలో మాత్రమే రెండో సబ్రిజిస్ట్రార్ను నియమించారు. పెందుర్తి కార్యాలయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.69.87 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఇక్కడ ఒక సబ్రిజిస్ట్రార్ మాత్రమే ఉన్నారు. గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా అవుతున్నా రెండో అధికారిని నియమించడంపై చొరవ చూపడం లేదు. జిల్లా అధికారులు ఉండేచోట సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం ఇద్దరిని నియమిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం