పేదల ఇళ్లపై పిడుగు!
సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు.
46 వేల మంది గృహాల రద్దు?
ఆ స్థానంలో అమరావతి లబ్ధిదారులకు కేటాయింపు
కేంద్రానికి నివేదించాలని నిర్ణయం
ఇప్పటికే వేల సంఖ్యలో రద్దు జాబితాలోకి
ఈనాడు - అమరావతి
సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ముఖ్యమంత్రి జగన్.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. మాటెత్తితే 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. అది కనిపించకుండా వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను చేర్చి ‘లెక్క’ సరిచేస్తున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలని లబ్ధిదారులు అడిగితే నిర్మించి తాళాన్ని వారి చేతికి ఇస్తామని చెప్పిన జగన్.. ఆ తర్వాత చేతులెత్తేశారు. తమకు ఇల్లు కట్టుకునే స్తోమత లేదని బడుగు, బలహీనవర్గాలు మొరపెట్టుకుంటున్నా కనికరించడం లేదు. నిర్దాక్షిణ్యంగా రద్దు జాబితాలో చేర్చేస్తున్నారు. పేదల పక్షాన నిలవడమంటే ఇదేనా అని ఆ అభాగ్యులు ప్రశ్నిస్తున్నారు. రద్దు చేయబోతున్న ఈ ఇళ్ల స్థానంలోనే రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయించిన వారికి మంజూరు చేయాలని కేంద్రానికి నివేదించనున్నారు. కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు.
53 వేల కొత్త ఇళ్ల మంజూరుకు ప్రతిపాదన
‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం పర్యవేక్షణకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశాన్ని నెలకోసారి నిర్వహిస్తుంది. ఈ కమిటీ ఆమోదిస్తేనే ఈ పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మినహా ఇంటి నిర్మాణానికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వ సాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఇళ్ల మంజూరుకు సీఎస్ఎంసీ ఆమోదం తప్పనిసరి. అయితే ఈ పథకం కింద వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసిన ఇళ్లను 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్దేశించింది. కొన్ని నెలలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరినా ససేమిరా అంటోంది. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన జగన్ ప్రభుత్వం.. వివిధ కారణాలతో ఇళ్లు కట్టుకునేందుకు ముందుకు రాని పేదల పేరిట మంజూరైనవి రద్దు చేసి, కొత్తగా ఎంపిక చేసిన వారి పేరు మీద కేటాయించాలని కోరుతోంది. ఆ ప్రకారమే కేంద్రం కూడా అనుమతి ఇస్తోంది.
తాజాగా రాజధానేతరులకు అమరావతిలో 50 వేల ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీరి ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. జులైలో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఈ నెలలో దిల్లీలో జరిగే సీఎస్ఎంసీ సమావేశంలో కేంద్రం నుంచి అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి పొందేలా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 46,928 ఇళ్లను రద్దు చేసి వాటి స్థానంలో 53,011 గృహాల్ని కొత్తగా మంజూరు చేయాలని కోరబోతున్నట్లు తెలిసింది. కొత్త మంజూరులో ఎన్టీఆర్ జిల్లాలో 23,821, గుంటూరు జిల్లాలో 23,196, వైయస్ఆర్ జిల్లాలో 2,431, ప్రకాశం జిల్లాలో 1,866, మిగతావి కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఉన్నాయి.
రద్దు జాబితాలో సీఎం సొంత జిల్లాకు 2వ స్థానం
మొత్తంగా 148 ప్రాజెక్టుల పరిధిలోని 46,928 గృహాల్ని రద్దు చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో అత్యధికంగా నంద్యాల జిల్లాలో 8,959 ఉండగా.. ఆ తర్వాత స్థానం ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైయస్ఆర్దే. ఇక్కడ 15 ప్రాజెక్టుల పరిధిలో 8,126 ఇళ్లను రద్దు జాబితాలో చేర్చారు. అనకాపల్లి జిల్లాలో 4,806, పల్నాడులో 3,094 ఇళ్లు ఆ జాబితాలో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?