నిధులొచ్చే మార్గమున్నా.. నీళ్లిచ్చే మనసు లేదు
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకం కోసం నిధులిచ్చాం. 2021-22 తర్వాత ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది అత్యంత విచారకరం.
పేదల దప్పిక తీర్చడంలో జగన్ సర్కారు నిర్లక్ష్యం
జల్జీవన్ మిషన్ పథకంపై అలసత్వం
జాతీయ స్థాయిలో అట్టడుగున రాష్ట్రం
ఇటీవలే రాజ్యసభలో కడిగేసిన కేంద్రమంత్రి
ఈనాడు, అమరావతి
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పథకం కోసం నిధులిచ్చాం. 2021-22 తర్వాత ఒక్క పైసా కూడా వినియోగించుకోలేకపోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది అత్యంత విచారకరం.
రాజ్యసభ సాక్షిగా జులై 24న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పిన మాట ఇది.
ఈ పథకం ఎందుకోసం అంటే:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలి. 2024 చివరి నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుని, రోజూ తలా ఒక్కింటికి 55 లీటర్ల రక్షిత తాగునీటిని సరఫరా చేయాలి.
నిధుల కేటాయింపు:
మొత్తం అంచనా వ్యయం రూ. 26,309 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలి.
వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?:
కేంద్రం నిధులిచ్చినా మన రాష్ట్ర వాటా ఇవ్వటం లేదు. కనీసం కేంద్ర నిధులనైనా ఖర్చు చేసిందా? అంటే అదీ లేదు. ఈ పథకం అమల్లో జాతీయ స్థాయిలో అట్టడుగున నిలిచి రాష్ట్ర పరువును తీసేసింది.
మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుసు. ఏటా వేసవి వచ్చిందంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి, నీళ్లు తెచ్చుకుంటున్న జనం కష్టాలను చూస్తున్నాం. పొలాలు, వాగులు, చెరువుల్లోని కలుషిత నీటితో గొంతు తడుపుకుంటున్న వైనాన్నీ వింటున్నాం. కలుషిత నీరు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నా... సీఎం జగన్ను మాత్రం కదిలించలేకపోయాయి. వారి దాహాన్ని తీర్చేందుకు ఉద్దేశించిన జేజేఎం పథకాన్ని వినియోగించుకోలేని అసమర్ధత కారణంగా ప్రజలు బలైపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? ఉన్న నిధులనూ ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే మంత్రులు.. అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు? తెల్లారి లేస్తే విపక్షాల నేతలపై అక్రమ కేసులు పెట్టి ఎలా వేధించాలి? అమరావతిని ఎలా ధ్వంసం చేయాలన్న ఆలోచనలే తప్ప.. ప్రజలకు మంచి చేసే పనులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు?
ప్రాజెక్టులే లేవు.. అనుసంధానమెలా?
జేజేఎంలో భాగంగా రూ. 8,395 కోట్లతో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టుల్లో ఇంతవరకు కదలిక లేదు. పనులెప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే సర్వే చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాకే పైపులైన్ల ద్వారా గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలకు నీరివ్వాల్సి ఉంటుంది.
తెలంగాణకు ప్రథమ బహుమతి
తెలంగాణలోని గ్రామాల్లో 53.98 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. వేసవిలోనూ ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీరిస్తున్నారు. గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించి జల్జీవన్ అవార్డు-2022 కింద ప్రథమ బహుమతి అందించింది. రూ. 36,900 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తున్నారు.
మనం అధోగతి
రాష్ట్రంలోని గ్రామాల్లో 95,54,840 ఇళ్లుండగా.. జేజేఎం ప్రారంభమైన నాటికి 30.74 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం మొదలయ్యాక ఇప్పటి వరకు 36.21 లక్షల ఇళ్లకు కొత్తగా ఇచ్చారు. ఇంకా 28.50 లక్షల ఇళ్లకు ఎపుడిస్తారో ఆ దేవుడికే తెలియాలి. బాపట్ల జిల్లాలో 39.20%, శ్రీకాకుళంలో 31.30%, పల్నాడులో 30.90% ఇళ్లకు మాత్రమే కనెక్షన్లున్నాయి.
కనెక్షన్ల సంఖ్య సరే... నీళ్లేవీ?
రాష్ట్రంలో 36.21 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా.. వీటిని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న రక్షిత తాగునీటి పథకాలకు అనుసంధానిస్తున్నారు. ఆ నీరు సరిపోక అత్యధిక ప్రాంతాల్లో కుళాయిలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఉమ్మడి ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
మనకంటే చిన్న రాష్ట్రాలే నయం
చిన్న రాష్ట్రాలు సైతం జల్జీవన్ మిషన్ను చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. కేంద్రంతో సమానంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ పనులు సజావుగా సాగేలా చూస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రజల గొంతు తడపగలుగుతున్నాయి.
- 9 రాష్ట్రాలు వందశాతం ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి.
- ఛత్తీస్గఢ్లో జేజేఎం పనులకు ఏపీలోని గుంటూరు జిల్లా నుంచి కూలీలు వెళ్తుతున్నారు. ఈ రాష్ట్రంలోని గ్రామాల్లో 50,11,392 ఇళ్లుండగా జేజేఎం పథకానికి ముందు కేవలం 3,19,741 ఇళ్లకే కుళాయిలున్నాయి. పథకం వచ్చాక ఇప్పటివరకు 23,88,543 ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇచ్చారు.
- ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లో జేజేఎం కింద 52,21,615 ఇళ్లకు కొత్తగా కుళాయిలిచ్చారు.
- దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ప్రదేశ్లోనూ జేజేఎం పథకాన్ని అక్కడి ప్రభుత్వం చక్కగా ఉపయోగించుకుంటోంది. పథకం ప్రారంభం నాటికి గ్రామాల్లో 5,16,221 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. జేజేఎం ద్వారా 1,37,40,286 కొత్త కనెక్షన్లు ఇవ్వగలిగారు.
రూ. 3,514.68 కోట్లు పోయినట్టే!
- మన రాష్ట్రంలో జేజేఎం పనులు మొదలైంది 2019-20లో. అంచనా వ్యయం రూ. 26,309 కోట్లు.
- 2019-20లో కేంద్రం ఇచ్చింది రూ. 372.64 కోట్లు.
- 2020-21లో కేంద్రం మంజూరు చేసిన మొత్తం రూ. 790.48 కోట్లు. జగన్ సర్కారు సకాలంలో ఖర్చు చేయకపోవటం, రాష్ట్ర వాటా ఇవ్వకపోవటంతో కేంద్రం రూ. 297.62 కోట్లనే ఇచ్చింది.
- 2021-22లో కేంద్రం రూ. 3,812.88 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా రూ. 791.06 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో రూ. 40 కోట్లను ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో జత చేసింది. దీంతో 2021-22 సంవత్సరానికి కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం ఇక రానట్టే లెక్క.
- మొత్తమ్మీద 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,514.68 కోట్లను రాష్ట్రం కోల్పోయినట్టయింది.
- 2022-23 సంవత్సరానికి కేంద్రం రూ. 3,458.20 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఆ నిధులేమీ ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM