Botsa Satyanarayana: బొత్స కుటుంబానికి బొనాంజా
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీఐఐసీ గ్రోత్సెంటర్లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది.
బొబ్బిలి గ్రోత్సెంటర్లో కారుచౌకగా భూమి కేటాయింపు
డిస్టిలరీ ఏర్పాటు కోసం సత్య బయో ఫ్యూయల్స్కు 30 ఎకరాలు
ఆ కంపెనీ డైరెక్టర్లు ఇద్దరూ మంత్రి బొత్స సోదరులే
ఎకరం రూ.82 లక్షలున్న భూమి రూ.10 లక్షలకే
రూ.21.56 కోట్ల అనుచిత లబ్ధి
చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం సుమారు రూ.3 కోట్లు
ఈనాడు - అమరావతి
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీఐఐసీ గ్రోత్సెంటర్లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. ఏపీఐఐసీ లెక్కల ప్రకారం ఎకరం రూ.81.93 లక్షల ధర ఉన్న భూమిని రూ.10 లక్షలకే ధారాదత్తం చేసేసింది. బొత్స సోదరులు సతీష్కుమార్, ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న ఆ కంపెనీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో డిస్టిలరీ, ఇథైల్ ఎసిటేట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో తయారుచేసే ఇథనాల్ను మద్యం ఉత్పత్తిలోనూ, ఫార్మా తదితర పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. ఈ పరిశ్రమలకు భూ కేటాయింపునకు సంబంధించి జులై 21న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురువారం వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో సత్య బయో ఫ్యూయల్స్కు ఎకరం రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇక్కడ ఏపీఐఐసీ నిర్ణయించిన ధర చదరపు మీటరుకు రూ.2,025. ఆ లెక్కన ఎకరం విలువ రూ.81.93 లక్షలు. కానీ బొత్స కుటుంబ కంపెనీకి ప్రభుత్వం ఎకరం రూ.10 లక్షల చొప్పున కేటాయించడం వల్ల సుమారు రూ.21.56 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూర్చినట్టయింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్కు చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర రూ.2-3 కోట్ల వరకు ఉంది. పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలివ్వాల్సిందే. పెట్టుబడుల్ని ప్రోత్సహించాల్సిందే. వెనుకబడిన ఉత్తరాంధ్రకు పరిశ్రమలు రావడాన్ని మరింతగా స్వాగతించాల్సిందే. కానీ ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సహచరుడి కుటుంబానికి చెందిన కంపెనీకి... ప్రభుత్వ విధానం ప్రకారం నిర్ణయించిన ధర కంటే కూడా బాగా తగ్గించి, కారుచౌకగా భూమి కట్టబెట్టడంపైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఆగమేఘాల మీద కేటాయింపు
బొత్స కుటుంబ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు ప్రక్రియను ఆగమేఘాల మీద పూర్తి చేసింది. రాయితీపై భూమి కేటాయించాల్సిందిగా ఆ కంపెనీ సీఈఓ ఈ ఏడాది జూన్ 21న ముఖ్యమంత్రి కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయిదు రోజుల్లోనే జూన్ 26న ముఖ్యమంత్రి కార్యదర్శి దాన్ని పరిశ్రమల శాఖకు పంపించారు. ఆ పరిశ్రమకు వేగవతి నది నుంచి నీరు కేటాయిస్తూ మర్నాడే (జూన్ 27) జలవనరులశాఖ జీవో జారీ చేసింది. జులై 10న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) సమావేశం ఆ కంపెనీకి భూమి కేటాయింపునకు సిఫారసు చేసింది. జులై 11న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 27న జీవో ఇచ్చేశారు.
వెయ్యి లీటర్ల నీళ్లు రూ.5
సత్య బయో ఫ్యూయల్స్ సంస్థ రూ.235.30 కోట్లతో రోజుకు 200 కిలో లీటర్ల ఉత్పాదక సామర్థ్యంతో ‘గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ ప్లాంట్’, రూ.14.70 కోట్లతో ‘ఇథైల్ ఎసిటేట్ ప్లాంట్’ ఏర్పాటు చేయనున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. దాని వల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వేగవతి నది నుంచి రోజుకు 1600 కిలోలీటర్ల (కిలోలీటర్ అంటే 1000 లీటర్లు) చొప్పున సంవత్సరానికి 0.013 టీఎంసీల జలాల్ని ఆ పరిశ్రమలో ఇథనాల్ తయారీ కోసం కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు. కిలో లీటరు నీటిని రూ.5కే ఇవ్వనున్నారు. సత్య బయోఫ్యూయల్స్ కంపెనీని 2013 సెప్టెంబరు 6న ఏర్పాటు చేశారు. కంపెనీ రిజిస్టర్డ్ కార్యాలయం హైదరాబాద్లోని బేగంపేట చిరునామాతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట