పెత్తందారు పాలనలో.. పెట్రో పన్నుల బాదుడు
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా పెట్రోల్, డీజిల్పై బాదుడేబాదుడంటూ ఘోషించారు కదా? పక్క రాష్ట్రాల కంటే లీటరుపై రూ.5-7 ఎక్కువని వాపోయారు కదా?
నాడు ఇతర రాష్ట్రాల కంటే లీటరుకు రూ.7 ఎక్కువని గగ్గోలు
నేడు లీటరుకు రూ.15 అధికంగా ఉన్నా నోరు మెదపని సీఎం జగన్
దేశంలో ఏపీలోనే అత్యధిక ధరలు
చిరు వ్యాపారులు, రైతులపై పెనుభారం
2022-23లో పెట్రో పన్నుల రాబడి రూ.16,429 కోట్లు
ముఖ్యమంత్రి జగన్ గారూ?
2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడ సభ పెట్టినా పెట్రోల్, డీజిల్పై బాదుడేబాదుడంటూ ఘోషించారు కదా? పక్క రాష్ట్రాల కంటే లీటరుపై రూ.5-7 ఎక్కువని వాపోయారు కదా? ఓ అన్నా, ఓ అక్కా మీకు బైకులున్నాయా? ట్రాక్టర్లున్నాయా? పెట్రోలు, డీజిల్ పోయించి బిల్లులు తీసుకోండి, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు వెళ్లండంటూ ప్రేరేపించారు కదా? మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే మీరు.. అవే మాటలు ఇప్పుడూ చెప్పగలరా? ఏపీలోని పెట్రోలు, డీజిల్ ధరలను పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూడండి అని ప్రజలకు పిలుపునివ్వగలరా? మచ్చుకు కోనసీమ జిల్లా కేసనకుర్రుతో పోల్చితే, పక్కనే యానాంలో లీటరు పెట్రోలుపై రూ.15.77, డీజిల్పై రూ.13.23 తక్కువ అన్న సంగతిని అంగీకరిస్తారా?
పెట్రో ధరలు మన రాష్ట్రంలో ఉన్నట్లు మరెక్కడా లేవంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2019లో తానే సీఎం అయ్యాక అప్పటి వరకు పెట్రోలుపై 31%, లీటరుకు రూ.2 అదనపు సుంకం, డీజిల్పై 22.5%, లీటరుకు రూ.2 అదనపు సుంకాన్ని పెంచేశారు. రోడ్డు సుంకం రూపంలో రూ.1 (దీనిపై వ్యాట్ అదనం) చొప్పున వడ్డించారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన జగన్ తన ప్రభుత్వ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలందరూ కోటీశ్వరులయ్యారునుకున్నారో ఏమో.. దేశంలో ఎక్కడా లేనంతగా పన్నుల భారాన్ని మోపారు. పెట్రో ఛార్జీలనే రాష్ట్ర రాబడికి ఇంధన వనరుగా మార్చుకున్నారు. 2019-20తో పోల్చితే 2022-23 నాటికి నాలుగేళ్లలో ప్రభుత్వ రాబడి 61.57 శాతం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో 2014-15తో పోల్చితే 2018-19 నాటికి అయిదేళ్లలో ఈ పెరుగుదల 22.87 శాతం మాత్రమే. అలాగని వైకాపా వచ్చాక పెట్రో ఉత్పత్తుల వాడకం భారీగా పెరిగిందేమీ లేదు. నాలుగేళ్లలో 4.39% మాత్రమే పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తులపై పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.16,429 కోట్లు, గ్యాస్, ఇతర ఉత్పత్తులపై మరో రూ.290 కోట్లు సమకూరింది. అదనపు సుంకం, రోడ్డు సుంకం రూపంలో వసూలు చేస్తున్న సర్కారు.. రోడ్లపై గుంతలు పూడ్చక పోవడం గమనార్హం.
చిరు వ్యాపారులనూ వదలరా?
పెత్తందారు పాలనలో బాదుడంటే ఇలాగే ఉంటుందని జగన్ చెప్పకనే చెబుతున్నారు. చమటోడ్చే రైతులనూ, బైక్లపై ఊరూరా తిరుగుతూ సరకులు అమ్ముకునే చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లనూ వదల్లేదు. జనరేటర్లు వాడే ఆక్వా రైతులు, పరిశ్రమల యజమానులపై పెనుభారాన్ని మోపారు. ఇంధన ధరలు పెంచి, వారి ఆదాయానికి కత్తెరేస్తున్నారు. జగన్ సీఎం అయ్యే నాటికి పెట్రోలు ధర విజయవాడలో లీటరు రూ.76.89. ఇప్పుడు రూ.111.50. లీటరుపై రూ.34.60పైనే పెరిగింది. గ్రామాల్లో తిరుగుతూ వివిధ వస్తువులు అమ్ముకునే చిరు వ్యాపారి రోజుకు 2 లీటర్ల పెట్రోలు వాడినా, గతంతో పోల్చితే అదనపు ఖర్చు సుమారు రూ.70. నెలలో 25 రోజులు వ్యాపారం చేశాడనుకుంటే ఈ మొత్తం రూ.1,750. ఏడాదికి రూ.21,000. అమ్మఒడి కిందో, వాహనమిత్ర కిందో సర్కారు ఇచ్చేదెంత? సామాన్యుడి నుంచి లాగుతుంది ఎంత? అన్నది ఈ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఆ రాష్ట్రాల స్ఫూర్తి ఏదీ..?
2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 20% పెరగ్గా, పన్నుల రూపేణా ఆదాయం 1% మాత్రమే పెరిగింది. రాష్ట్ర పన్నులు తగ్గించడమే రాబడి పెరగకపోవడానికి కారణం. అదే ఏపీలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 6.40% మాత్రమే పెరగ్గా, పన్నుల రాబడి 11.58% పెరగడం గమనార్హం. ఆదాయం రాకున్నా సరే..సామాన్యులపై భారం మోపకూడదని పలు రాష్ట్రాలు పెట్రో పన్నుల భారాన్ని తగ్గించాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలన్నింటా ఏపీలోనే పెట్రో ఉత్పత్తులపై ఆదాయం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
ధరలను పోలిస్తే..
ఏపీలోని సరిహద్దు గ్రామాల వారు రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొనలేక పొరుగున కర్ణాటక, తమిళనాడు, యానాం వెళ్లి పోయించుకుంటున్నారు. అక్కడ అమ్మకాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లీటరుపై రూ.5-7 ఎక్కువగా ఉంటే బాదుడే బాదుడంటూ అరచి గగ్గోలు పెట్టిన జగన్కు తన పాలనలో మరింత ఎక్కువగా ఉన్న విషయం తెలియదా, తెలిసీ పెత్తందారు పాలనలో ఇంతేనని సందేశమిస్తున్నారా అన్నది ప్రశ్న ?
ఇచ్చేదెంత? గుంజేదెంత?
పెట్రో పన్నుల పెంపుతో రైతులపై పడిన భారం అంతాఇంతా కాదు. డీజిల్ వాడే ట్రాక్టర్తో నాగలి తోలకమే ఎకరాకు రూ.1,300 నుంచి రూ.2 వేలకు చేరింది. గొర్రు, గుంటక సాలుకు రూ.300 వరకు పెరిగి ఎకరాకు రూ.600కు చేరింది. దమ్ము, విత్తనం వేయడం తదితర యంత్ర సేద్య పనులకు ఎకరాకు రూ.4 వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. పంట ఉత్పత్తులు, కూలీల రవాణాకు వాడే ఆటోలు, ట్రాక్టర్లు, లారీల బాడుగ గతం కంటే రూ.3 వేలకు పైగా పెరిగింది. ఈ లెక్కన ఏడాది భారం రూ.12,500పైనే. సర్కారు చెల్లించే రైతు భరోసా ఎంత? పెట్రో పన్నుల రూపంలో గుంజేదెంత అన్నది ఇప్పటికే అన్నదాతల అనుభవంలోకి వస్తోంది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM