YS Jagan: సీఎం జగన్కు హైకోర్టు నోటీసులు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో గురువారం హైకోర్టు పలువురికి నోటీసులు జారీచేసింది.
విజయసాయిరెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి, వాసుదేవరెడ్డిలకూ తాఖీదులు
సీబీఐ, జగతి పబ్లికేషన్, వివిధ కంపెనీలు, ప్రభుత్వ కార్యదర్శులకూ జారీ
అనుచిత లబ్ధి నిర్ణయాలపై ఎంపీ రఘురామ వేసిన పిల్పై విచారణ
కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రతివాదులకు హైకోర్టు అవకాశం
డిసెంబరు 14కు విచారణ వాయిదా
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి(YS Jagan), ఆయన బంధుగణానికి, వివిధ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూరేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన పాలసీలపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో గురువారం హైకోర్టు పలువురికి నోటీసులు జారీచేసింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి సహా వివిధ శాఖల కార్యదర్శులకు, కంపెనీల డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. పిల్ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడం మంచిదని వ్యాఖ్యానిస్తూ.. 41 మందికి నోటీసులు జారీచేసింది. పిల్ విచారణార్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను డిసెంబరు 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. సీఎం జగన్, ఆయన బంధుగణానికి లబ్ధి చేకూరేలా జరిగిన అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు రఘురామ ఈ పిల్లో కోరారు. ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు.
నోటీసులు జారీ చేసింది వీరికే..
సీఎం జగన్మోహన్రెడ్డి నుంచి లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ వేమిరెడ్డి శ్రీధర్రెడ్డి, ఇందిరా టెలివిజన్ డైరెక్టర్ కల్వ రాజప్రసాద్, భారతి సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, సాగర్ సిమెంట్స్ డైరెక్టర్ ఒంటెద్దు రేఖ, ఇండియా సిమెంట్స్ డైరెక్టర్ శ్రీనివాసన్, దాల్మియా సిమెంట్ (భారత్) డైరెక్టర్ భరత్ భూషణ్ మెహతా, పెన్నా సిమెంట్ డైరెక్టర్ పుత్తంరెడ్డి ప్రతాప్రెడ్డి, మైహోం ఇండస్ట్రీస్ డైరెక్టర్ రామేశ్వర్రావు, శ్రీజయజ్యోతి సిమెంట్స్, భారతి పాలిమర్స్ ఇండియా, అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో రియాల్టీ, జయప్రకాశ్ పవర్ వెంచర్స్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టర్న్కీ ఎంటర్ప్రైజెస్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, గ్రేసన్ డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, సన్రే బాట్లింగ్ అండ్ బెవరేజెస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ (బాట్లింగ్), బీ 9 బెవరేజెస్, సెంటినీ బయో ప్రొటెక్ట్స్, ఆర్.ఆర్.గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థల డైరెక్టర్లు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గనులు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు సహా వైద్య ఆరోగ్యశాఖ, మౌలిక, పెట్టుబడులు (పోర్టు) శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖ కమిషనర్, గనుల శాఖ డైరెక్టర్.
పిటిషన్లో ఆరోపణలు ఇవీ..
జగన్మోహన్రెడ్డి, సమాచార పౌర సంబంధాల ముఖ్యకార్యదర్శి పక్షపాత ధోరణితో ప్రభుత్వ సంబంధ వార్తలు, ప్రకటనలను ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్కు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారు. భారతి, దాల్మియా, పెన్నా, మరో అయిదు కంపెనీలకు సింహభాగం సిమెంట్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, గనులశాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అక్రమ నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ తన హాదాను దుర్వినియోగపరిచారు. 104, 108 అంబులెన్సుల నిర్వహణను అరబిందో ఫార్మా ఫౌండేషన్కు అప్పగించడంలో జగన్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్టులను అరబిందో రియాల్టీ సంస్థకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (పోర్టు)శాఖ ప్రత్యేక సీఎస్ అక్రమాలకు పాల్పడ్డారు. జగన్, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అవినీతికి పాల్పడి ఇసుక తవ్వకాలను చెన్నైకి చెందిన టర్న్కీ ఎంటర్ప్రైజెస్కు అప్పగించారు. ‘పేదలకు ఒక సెంటు స్థలం’ ముసుగులో ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల భూములతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. కొన్ని మద్యం కంపెనీలకే ఎక్కువ భాగం మద్యం కొనుగోలు ఆర్డర్లను అప్పగించే విషయంలో జగన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మౌనం వహిస్తోంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేసేలా సీబీఐ డైరెక్టర్ను ఆదేశించాలి.
విచారణార్హతపై ఏజీ అభ్యంతరం
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ఈ పిల్ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తారు. రిట్ రూల్స్కు విరుద్ధంగా ఉందన్నారు. పూర్తి వివరాలను ప్రస్తావించలేదన్నారు. పిటిషనర్ను అనర్హులుగా ప్రకటించాలని వైకాపా విప్ స్పీకర్కు లేఖ రాశారని.. ఆ విషయాన్ని పిల్ డిక్లరేషన్లో పేర్కొనలేదని తెలిపారు. పిటిషనర్ డైరెక్టర్గా ఉన్న ఓ కంపెనీ రూ. 700 కోట్లు చెల్లించడంలో విఫలమైందని, ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని పిల్లో పేర్కొనలేదన్నారు. పిల్ దాఖలు తర్వాత ‘ముఖ్యమంత్రిని వదలను’ అని మీడియా ముందు ప్రకటన చేశారన్నారు. దురుద్దేశంతో, రాజకీయ వైరంతో పిటిషన్ వేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఏజీ చెబుతున్న కారణాలు పిల్ దాఖలుకు అడ్డంకి కాదని తెలిపారు.
ప్రతివాదులకు నోటీసులు: ధర్మాసనం
ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ.. పిల్ విచారణకు స్వీకరించే ముందు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని ప్రతిపాదించింది. విచారణార్హత గురించి తేల్చాక లోతుల్లోకి వెళ్తామని పేర్కొంది. ఏజీ స్పందిస్తూ.. విచారణార్హతను తేల్చకముందే నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి వ్యాజ్యంలో వాదనలు చెప్పుకొనేందుకు న్యాయస్థానం తమకు అవకాశం ఇవ్వలేదని వారు భావించే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు వీల్లేకుండా నోటీసులు ఇవ్వడం ఉత్తమం అని వ్యాఖ్యానించింది.
రికార్డులను ధ్వంసం చేస్తున్నారు
-రఘురామ తరఫు న్యాయవాది మురళీధరరావు
ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ.. ఇసుక, మద్యం పాలసీ వ్యవహారాలపై రికార్డులను సీజ్ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. పిల్ దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేశారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన గతంలో చోటు చేసుకుందని గుర్తుచేశారు. ఈ దశలో రికార్డుల సీజ్కు ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. పిల్ విచారణ అర్హతతోపాటు అనుబంధ పిటిషన్లను తర్వాత పరిశీలిస్తామని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?