పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి?
70 పట్టణ తాగునీటి ప్రాజెక్టులకు నీళ్లొదిలిన సీఎం జగన్
తెదేపా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయన్న అక్కసు
ఈనాడు, అమరావతి
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి?
పట్టణ ప్రజల తాగునీటి సరఫరాకు ఇబ్బంది రానివ్వనని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్... తెదేపా ప్రభుత్వంలో ప్రారంభించిన అనేక తాగునీటి పథకాలకు నిధులివ్వకుండా పాడుబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎలాగూ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వ వాటానూ ఇతర అవసరాలకు వినియోగించి పథకాలకు పాతరేశారు. మూర్ఖత్వంతో పట్టణ ప్రాంత ప్రజలను సమస్యల సుడిగుండంలోకి నెట్టేసి... నిస్సిగ్గుగా ప్రతి పట్టణాన్నీ మార్చేశానని టముకేసుకుంటున్నారు. బిందెడు నీటి కోసం ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తుంటే ..మీ చావు మీరు చావండని విషపు నవ్వులు నవ్వుతున్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పథకం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో 70 తాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభించాయి. రూ.6,526 కోట్ల విలువైన ఈ పనులను జగన్ ప్రభుత్వం కేవలం అక్కసుతో పక్కనపెట్టింది. ప్రజల తాగునీటి అవసరాలు గుర్తించకుండా వీటిని పూర్తి చేస్తే తెదేపాకి పేరొస్తుందేమోనన్న దుగ్ధతో పాడుబెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం ఈపాటికే అమృత్లో ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి. వైకాపా సర్కారు బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో 52 పథకాల్లో నాలుగే పూర్తయ్యాయి. ఏఐఐబీ సాయంతో చేపట్టిన వాటిని 2024 జూన్ 30కి పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్కదాన్నీ పూర్తిచేయలేదు. దాదాపు రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో ఎక్కువ చోట్ల గుత్తేదారులు పనులు నిలిపివేశారు. వీటిలో సగమైనా పూర్తిచేసి ఉంటే వేసవిలో పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తేదే కాదు. ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చే అవసరం తప్పేది.
ఇది కాదా నిర్లక్ష్యం!
నంద్యాల జిల్లా ఆత్మకూరులో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.116 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు పనులకు జగన్ ప్రభుత్వం గ్రహణం పట్టించింది. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులను అసంపూర్తిగా నిలిపివేశారు. వెలుగోడు జలాశయం నుంచి ఆత్మకూరు వరకు పైపులైన్ ఏర్పాటు, వేంపెంట, కరివేన వద్ద రెండు నీటి శుద్ధి కేంద్రాలు, పట్టణంలో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలన్నది ప్రణాళిక. తెదేపా హయాంలో మొదలుపెట్టిన పనులను యథావిధిగా పూర్తి చేస్తే పట్టణంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించేది. జగన్ ప్రభుత్వం అక్కసుతో వీటిని పక్కన పెట్టి ప్రజలకు కష్టాలుే మిగిల్చింది.
చీమకుర్తి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే పనులకు జగన్ ప్రభుత్వం పక్కనపెట్టింది. రామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా పట్టణ ప్రజలకు రక్షిత తాగునీరు అందించాలన్నది ప్రణాళిక. రూ.63 కోట్ల ఏఐబీబీ సాయంతో తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రెండేళ్లపాటు పనులు నిలిపివేశారు. 2022లో మళ్లీ ఇదే పథకానికి అప్పటి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. పనులైతే ఇప్పటికీ పూర్తికాలేదు. రెవెన్యూ కార్యాలయం సమీపంలో నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకు పనులూ అసంపూర్తిగా ఉన్నాయి. పైపులైన్ల ఏర్పాటు పనులు సర్వేకే పరిమితమయ్యాయి.
నెల్లూరు జిల్లా కావలిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు సంగం బ్యారేజీ నుంచి నీటిని రప్పించేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్లతో ప్రారంభించిన పైపులైన్ పనులను జగన్ ప్రభుత్వం పాడు బెట్టింది. 20 శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. వైకాపా సర్కార్ వచ్చాక బిల్లులు చెల్లించకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతానికి పనులు నిలిచిపోయి ఎక్కడి సామగ్రి అక్కడే పడి ఉంది. సంగం బ్యారేజీ నుంచి పైపులైన్ ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజల అవసరాలకు సరిపడా తాగునీరు అందించే వీలుంటుంది. ఎంతో ముఖ్యమైన పనులను పక్కన పెట్టడంతో కావలి ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.
పుత్తూరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.138 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సాయంతో చేపట్టిన పనులు జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పట్టణంలో రూ.55 కోట్లతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుని అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగుగంగ నీటిని తీసుకొచ్చేందుకు పనులు ప్రారంభించారు. కేవీబీపురం మండలం పవనివారి కండ్రిగ వద్ద వ్రవహిస్తున్న తెలుగుగంగ కాలువ నుంచి 57 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుని నీటితో నింపాలన్నది లక్ష్యం. పవనివారి కండ్రిగ, రాయపేడు వద్ద రెండు పంపుహౌస్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. పైపులైను పనులు 60 శాతం పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం రూ.20 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో పెట్టడంతో పనులు నిలిచిపోయాయి.
గండికోట ప్రాజెక్టు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్ పథకంలో పనులు ప్రారంభించారు. రూ.145 కోట ఈ ప్రాజెక్టును వైకాపా సర్కార్ అటకెక్కించింది. 37 కిలోమీటర్ల మేర వేయాల్సిన పైపు లైన్ వేయాల్సి ఉండగా దాదాపు 32 కిలో మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. రోజూ 45 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే కేంద్రం నిర్మాణ పనులు సజ్జలదిన్నె వద్ద ప్రారంభమయ్యాయి. కానీ ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల బిల్లులు చెల్లించలేదని గుత్తేదారులు మధ్యలోనే నిలిపివేశారు. గండికోట రిజర్వాయర్, తాడిపత్రి శివారులో పైనులైను పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు ఇంకా మొదలేకాలేదు.
పుంగనూరులో దెబ్బతిన్న పైపులైనుకు ప్రత్యామ్నాయంగా కొత్తది ఏర్పాటు చేస్తే పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. కానీ జగన్ ప్రభుత్వం ఐదేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజలను కష్టాలపాల్జేసింది. పుంగమ్మ చెరువులో రూ.33 కోట్లతో పుష్కరం క్రితం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి పుంగనూరుకు నీరందించేలా వేసిన పైపులైను దెబ్బతింది. అప్పటి నుంచి పట్టణ ప్రజలకు బోర్ల ద్వారా రోజు విడిచి రోజు నీరందిస్తున్నారు. తీరా ఎన్నికల ముందు తెరపైకి ప్రతిపాదనలు తెచ్చి... ప్రత్యామ్నాయంగా మరో పైపులైన్ ఏర్పాటుకు ఉపక్రమించారు. ఈ పనులు పూర్తయితే పట్టణానికి తాగునీరు రానుంది.
కర్నూలులో తాగునీటి కొరతను అధిగమించేందుకు 2021లో రూ.82 కోట్లతో ప్రారంభించిన పైపులైను పనులు మూలకు చేరాయి. ప్రాజెక్టు పనుల నిర్వహణకు అనుమతించిన జగన్ ప్రభుత్వం సరిగా నిధులు విడుదల చేయలేదు. సుంకేశుల జలాశయం నుంచి మునగాలపాడులోని నగరపాలక సంస్థకి చెందిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వరకు 23 కిలో మీటర్ల మేర పైపులైన్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దీనివల్ల జల చౌర్యం, తీవ్రమైన ఎండల సమయంలో నీటి ఆవిరి వంటి నష్టాలను అధిగమించొచ్చన్నది ప్రధాన ఉద్దేశం. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు పెండింగ్లో పెట్టడంతో మిగిలిన పనులు చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపని కారణంగా ఈపాటికే పూర్తి చేయాల్సినవి మందకొడిగా సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే