AP Ministers: మంత్రుల్లో సగం మందికి టికెట్లు అనుమానమే!
మంత్రుల్లో సగం మందికి మళ్లీ టికెట్ దక్కుతుందనే స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 25 మంది మంత్రుల్లో 11 మందికే ఈసారి టికెట్లపై స్పష్టత కనిపిస్తోంది.
25 మందిలో ఇప్పటికి 11 మందికే స్పష్టత
వీరిలోనూ ప్రత్యామ్నాయ అవకాశం కోరుతున్న ముగ్గురు
ఈనాడు - అమరావతి
మంత్రుల్లో(AP Ministers) సగం మందికి మళ్లీ టికెట్ దక్కుతుందనే స్పష్టత ఇంకా లేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 25 మంది మంత్రుల్లో 11 మందికే ఈసారి టికెట్లపై స్పష్టత కనిపిస్తోంది. మిగిలినవారిలో కొందరిని ఈసారి లోక్సభ బరిలోకి దించాలని పార్టీ పరిశీలిస్తుండగా.. మరికొందరికి స్థానికంగా వ్యతిరేకత వల్ల టికెట్ల సంగతి తేలట్లేదు. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని ఈసారి లోక్సభకు పోటీ చేయించాలని వైకాపా నాయకత్వం చూస్తోంది. వీరిలో గుమ్మనూరు జయరాం, ఉష శ్రీచరణ్, విడదల రజిని, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని జయరాంకు ముఖ్యమంత్రే చెప్పారు. ఆలూరు టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని జయరాం కోరినా.. ఇంకా స్పష్టత రాలేదు.
ఉష శ్రీచరణ్ను ఈసారి ఆమె సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న రాప్తాడు అసెంబ్లీ లేదా, హిందూపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వైకాపా కసరత్తు చేస్తోంది. ఒకవేళ శాసనసభాపతి తమ్మినేని సీతారాంను ఎంపీగా పోటీకి దించితే ధర్మానను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా బరిలోకి దింపనున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా అవసరమైతే ఈసారి అమర్నాథ్ను లోక్సభ బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం అనకాపల్లిలో వ్యతిరేకత ఉన్నా.. అక్కడి నుంచే పోటీకి ఆయన సిద్ధమయ్యారు. జోగి రమేష్ను విజయవాడ/ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించడంపై పార్టీ సర్వేలు చేయిస్తోంది. ఆయన ఈసారి మైలవరంలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, పార్టీ మాత్రం రమేష్ను అయితే ఎంపీగా.. లేదా పెడనలోనే పోటీకి దించాలని చూస్తోంది.
ఇప్పటికి వీరికే స్పష్టత..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్బాషా, కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, రాజన్నదొర, సీదిరి అప్పలరాజు తదితరులకు టికెట్లు దాదాపు ఖాయమేనంటున్నారు. వీరిలో బొత్స ఆరోగ్య కారణాల రీత్యా.. వీలైతే రాజ్యసభకు వెళ్లాలని చూస్తున్నారు. కానీ ఈసారికి చీపురుపల్లి నుంచే బరిలోకి దిగాలని సీఎం సూచించినట్లు ప్రచారం ఉంది. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బుగ్గన కోరుతున్నారు.
సురేష్ను యర్రగొండపాలెం నుంచి కాకుండా కొండపి నుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ పరిశీలిస్తోంది. తానేటి వనిత, బూడి ముత్యాలనాయుడు, సీదిరి అప్పలరాజుకు టికెట్లు దాదాపు ఖాయమే. అయితే కొవ్వూరులో ఎస్సీల్లోనే మరో వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే వనితకు అక్కడ అవకాశం ఉండకపోవచ్చు. సాలూరులో రాజన్నదొరకే మళ్లీ టికెట్ దక్కనుంది. అయితే ఈ సారి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
వీరి సంగతి తేలాలి
నగరిలో మంత్రి రోజాకు పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెకు టికెట్ ఇస్తారా.. లేదా అన్నది తేలాలి. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టికెట్ల విషయం నిర్ణయించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో.. జ్ఞానేంద్రరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో నారాయణస్వామి టికెట్ విషయం ఏమవుతుందో చూడాలి. మేరుగు నాగార్జున ఈసారి వేమూరులో కాకుండా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. అంబటి రాంబాబు ఈసారి మళ్లీ సత్తెనపల్లి నుంచే పోటీచేస్తానని ధీమాగా చెబుతున్నారు.
అయితే పార్టీలో ఆయనకు సానుకూల పరిస్థితులు లేవు. సత్తెనపల్లిలో ఓ ప్రధాన వర్గం నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు టికెట్ల విషయం కూడా తేలాలి. తెదేపా-జనసేన పొత్తు వీరి స్థానాలపై ప్రభావం చూపనుంది. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురంలో వైకాపా ముఖ్యనేతలు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈసారి రామచంద్రపురంలో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని బోస్ గట్టిగానే పట్టుబట్టారు. ఈ పంచాయితీ సీఎం వరకూ వెళ్లడంతో రామచంద్రపురం టికెట్పై స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం