సీఎం జగన్‌ను ఓడించడమే మా లక్ష్యం

ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 04 May 2024 05:21 IST

మాదిగ సంఘాల ఐక్యవేదిక జేఏసీ

మంగళగిరి, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అమరావతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం పలు దళిత సంఘాల నాయకులతో కలిసి.. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఐదేళ్లు ఎస్సీ వర్గీకరణపై జగన్‌ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ మాదిగలకు 15ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని తెదేపా కేటాయించిందన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే దళితులు ఉపాధి లేక అలమటిస్తున్నారని.. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సి వస్తుందన్నారు. వైకాపాను ఓడించడమే లక్ష్యంగా దళితులు పనిచేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని