పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు.
దివ్యాంగుల సంక్షేమంపై వైకాపా సర్కారు వివక్ష
రాయితీ రుణాల ఎత్తివేత
ఆర్థికసాయం అందకుండా ఎత్తుగడలు
నమ్మించి మోసం చేసిన జగన్
ఈనాడు, అమరావతి
బకాయిలను ఎగవేయడం.. నిధులను, లబ్ధిదారులను తెగ్గోయడం.. జగన్కు వెన్నతో పెట్టిన విద్య. అన్ని శాఖలు, అన్ని వర్గాల విషయంలో ఇదే విధానాన్ని అవలంబించిన జగన్ ‘కాళ్లూచేతులు’ ఆడని దివ్యాంగుల విషయంలోనూ నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించారు. వారు ‘సొంతకాళ్ల’పై నిలబడకుండా రాయితీ రుణాలను ఎత్తేశారు. వారికి ‘ఊతం’గా నిలిచే పింఛనును పెంచలేదు. ‘ఆసరా’ అవ్వాల్సిన ‘పెళ్లికానుక’కు కూడా నిబంధనల తిరకాసుతో ఎసరు పెట్టారు.
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో వారు ఉన్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న వారికి గత తెదేపా ప్రభుత్వం రూ.3 వేల పింఛను అందించగా.. వైకాపా సర్కారు పైసా అదనంగా విదల్చలేదు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసినా ఒక్క రూపాయి కూడా పెంచడానికి మనసు రాలేదు జగన్కు. వారికంటూ ప్రత్యేక పథకాలు చేపట్టలేదు. పైగా.. గత ప్రభుత్వాలు అమలుచేసిన వాటినీ రద్దు చేశారు. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకుగాను అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని ఎత్తేశారు. ‘పెళ్లికానుక’లో నిబంధనలు తెచ్చి అత్యధికులకు అందకుండా ఎత్తుగడ వేశారు. దివ్యాంగులకు మోటారు వాహనాలను కూడా తగిన సంఖ్యలో సరఫరా చేయలేదు. వైకాపా నేతలు సిఫార్సు చేసిన వారికే అందజేశారు.
80 శాతంపైగా వైకల్యమున్న వారికి సున్నా
జగన్ అధికారంలోకి రాగానే 2019లో వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ రూ.3 వేలను పింఛనుగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంటే 80 శాతానికి పైగా వైకల్యమున్న వారికి ఎలాంటి పెరుగుదల లేదు. 79% కంటే తక్కువ ఉన్న దివ్యాంగులకు అప్పటికే రూ.2 వేలు అందుతుండగా జగన్ ప్రకటనతో రూ. 1000 పెరిగినట్టు లెక్క. తర్వాత నాలుగేళ్లు గడిచినా దివ్యాంగులకు పింఛను పెంచలేదు. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో నిత్యావసరాల ధరలు ఎంతగానో పెరిగాయి. దివ్యాంగులు వాడే మందుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. మిగిలిన వారితో పోల్చితే 80 శాతానికి పైగా వైకల్యమున్న వారికి ఏ పనీ చేసుకునే సామర్థ్యం ఉండదు. కొన్ని కుటుంబాలకు వీరే పూర్తి ఆధారం. అయినా వారికి పింఛను పెంచే విషయంలో జగన్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.
పెళ్లికానుకకు షరతులు..
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా దివ్యాంగుల పింఛను పెంచడానికి జాలి లేని జగన్.. ‘పెళ్లికానుక’లోనూ కోత విధించి వారిని నష్టపరిచారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలా మంది దివ్యాంగులు చదవలేకపోయారు. జగన్ మాత్రం.. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులయితేనే ఆర్థికసాయం అందిస్తామని షరతు విధించారు. పలు రకాల నిబంధనలు పెట్టి వారికి సాయం అందకుండా కుట్రపన్నారు. ఫలితంగా.. అత్యధికులు ‘పెళ్లికానుక’కు నోచుకోలేకపోయారు. అది కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయన్న కారణంగా పంపిణీ చేశారు. 2019 నుంచి 2022 అక్టోబరు వరకు ఈ పథకం కింద ఒక్కరికి కూడా సాయం అందించలేదు. గత ఏడాదిన్నరగా 499 మందికి మాత్రమే పంపిణీ చేసింది. అదే తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య 5,253 మంది దివ్యాంగ యువతకు రూ.34 కోట్లు అందజేసింది.
ఉపాధికి గండికొట్టారు..
తెదేపా ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే దివ్యాంగులకు కూడా రాయితీ రుణాలు అందజేసింది. రూ.లక్ష, రూ.2 లక్షలను రాయితీగా, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి అవకాశాల్ని కల్పించింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఏటా ఈ పథకం కింద ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచుతూ పోయింది. ఇలా ఐదేళ్లలో 3,540 మంది లబ్ధిదారులకు రూ.26.55 కోట్ల మేరకు అందించి దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్కు.. దివ్యాంగులు సొంతకాళ్లపై నిలబడటం ఇష్టం లేనట్టుంది! అందుకే... అప్పటివరకు తెదేపా ప్రభుత్వం అందజేసిన రాయితీ రుణాల మంజూరును నిలిపేసింది. వారి స్వయం ఉపాధికి గండి కొట్టింది.
కేంద్ర పథకంతో సరిపెట్టేలా..
తెదేపా అమలుచేసిన రాయితీ రుణ పథకాన్ని సీఎం జగన్ నిలిపేయడంతో దివ్యాంగుల్లో ఆందోళన పెల్లుబుకింది. పథకాన్ని అమలుపరచాలని వారు డిమాండ్ చేయడంతో జగన్ కొత్త ఎత్తుగడ వేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాలను రాష్ట్రంలోని దివ్యాంగులకు వర్తింపజేశారు. ఆసక్తి ఉన్న ఒక్కో దివ్యాంగుడికి దీని ద్వారా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇప్పించారు. రుణం తీసుకున్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు. మొత్తం రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీ వాయిదాల రూపంలో చెల్లించాల్సిందే. కనీసం ఇలా అయినా ఎంత మందికి రుణాలు అందజేశారో తెలుసా... 347 మందికి మాత్రమే. ఇది.. దివ్యాంగుల సంక్షేమం, వారి ఉపాధిపై వైకాపా సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి.
‘‘దివ్యాంగులకు రూ.3 వేలు పింఛను ఇస్తాం..’’
సాధారణంగా ఏ పార్టీ అయినా ఎన్నికల సమయంలో.. అప్పటివరకు ఓ వర్గానికి కలుగుతున్న లబ్ధికంటే కొంత మెరుగ్గా ప్రయోజనం చేకూర్చాలని చూస్తుంది. మిగిలిన పార్టీలకంటే తాము ఎక్కువ లబ్ధి కలిగిస్తామని మ్యానిఫెస్టోలోనూ, హామీల్లోనూ పేర్కొంటాయి. కానీ, ‘రివర్స్’ మనస్తత్వంగల జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే 80 శాతానికిపైగా వైకల్యమున్న దివ్యాంగులకు రూ.3 వేల పింఛను అందుతుండేది. మ్యానిఫెస్టోలోనూ అంతేమొత్తంలో ఇస్తానని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు అడ్డగోలుగా పెరిగినా.. అదే రూ.3 వేలు ఇచ్చారు. ఇతర పథకాల అమలులోనూ 80 శాతానికిపైగా వైకల్యమున్న వారికి నిబంధనల కొర్రీలు పెట్టి వంచించారు.
ఆ మంచి రోజులు మళ్లీ ఎప్పుడు?
గత తెదేపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనాకాలం దివ్యాంగులకు మంచి రోజులని చెప్పొచ్చు. 2014లో తెదేపా ప్రభుత్వం.. అప్పటివరకు 40% నుంచి 79% వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు అందిన రూ.500 పింఛనును రూ.1000కి పెంచింది. 80% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇస్తున్న పింఛనును రూ.1,500 చేసింది. అదే ప్రభుత్వం 2019లో 79%లోపు వైకల్యం ఉన్న వారికి రూ.2 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.3 వేలను పింఛనుగా అందించింది. అంటే దివ్యాంగుల పింఛనును ఐదేళ్లలో రూ.500 నుంచి రూ.2 వేలు, రూ.3 వేలకు పెంచింది. ఈ లెక్కన కొందరికి 4 రెట్లు, మరికొందరికి 6 రెట్ల మేరకు పింఛను మొత్తం పెరిగింది. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలో ఇంత భారీగా పెంచడం చరిత్రలోనే ప్రథమం.
పెళ్లికానుకకు నిబంధనలు సరికాదు
- చిన సుబ్బయ్యయాదవ్, అధ్యక్షుడు, రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం
సాధారణంగా దివ్యాంగులను వివాహం చేసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా సర్కారు.. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులైతేనే ‘పెళ్లికానుక’ ఆర్థికసాయం అందిస్తామని నిబంధన పెట్టడం సరికాదు. ఈ షరతు కారణంగా చాలా మంది దివ్యాంగులు అర్హత కోల్పోయారు. ప్రభుత్వం అందజేసిన మూడు చక్రాల వాహనాలు కూడా నాణ్యంగా లేవు. గత ప్రభుత్వం వాహనాలతోపాటు ఆరు నెలలకొకసారి పెట్రోలు బిల్లు ఇచ్చేది. దీన్ని కూడా వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.
90 వేల మంది పింఛన్లు తొలగించారు
- సునీల్, దివ్యాంగుల సంక్షేమ సంఘం నేత
రకరకాల నిబంధనలు పెట్టి వైకాపా సర్కారు గత ఐదేళ్లలో 90 వేల మంది దివ్యాంగుల పింఛన్లను తొలగించింది. విద్యుత్తు వినియోగం 300 యూనిట్లు దాటిందన్న నెపంతో పింఛన్లను తొలగించడం అన్యాయం. గతంలో దివ్యాంగులకు వారి వైకల్యానికి అనుగుణంగా పరికరాలు అందించేవారు. వైకాపా ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందో తెలియని పరిస్థితి. అంకెలు మాత్రం చూపిస్తోంది. మూడు చక్రాల వాహనాల పరిస్థితి కూడా అంతే. ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే 10 మందికి మాత్రమే అందజేశారు. అది కూడా వైకాపా నాయకులు సూచించినవారికే ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్