Thammineni: శాసన సభాపతి తమ్మినేనికి విశాఖలో చికిత్స

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంను విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

Updated : 06 Jan 2024 07:10 IST

విశాఖపట్నం(ఎం.వి.పి.కాలనీ), న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంను విశాఖలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు తొలుత శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం విశాఖపట్నానికి తరలించారు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. సీతారాంను వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని