Ambati Rambabu: పింఛను సొమ్ముతో సంబరాలా.. రాంబాబూ?
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీడిప్ టికెట్లు అంటగట్టి, పింఛను నుంచి రూ.100 చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్టీకాలనీ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తంచేశారు.
లాటరీ టికెట్లు వద్దేవద్దు మా డబ్బు మాకివ్వండి
లక్కీడిప్ కోసం రూ.100 మినహాయింపుపై పింఛనుదారుల ఆగ్రహం
సత్తెనపల్లిలో తీరు మార్చుకోని మంత్రి అంబటి
సత్తెనపల్లి, న్యూస్టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీడిప్ టికెట్లు అంటగట్టి, పింఛను నుంచి రూ.100 చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్టీకాలనీ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెలలో రూ.3 వేలు చొప్పున పింఛను వచ్చిందనుకుంటే అందులో కోతలు వేశారని, అదేమని ప్రశ్నించినా మినహాయించుకున్న డబ్బును వెనక్కి ఇవ్వలేదని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వాపోయారు. తనకు వృద్ధాప్య పింఛను రూ.3 వేలు రాగా.. రూ.2,800 మాత్రమే ఇచ్చారని స్థానికుడు కె.ఆంజనేయులు చెప్పారు. తమవద్ద రూ.100 చొప్పున తీసుకున్నారని వృద్ధురాలు కోటేశ్వరమ్మ తెలిపారు. కొందరి నుంచి రూ.500 దాకా వసూలు చేసినట్లు వాపోయారు. లక్కీ డ్రాలు మాకెందుకు? పింఛను పూర్తిగా ఇవ్వకుండా కోతలు పెట్టడం ఏంటి? అని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
అధికారులు ఏం విచారించినట్లు?
సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పింఛనుదారులకు బలవంతంగా లక్కీడిప్ టికెట్లు అంటగట్టడంపై ‘పింఛను సొమ్ముతో లక్కీడిప్ టికెట్’ శీర్షికన ‘ఈనాడు’లో ఈ నెల 8న కథనం ప్రచురితమైంది. దీనిపై విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని డీఆర్డీఏ అధికారులను సెర్ప్ సీఈవో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పింఛనుదారుల దగ్గరకు వెళ్లకుండానే... అలాంటిదేమీ లేదని అధికారులు విచారణ నివేదిక ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాలు, వార్డులకు వెళ్లి అధికారులు ఏం విచారించారో తెలియని పరిస్థితి.
అందరికీ అంటగట్టేస్తున్నారు..
పింఛనుదారులనే కాకుండా అందరికీ బలవంతంగా లక్కీడిప్ టికెట్లు అంటగడుతున్నారు. 50 టికెట్లు ఉన్న నాలుగైదు పుస్తకాల్ని స్థానిక వ్యాపారులకు ఇచ్చి, ఆ మేరకు నగదు చెల్లించాలని కొందరు అధికార పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఒకరిద్దరు కౌన్సిలర్లు బలవంతంగా వ్యాపార, వాణిజ్యవర్గాల నాయకులకు టికెట్లను అంటగట్టి నగదు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. కొన్నిశాఖల ఉద్యోగులకూ వసూళ్ల లక్ష్యాల్ని విధించారు. కొందరు ఉద్యోగులు టికెట్ల పుస్తకాల్ని తీసుకునేందుకు ఇష్టపడక పోవడంతో ఓ కౌన్సిలర్ భర్త సచివాలయానికి తాళం వేసి మరీ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వాహనాల తనిఖీల పేరుతోనూ కొందరి నుంచి రూ.100 చొప్పున వసూలు చేయడం చూస్తుంటే అక్రమ వసూళ్లు ఏస్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. గతేడాది సంక్రాంతి లక్కీడ్రా వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైనప్పటికీ ఈసారీ ప్రజల సొమ్ముతో సంబరాలకు దిగడం అంతటా చర్చనీయాంశమైంది.
అంబటి తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు
సత్తెనపల్లిలోని వావిలాల స్మృతివనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్మృతివనం 6 వేల మందికే సరిపోతుంది. ఎంట్రీపాసుల పేరుతో లక్షకు పైగా టికెట్లను ఒక్కొక్కటి రూ.100 చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వైకాపా నాయకుడు, ముప్పాళ్ల మండల మాజీ జడ్పీటీసీ ఇందూరి నరసింహారెడ్డి... మంత్రి అంబటి రాంబాబు తీరును విమర్శించారు. సంక్రాంతి సంబరాల కోసం లక్కీడిప్ పేరుతో వసూళ్లను నిరసిస్తూ బుధవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. జనం సొమ్ముతో సంక్రాంతి సంబరాలు చేయడం ఏమిటని అంబటిని ప్రశ్నించారు. గతేడాది ఇదే విషయంలో కేసు నమోదైనా తీరు మార్చుకోకపోవడంతో ప్రజల్లో చులకన అవుతున్నట్లు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్