ఉన్నది రాస్తే ఎదురుదాడి!
అధికార వైకాపాకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం దాడి చేస్తోంది.
ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా?
వైకాపాతో అంటకాగడం వల్లే కదా.. ఒక ఐజీ అయిదుగురు ఎస్పీలపై వేటు పడింది!
ఏ తప్పూ చేయకుంటే ఈసీ ఎందుకు ఆగ్రహిస్తుంది?
గత అయిదేళ్లలో పోలీసు వేధింపుల బారినపడినవారు ఎందరో
బాధితుల పైనే ఎదురు కేసులు పెట్టిన ఘనత మీది
ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటన దబాయింపు కాదా?
ఈనాడు, అమరావతి: అధికార వైకాపాకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్ అధికారుల సంఘం దాడి చేస్తోంది. అవి నిరాధార, అసత్య ఆరోపణలంటూ దబాయిస్తోంది. పలువురు ఐపీఎస్ అధికారులపై ఈనాడులో ఇటీవల ప్రచురించిన కథనాలను ఖండిస్తూ ఐపీఎస్ అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఛాప్టర్ తరఫున.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ హోదాలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న అంశాలు ఆయన ఒక్కరి అభిప్రాయలా.. లేక సంఘం మొత్తానివా? సంఘం అభిప్రాయాలే అయితే దానిపై కీలకమైన ఆఫీస్ బేరర్ల సంతకాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వైకాపాతో అంటకాగే అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా?
కాంతిరాణా: పలువురు ఐపీఎస్ అధికారులపై నిరాధార, అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారు.
ఈ ప్రశ్నలకు బదులేది?: అసలు ‘ఈనాడు’ రాసిన ఏ కథనం, ఎలా నిరాధారమో చెప్పకుండానే.. అవి అసత్య ఆరోపణలని మీరెలా నిర్ధారించేస్తారు? మీరేమైనా వాటిపై విచారణ జరిపించారా? లేదంటే వైకాపాతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరఫున మీరు వకల్తా పుచ్చుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని మీరు తేల్చేశారు? అయిదేళ్ల పాటు వైకాపా సేవలో తరించింది చాలక.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా.. అయిదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వాళ్లు ఏ తప్పూ చేయకుండా, నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారు? అలాంటి అధికారుల గురించి ఉన్నది ఉన్నట్లు రాస్తే అది అసత్యం ఎలా అవుతుంది? చివరికి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, గరుడ్ సుమిత్ సునీల్, అమిత్ బర్దర్లు వాళ్లు గతంలో పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాయటం వాస్తవం కాదా? ప్రతిపక్షాలను అణచివేయటం నిజం కాదా? వాళ్లు వైకాపా పీనల్ కోడ్ను ఎంత బాగా అమలు చేశారో.. ఘటనలతో సహా రాసింది.. అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం మీకుందా?
జగన్ పాదాల దగ్గర పోలీసు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి.. చట్టబద్ధమైన విధులు గురించి మాట్లాడటమా?
కాంతిరాణా: పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయటానికి, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలన్న లక్ష్యంతో అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?: కొంతమంది ఐపీఎస్లు తాము అఖిలభారత సర్వీసు అధికారులమని కూడా మరిచిపోయి అయిదేళ్లుగా వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేట్రేగిపోతుంటే.. అది మీకెప్పుడు అవమానకరంగా అనిపించలేదా? కనిపించలేదా? ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వైకాపా పీనల్ కోడ్, సీఆర్పీసీ బదులు వైకాపా ప్రొసీజర్ కోడ్ అమలు చేస్తున్నప్పుడు.. అసలు చట్టాలేంటో గుర్తుకురాలేదా? అధికార పార్టీకి భజన చేయటం.. ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్ఠను జగన్ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్ధమైన విధుల నిర్వహణ అనే మాటలు రావటం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అంతెందుకు విజయవాడలో తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే.. ఆ నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి వారికి కొమ్ముకాసింది ఎవరు? తాజాగా నందిగామలో తెదేపా సానుభూతిపరులపై దాడి జరిగితే బాధితులైన వారిపైనే రివర్స్ కేసు పెట్టిన ఘనత ఎవరిది? రాష్ట్రంలో ప్రతిచోటా జరిగింది ఇదే కదా! పుంగనూరులో మరో తాలిబన్ రాజ్యాన్ని, మాచర్లలో చంబల్లోయను సృష్టించిన నాయకులకు అండగా ఉన్నది ఘనత వహించిన కొందరు పోలీసు అధికారులే కదా!
ప్రధాన ప్రతిపక్షాన్నే కలవనివారు.. సామాన్యులకు ఆ అవకాశమిస్తారా?
కాంతిరాణా: చట్టబద్ధమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే.. వాళ్లు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. దీనికి పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానమిస్తుంది.
ఈ ప్రశ్నలకు బదులేది?: ఆంధ్రప్రదేశ్లో గత అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన, రైతు సంఘాల ప్రతినిధుల వరకు.. చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతోమంది పోలీసు వేధింపుల బారిన పడ్డారు. అసలు రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందా? అనే అనుమానం వచ్చేలా బాధితుల పైనే వేలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా! దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా! అమరావతి రైతులు మొదలుకుని ప్రతి ఒక్కరిపైనా తీవ్ర అణచివేత, నిర్బంధం ప్రదర్శించారు. వాటిని చట్టబద్ధమైనా విధులు అంటారా? అసలు బాధితుల్ని ఎప్పుడైనా కలవడానికి, వాళ్లు గోడు చెప్పుకోవడానికి అవకాశమిచ్చారా? అసలు వేధించిందే మీరైతే.. ఇక ఎవరివద్ద చెప్పుకోవాలి? పోలీసు బాస్ అయిన డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డి గత రెండేళ్లలో ఏ ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా? దాదాపు రెండేళ్ల తర్వాత శుక్రవారం నాడు తమకు డీజీపీ దర్శనభాగ్యం కలిగిందని ప్రధాన ప్రతిపక్షం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. ఇక సామాన్యులు మీ దగ్గరకు రాగలరా? బాధితులు న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చని చెబుతున్నారు.. పోలీసులపై ఎంతమంది బాధితులు కోర్టులను ఆశ్రయించగలరో సమాధానం చెప్పగలరా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు