చంద్రబాబు, లోకేశ్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్చేశారు
అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్గ్రిడ్, ఎసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఇతర నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సిట్ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2)...
ముఖ్యమైన దస్త్రాలను దహనం చేసిన సిట్ సిబ్బంది
ఎన్నికల తరుణంలో తగలబెట్టడంపై అనుమానాలు
జిరాక్స్ మిషన్ వేడెక్కటం వల్ల కాగితాలు ఇరుక్కుపోయాయట!
ఇంకు తక్కువగా ఉండటం వల్ల ప్రింట్లు సరిగ్గా రాలేదట!
అందుకే కాల్చేశారట
సిట్ అధిపతి రఘురామ్రెడ్డి సమాధానం
ఈనాడు - అమరావతి
అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు, నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఫైబర్గ్రిడ్, ఎసైన్డ్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యులు చెప్పిన వాటికల్లా తలాడించి, తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఇతర నాయకులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందనే అభియోగాలు ఎదుర్కొంటున్న సిట్ (సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2)... సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా కేసులకు సంబంధించిన పలు పత్రాలను దహనం చేసింది. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయం ఉన్న ‘‘సంవృద్ధి నెక్సా’’ అపార్ట్మెంట్ ప్రాంగణంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ పత్రాలను తగలబెట్టేశారు. మరో 34 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన కేసులకు సంబంధించిన ముఖ్య పత్రాలను తగలబెట్టడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగుకు సంబంధించిన ఆధారాలను, హార్డ్డిస్క్లను అక్కడి పోలీసు అధికారులు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ధ్వంసం చేశారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలు, వాంగ్మూలాలు వంటి వాటిని ధ్వంసం చేశారా అనే ప్రశ్నలను ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి.
చంద్రబాబు దస్త్రాలివి.. కాల్చేసి వీడియోలు పంపాలని పెద్దసారు చెప్పారు
సిట్ అధిపతి, ఐజీ కొల్లి రఘురామ్రెడ్డి వద్ద పనిచేసే సిబ్బంది ఓ సంచీ నిండా పత్రాలు తీసుకొచ్చి అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఓ మూలన కుప్పగా పోశారు. ఆ తర్వాత దానికి నిప్పు అంటించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు వివరాలు, ఈ కేసులో హెరిటేజ్ సంస్థ... సిట్ అదనపు ఎస్పీకి రాసిన సమాధానాల ప్రతులు, హెరిటేజ్ లోగోతో ఉన్న ఇతర పత్రాలు సహా, మరికొన్ని దస్త్రాలనూ కాల్చేశారు. ఈ మొత్తం దృశ్యాలను సిట్ సిబ్బందే చిత్రీకరించారు. పత్రాలు తగలబెడుతుండటాన్ని గమనించిన స్థానికులు కొందరు.. అవి ఏం పత్రాలు? ఎందుకు కాలుస్తున్నారు అని ప్రశ్నించగా ‘ఇవి చంద్రబాబుకు సంబంధించిన దస్త్రాలు’ అంటూ ఆ సిబ్బంది సమాధానమిచ్చారు. పత్రాలను కాల్చేసి ఆ వీడియోలు పంపించాలని తమ పెద్దసారు చెప్పారని.. అందుకే వీడియోలు తీస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానికులు కొందరు వారి సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండగా.. వాటిని తీయవద్దంటూ సిట్ సిబ్బంది బెదిరించారు. సెల్ఫోన్ల నుంచి ఆ దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి చేశారు. పత్రాల దహనం అంశం మీడియాలో ప్రసారం కావడంతో అక్కడ కాల్చిన కాగితాల ఆనవాళ్లు కనబడకుండా చేసేందుకు ప్రయత్నించారు. కేవలం ఏవో వ్యర్థాలు కాల్చినట్లుగా బూడిద కుప్ప మాత్రం అక్కడ ఉంది. దగ్గరకు వెళ్లి చూస్తే కాల్చిన పత్రాల ముక్కలు కనిపించాయి. వాటిల్లో లింగమనేని రమేశ్ పేరు, ఇతర అంశాలు ఉన్నాయి.
పత్రాలు కాల్చేయడం వెనుక అసలు గుట్టేమిటి?
గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సిట్ ఏర్పాటు చేసింది. వైకాపాకు కొమ్ముకాసే అధికారిగా విమర్శలున్న ఐజీ కొల్లి రఘురామ్రెడ్డిని దీనికి అధిపతిగా నియమించింది. ఆ తర్వాత దీన్ని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం-2గా మార్చింది. సిట్ ఏర్పాటైనప్పటి నుంచి తెదేపా ముఖ్య నాయకులే లక్ష్యంగా ఇది పనిచేసింది. నిరాధార, నిర్హేతుకమైన అంశాలతో తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు నారా లోకేశ్, నారాయణలపై సిట్లో కేసులు నమోదు చేశారన్న ఫిర్యాదులున్నాయి. సిట్ అధికారులు నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో నారా లోకేశ్ను, మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబీకుల్ని నిందితులుగా చేర్చారు. గతేడాది అక్టోబరు 10, 11 తేదీల్లో నారా లోకేశ్ను, ఆ తర్వాత తెదేపా నాయకుడు కిలారు రాజేశ్ను ఈ సిట్ కార్యాలయానికే పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. అప్పట్లో లోకేశ్ విచారణ సందర్భంగా.. హెరిటేజ్కు సంబంధించిన అంశాలపైనే ఆయన్ను ఎక్కువగా ప్రశ్నించారు.
నారా భువనేశ్వరికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ పత్రాలను... లోకేశ్ ముందు పెట్టి వాటిపైనా ప్రశ్నించారు. ‘ఈ పత్రాలు మీకు ఎలా వచ్చాయి’ అంటూ దర్యాప్తు అధికారిని తాను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేక దాటవేశారని అప్పట్లో లోకేశ్ మీడియాకు వెల్లడించారు. ‘ఈ వ్యవహారాన్ని నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నా. మా అమ్మ ఐటీ రిటర్న్స్ అధికారికంగా తీసుకున్నారా? అనధికారికంగా తెచ్చారా? సీఐడీ వారికి ఎలా వచ్చాయనేది తేలుస్తాం’ అంటూ అప్పట్లో లోకేశ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిట్ సిబ్బంది... ఇన్నర్రింగ్ రోడ్డు సహా, ఇతర కేసులకు సంబంధించిన పత్రాలను సోమవారం కాల్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పత్రాలను ఎందుకు కాల్చాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న మర్మమేమిటి అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు వీలుగా ఏవైనా పత్రాలు సృష్టించారా? చట్టవిరుద్ధంగా ఏవైనా పత్రాలు సమకూర్చుకున్నారా? వాటినే కాల్చేశారా అనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
జిరాక్స్ మిషన్ వేడెక్కి కాగితాలు ఇరుక్కుపోయాయి..: సిట్ అధిపతి రఘురామ్రెడ్డి
సిట్ కేసులకు సంబంధించిన పత్రాల దహనం ఘటనపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతుండగా... వాటన్నింటినీ నివృత్తి చేసేలా పూర్తి స్పష్టతతో సమాధానమివ్వాల్సిన సిట్ అధిపతి కొల్లి రఘురామ్రెడ్డి సోమవారం మధ్యాహ్నం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి. ‘సిట్ నమోదు చేసిన కేసులకు సంబంధించి కొన్ని లక్షల పేజీలను జిరాక్సులు తీయిస్తున్నాం. దీంతో జిరాక్స్ యంత్రాలు వేడెక్కిపోయాయి. కాగితాలు ఆ యంత్రాల్లో ఇరుక్కుపోయాయి. జిరాక్స్ మిషన్లో ఇంకు స్థాయి తగ్గటం వల్ల ప్రింట్లు మసకగా వచ్చాయి. అందుకే అలాంటి పేపర్లన్నింటినీ బయటకు తీసి వాటిని కాల్చేశాం. వాటి స్థానంలో కొత్తగా ప్రింట్లు తీసుకున్నాం’ అని రఘురామిరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాల్చేసిన కాగితాలు చూస్తే వాటిపై ప్రింటు స్పష్టంగా కనిపిస్తోంది. కాలిన దస్త్రాల మధ్య ఉన్న కాగితాలపై కూడా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిరాక్స్ మిషన్లో ఇరుక్కుపోయిన కాగితాలను బయటకు తీస్తే అవి కొంత చిరిగి ఉంటాయి. కానీ కాల్చిన కాగితాలు చిరిగినట్లుగా లేవు. పైగా వాటన్నింటినీ బండిల్స్ కట్టి మరీ కాల్చడం కోసం తీసుకొచ్చారు. రఘురామ్రెడ్డి చెబుతున్న దానికి, వాస్తవంగా జరిగిన దానికీ ఏ మాత్రమూ పొంతనలేదు. తెదేపా నేతలపై ఉన్న కేసులకు సంబంధించిన పత్రాలు మాత్రమే జిరాక్స్ మిషన్లో ఇరుక్కుపోయాయా? ఆ ప్రింట్లు మాత్రమే సరిగ్గా రాలేదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండు చేస్తున్నాయి.
దర్యాప్తు బృందాన్ని బెదిరించేందుకే: కొల్లి రఘురామ్రెడ్డి
‘అయిదు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశాం. అంతకంటే ముందే ఆయా కేసుల డైరీలు, ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి సమర్పించాం. అభియోగపత్రాలతో పాటు సమర్పించిన ఆధారాలన్నీ నిందితులకు కోర్టు ద్వారా అందించాల్సి ఉంటుంది. ఒక్కో అభియోగపత్రంతో పాటు 8 -10 వేల పత్రాలున్నాయి. ఒక్కో కేసులో 12 నుంచి 40 మంది వరకూ నిందితులున్నారు. వాళ్లందరికీ ఈ పత్రాలు ఇవ్వటం కోసం లక్షల పేజీలు జిరాక్స్లు తీయిస్తున్నాం. దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను, దర్యాప్తు అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పలు మీడియా సంస్థలు బాధ్యతారహితంగా కథనాలు ప్రసారం చేశాయి. అలాంటి అనైతిక చర్యలకు మీడియా దూరంగా ఉండాలి. నేరాన్ని రుజువు చేసేందుకు తగిన సహేతుక ఆధారాల్ని కోర్టు ముందు పెట్టాం.
కొంతమంది వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆధారాలను సృష్టించారని, హెరిటేజ్ సంస్థకు, వ్యక్తులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లకు సంబంధించిన పత్రాలను చట్టవిరుద్ధంగా పొందారని అందుకే వాటిని ధ్వంసం చేశారని తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఇది దర్యాప్తు బృందాన్ని బెదిరించడమే. ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సీఆర్పీసీ నిబంధనల ప్రకారమే నిందితుడు, ఆయన కుటుంబీకులకు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్లను అధికారికంగా తీసుకున్నాం. ఇతర ఆధారాల్లాగానే ఈ ఆదాయపు పన్ను రిటర్న్స్ను చట్టబద్ధంగానే పొందాం. కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో ఈ రిటర్న్స్ కూడా ఒక భాగం. ఈ ఐటీ రిటర్న్స్ ఆధారంగానే నిందితుడ్ని ప్రశ్నించాం. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన పత్రాలన్నీ ఆ కంపెనీ ప్రతినిధుల ద్వారా అధికారికంగానే పొందాం’ అని కొల్లి రఘురామ్రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?