పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది.

Updated : 30 Apr 2024 09:18 IST

ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించనున్న హేమకుమారి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ, యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్‌ ఆధ్వర్యంలో మే 3న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్‌లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా, అందులో హేమకుమారి ఒకరు కావడం విశేషం. ఉన్నత విద్యావంతురాలైన ఆమె మహిళల విద్య, వైద్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే అంశంపై ఐక్యరాజ్యసమితిలో మాట్లాడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని