రండి.. రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు.
ఏపీలో ఓట్లున్న హైదరాబాద్ వాసులతో అక్కడి నేతల మంతనాలు
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-కేపీహెచ్బీ కాలనీ: హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. ఓటర్ల వివరాలు సేకరించారు. ఓటు వేసేందుకు ఏపీకి వెళ్లి, తిరిగి వచ్చేవారికి నేతల అనుచరులు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. కొందరు ఓటర్లు సొంతంగానే రవాణా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ప్రత్యేక బస్సులు బుక్ చేసుకోగా.. మరి కొంతమంది జీపులను సమకూర్చుకుంటున్నారు.
అదనంగా ఆర్టీసీ బస్సులు..
హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణాలకు ఏపీఎస్ఆర్టీసీ రోజూ 350 బస్సులు నడుపుతుండగా.. టీఎస్ఆర్టీసీ కూడా దాదాపు అంతే సంఖ్యలో బస్సులు తిప్పుతోంది. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో బస్సులకు డిమాండ్ పెరిగినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు రోజులకు కలిపి 500 బస్సులు అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. కాగా, రోజుకు అదనంగా 200 బస్సుల వరకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు నడిపే అవకాశం ఉందని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
వాహనాలు సమకూర్చేదెలా..
తెలుగు రాష్ట్రాల్లో రెండుచోట్లా మే 13నే ఎన్నికలు ఉండటంతో ఓటర్లను తరలించేందుకు వాహనాలు సమకూర్చడం ఏపీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ముఖ్య అనుచరులకు కత్తి మీద సాములా మారింది. తమకు తెలంగాణలో ఓట్లు ఉండడంతో ఇక్కడి వాహనదారులు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి కనబర్చడం లేదని ఓ పార్టీ నేత తెలిపారు. సొంతంగా రవాణా సదుపాయం ఏర్పాటు చేసుకుంటే రానూపోనూ ఛార్జీలు ఇస్తామని కొందరు చెబుతున్నారు. ఇక, రైళ్లలో వెళ్దామనుకునేవారికి రిజర్వేషన్లు అందుబాటులో లేవు. ఎండల తీవ్రత నేపథ్యంలో జనరల్, స్లీపర్ బోగీల్లో ప్రయాణించలేని పరిస్థితి ఉంది. దీంతో జీపులు, మినీ బస్సుల్లో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. -
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జూన్ 10 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాహనాలకు మాత్రమే వాటిని నింపాలని కలెక్టర్(పౌరసరఫరాలు) పేరుతో నోటీసులు పంపారు. -
ఎన్ని కేసులు పెట్టారు.. ఎంతమందిని అరెస్టు చేశారు?
-
ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
5 రోజుల్లో రూ.7,546 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
భయపెడుతున్న రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.55 లక్షల జరిమానా
బోధన నిపుణుల కొరత, ఇతర లోపాల కారణంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాలు విధించింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇతరత్ర వాటి గుర్తింపు పునరుద్ధరణకు కళాశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఎన్ఎంసీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. -
నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. -
‘పది’లో ఈ ఏడాది సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు
రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ-సీబీఎస్ఈ) సిలబస్ పాఠ్యపుస్తకాలను ముద్రించారు. -
ఇదీ సంగతి
-
వానలతో చల్లబడిన వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన రాష్ట్రం చల్లబడింది. -
పశువైద్య సేవలకూ..వినియోగ రుసుములు?
పశు సంవర్ధక శాఖలో వినియోగ రుసుముల బాదుడుకు సర్కారు రంగం ‘సిద్ధం’ చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై కార్యాచరణ రూపొందించి అమలు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.