చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
4 లక్షల మంది నాయీబ్రాహ్మణుల్లో 40 వేల మందికే సాయం
పది లక్షల మంది రజకుల్లో లక్ష మందే అర్హులా?
దర్జీలకూ నామమాత్రంగా సాయం
‘చేదోడు’ ప్రయోజనం పది శాతం మందికే!
నిబంధనల పేరుతో అడ్డగోలు వడపోత
ఈనాడు, అమరావతి
2019 ఎన్నికల ముందు.. జగన్ ప్రకటించని పథకమంటూ లేదు.
అధికారంలోకి వచ్చాక.. వాటిలో అత్యధికం మరచిపోగా..
అమలుచేస్తున్న వాటిలోనూ లబ్ధిదారుల్ని రకరకాల నిబంధనలతో వడపోశారు.
‘చేదోడు’ పేరుతో.. వెనకబడిన కులాలైన
నాయీ బ్రాహ్మణులూ, రజకులకు చేయందిస్తానని మాటిచ్చి..
తర్వాత వివిధ కారణాలు చెప్పి చేయిచ్చారు..!
- నగరాలు, పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా ఎక్కువగా రజక కుటుంబాలకు చెందినవారే ఉంటారు. అపార్ట్మెంట్లో ఉండేవారితోపాటు, చుట్టుపక్కల వారి దుస్తులు ఉతికి, ఇస్త్రీచేయడం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరంతా గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్లే. రిజిస్టర్ అయిన లాండ్రీ షాపు లేదనే సాకు చూపించి వీరిని ‘చేదోడు’కు అనర్హులుగా చెప్పారు.
- హెయిర్ కటింగ్ షాపుల్లో కొన్నిచోట్ల ఒకరికిమించి నాయీబ్రాహ్మణులు పనిచేస్తుంటారు. దుకాణ యజమాని ఒక్కరికే సాయం ఇస్తామంటూ.. మిగిలినవాళ్లు అసలైన పేదలైనా సరే వారికి ఇవ్వలేదు.
- దుకాణం పెట్టుకునే స్తోమతలేని దర్జీలు ఎందరో.. ఇళ్ల దగ్గరే టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ‘చేదోడు’ కింద ప్రభుత్వం సాయం అందించడం లేదు. ఇదేమంటే ‘దుకాణం లేదు కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘దుకాణం లేకపోయినా ఇంటిదగ్గరే దుస్తులు కుడుతున్నా’నని, ‘దుకాణంలో టైలరింగ్ చేస్తున్నా.. కనికరించండి’ అని ఎందరో వేడుకున్నా.. కుదరదని నిర్దయగా చెప్పేశారు.
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. గత ఎన్నికల సమయంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలందరికీ ఆర్థిక సాయం చేసి ‘చేదోడు’గా నిలుస్తానని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక ‘షరతులు వర్తిస్తాయం’టూ భారీగా వడపోశారు. తమని అర్హులుగా పరిగణించాలని ఆయా వృత్తిదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. అక్కడి ఉద్యోగులు తామేమీ చేయలేమని, ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో మీకు సాయం ఇవ్వలేమంటూ చెబుతున్నారు.
ఏ గ్రామం, పట్టణంలోనైనా రజక, నాయీబ్రాహ్మణ వృత్తులవారు ఎవరనేది అక్కడి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తెలుసు. వారంతా తమ వృత్తులపై ఆధారపడినా.. జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకుండా మొండిచేయి చూపింది. ‘నాయీబ్రాహ్మణులకు, రజకులకు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం’ అని వైసీపీ 2019 మ్యానిఫెస్టోలో జగన్ ప్రకటించారు. తీరా వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చాక తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల రజక కుటుంబాలు ఉంటే.. ఏటా సగటున లక్ష కుటుంబాలకే సాయం అందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 4 లక్షల వరకు నాయీబ్రాహ్మణ కుటుంబాలు ఆ వృత్తిలో కొనసాగుతుంటే.. అందులో ప్రతి సంవత్సరం సగటున 40 వేల మందికే పథకం వర్తింపజేశారు. అంటే రెండు వర్గాల్లోనూ పదిశాతం మందికే పథకం అందింది. ఇక లక్షల సంఖ్యలో దర్జీలు ఉంటే.. ఏటా సగటున 1.70 లక్షల మందికే సాయం చేశారు. ఇక్కడా లబ్ధిదారులు పదిశాతం లోపే. నిబంధనలు సడలిస్తే.. ఇంకా లక్షల కుటుంబాలకు పథకం వర్తిస్తుందని తెలిసినా.. జగన్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించింది.
నిబంధనలతో అడ్డంగా కోత
‘చేదోడు’ లబ్ధిదారుల విషయంలో పలు నిబంధనలు అమలు చేసి.. వారి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మరే ఇతర పథకంలోనూ లబ్ధి పొందకూడదని, ఆరు నెలల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని.. అందులో నెలకు సగటున 300 యూనిట్లు దాటకూడదని, పట్టణంలో వెయ్యి చదరపు అడుగులపైన స్థలంలో ఇల్లు ఉండకూడదని, సాగు భూమి పదెకరాలలోపు ఉండాలని.. ఇలా పలు షరతులు వర్తింపజేశారు. దీంతో అత్యధిక మంది అర్హత పొందలేకపోయారు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్, రజకులకు లాండ్రీ దుకాణం, దర్జీలకు షాపు తప్పనిసరిగా ఉండాలని, వీటికి కార్మికశాఖ రిజిస్ట్రేషన్తో కూడిన సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన కారణంగా.. ఎక్కువ మందికి ఈ సాయం అందకుండా పోయింది. ఆయా నిబంధనలు సడలించకుండా వైకాపా ప్రభుత్వం ఎందరికో అన్యాయం చేసింది.
వీళ్లు అర్హులు కారా జగన్!
- పట్టణాలు, నగరాల్లోని అపార్ట్మెంట్లలో వాచ్మన్గా ఉంటూ, రజక వృత్తిని చేసుకునేవాళ్లకు ‘చేదోడు’ లేకుండా చేశారు. తొలి ఏడాది కొందరికి ఇచ్చినప్పటికీ.. అపార్ట్మెంట్లో కాకుండా బయట ఎక్కడైనా దుకాణంగానీ, లాండ్రీ బండి గానీ ఉండాలనే షరతుపెట్టారు. దీంతో తర్వాత ఏడాది నుంచి అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా ఉండే వారికి సాయం దక్కకుండాపోయింది.
- గ్రామాలూ, పట్టణాల్లో ఎక్కువ మంది రజకులు నదులు, చెరువులు, పంట కాల్వలు, ధోబీ ఘాట్లలో ఉతికి, తమ ఇళ్ల వద్ద లాండ్రీ చేస్తారు. వీరిలో ఎక్కువ మందికి సొంత దుకాణం, బండి లేదనే సాకుతో సాయం ఇవ్వలేదు.
- హెయిర్ కటింగ్ దుకాణాల్లో నాయీబ్రాహ్మణులు ఇద్దరు, ముగ్గురు పనిచేసినా.. ఆ దుకాణం ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ అయిందో, వారికి మాత్రమే సాయం అందించారు.
- నగరాల్లో కటింగ్ దుకాణాల్లో ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నాయీబ్రాహ్మణుడి ఇంటికి ఏసీ లేకపోయినా, తన దుకాణానికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేలా ఏసీ సదుపాయం కల్పిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లు నెలకు సగటున 300 యూనిట్లు దాటితే.. పథకం నిలిపేస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో క్షురకులు దుకాణం ఏర్పాటు చేయకుండా.. ఇంటింటికి తిరిగి హెయిర్ కటింగ్ వంటివి చేస్తారు. వీరికి దుకాణం లేదనే కారణంతో పథకం వర్తింపజేయలేదు.
- రెడీమేడ్ దుస్తుల హవా సాగుతున్న ఈరోజుల్లో దర్జీలకు సరైన ఉపాధి లేకుండాపోయింది. ఇటువంటి దర్జీలకు అండగా నిలుస్తానన్న జగన్ ప్రభుత్వం అనేక ఆంక్షలతో వారికి చేదోడు పథకం దక్కనివ్వలేదు.
- కొన్నిచోట్ల.. ఒక్కో దర్జీ దుకాణంలో ముగ్గురు, నలుగురు దుస్తులు కుడుతుంటారు. కానీ ఆ దుకాణం ఎవరి పేరిట ఉందో, అతడికి మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించారు. అందులో పనిచేసిన మిగిలిన వాళ్లు కూడా దర్జీలే అయినప్పటికీ, అర్హులైన పేదలే అయినాసరే ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
- ఎందరో దర్జీలు, మహిళలు ఇళ్ల వద్ద దుస్తులు కుట్టి కుటుంబాలను పోషిస్తున్నారు. వీరికి కూడా సొంత దుకాణం ఉన్నట్లు కార్మికశాఖ ధ్రువీకరణ పత్రం లేదనే కారణం చూపించి పథకం కింద ప్రయోజనం దక్కకుండా చేశారు.
- అనేక కులాల వాళ్లు దర్జీ వృత్తిలో కొనసాగుతుంటారు. అయితే కొన్ని కులాల దర్జీలకు దుకాణం ఉన్నప్పటికీ.. ‘మీ కులానికి ఈవృత్తికి సరిపోవడం లేదం’టూ అనర్హుల జాబితాలో పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
తిరుమలలో శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు రెండో రోజు శనివారం కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనాన్ని అధిరోహించి సకల సార్వభౌమాధికార లాంఛనాలతో బయలుదేరారు. -
సిట్ పర్యటన వేళ పల్నాడులో కేసులు
పోలింగ్ నేపథ్యంలో జరిగిన గొడవలు, దాడుల దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న వేళ.. పోలీసులు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. -
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ పోయొద్దు
డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోలు, డీజిల్ నింపవద్దని పెట్రోలు బంకుల యాజమాన్యాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా జూన్ 10 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని, వాహనాలకు మాత్రమే వాటిని నింపాలని కలెక్టర్(పౌరసరఫరాలు) పేరుతో నోటీసులు పంపారు. -
ఎన్ని కేసులు పెట్టారు.. ఎంతమందిని అరెస్టు చేశారు?
-
ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
ఆర్టీసీ ఎండీ సిహెచ్.ద్వారకా తిరుమలరావు ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టి.. ఆయనే ఫోన్ చేస్తున్నట్లుగా 70334 00216 నంబరుతో పలువురికి వాట్సప్ కాల్స్ చేసి బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించారు. -
5 రోజుల్లో రూ.7,546 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఫైనాన్స్ కోడ్ ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
భయపెడుతున్న రెవెన్యూ, ద్రవ్యలోటు
రెవెన్యూ ఖర్చుల నియంత్రణ, అప్పుల నియంత్రణపైనే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రెవెన్యూ లోటు లేకుండా చూడాలి. -
11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు రూ.55 లక్షల జరిమానా
బోధన నిపుణుల కొరత, ఇతర లోపాల కారణంగా రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) జరిమానాలు విధించింది. ఎంబీబీఎస్ సీట్లు, ఇతరత్ర వాటి గుర్తింపు పునరుద్ధరణకు కళాశాలల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఎన్ఎంసీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. -
నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
సుమారు రెండు నెలలకు పైగా ఎన్నికల ప్రచారం కోసం వరుస పర్యటనలతో తలమునకలైన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. -
‘పది’లో ఈ ఏడాది సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాలు
రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి సిలబస్ మొత్తం మారిపోయింది. పాత పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారాయి. 2023-24 వరకు రాష్ట్ర సిలబస్ పాఠ్యపుస్తకాలు ఉండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ-సీబీఎస్ఈ) సిలబస్ పాఠ్యపుస్తకాలను ముద్రించారు. -
ఇదీ సంగతి
-
వానలతో చల్లబడిన వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన రాష్ట్రం చల్లబడింది. -
పశువైద్య సేవలకూ..వినియోగ రుసుములు?
పశు సంవర్ధక శాఖలో వినియోగ రుసుముల బాదుడుకు సర్కారు రంగం ‘సిద్ధం’ చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై కార్యాచరణ రూపొందించి అమలు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్