New Districts: కొత్త జిల్లాల ఏర్పాటు..అధికరణ 371డీకి విరుద్ధం
కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ను (మొత్తం 26 జీవోలు) చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలంటూ హైకోర్టులో
ముసాయిదా ప్రకటనను రద్దు చేయండి
ఉద్యోగాల భర్తీకి జిల్లా, జోన్లే ప్రాతిపదిక
వాటిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు
హైకోర్టులో పిల్.. సోమవారం విచారణ
ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు (జిల్లాల పునర్విభజన) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ను (మొత్తం 26 జీవోలు) చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ముసాయిదా నోటిఫికేషన్, తదనంతరం జారీ చేసిన జీవోలు అధికరణ 371-డికి విరుద్ధమని, వాటిని రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా అప్పాపురం గ్రామానికి చెందిన దొంతినేని విజయ్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ముసాయిదా జీవోల అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది.
పిటిషన్లో ఏముందంటే..
* కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371-డికి, ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975కు విరుద్ధం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య సంబంధ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రజల హక్కులకు భద్రత కల్పిస్తూ ఏపీ విభజన చట్టం సెక్షన్ 97లోనూ దీన్ని పొందుపరిచారు.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆరు సూత్రాల ప్రణాళిక ఉండేది. లోకల్ ఏరియాను నిర్ణయించడానికి జిల్లాను ఒక యూనిట్గా పరిగణించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఆరు జోన్లుగా నిర్ణయించారు. స్థానికులకు రిజర్వేషన్ కల్పించారు.
* ఆరు సూత్రాల ప్రణాళిక నేపథ్యంలో రాజ్యాంగంలో అధికరణ 371డి, 371ఈని పొందుపరిచారు. వాటి ప్రకారం ఏపీ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి.
* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల (స్థానిక కేడర్ నిర్వహణ, నేరుగా నియామకాల క్రమబద్ధీకరణ) ఉత్తర్వులు-1975ను తీసుకొచ్చారు. అందులోని రెండో షెడ్యూల్ ప్రకారం ఏపీలోని జిల్లాలను మొత్తం ఏడు జోన్లుగా ఏర్పాటు చేశారు. విభజన అనంతరం ఏపీలో 4 జోన్లు మిగిలాయి. కొత్త జిల్లాలతో వాటి స్వరూపం మారిపోతోంది.
* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్గా పరిగణించాలి. రాజ్యాంగ నిబంధనలను సవరించకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మార్చడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో లోయర్ డివిజన్ పోస్టుల భర్తీ విషయంలో జిల్లాను యూనిట్గా పరిగణిస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం మార్చలేదు.
* 32వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణ 371డి తీసుకొచ్చి ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. ఈ నేపథ్యంలో జోన్ల సృష్టి, అందులో లోకల్ కేడర్ నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వతఃసిద్ధ అధికారం ఉండదు.
* వీటన్నింటి నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో జోన్లను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
* ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి.
పిటిషనర్ ఏం చెప్పారంటే...
1. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాల హద్దులను నిర్ణయించారు. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించనంత వరకు ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు.
2. 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏపీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి ఆరు సూత్రాల ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన వారికి అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడానికి అధికరణ 371డిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జోన్లకు విరుద్ధంగా కొత్త జిల్లాలను సృష్టించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనం చేయకుండా అధికరణ 371డి(10) ప్రకారం నిషేధం ఉంటుంది.
3. ఏపీ విభజన చట్టం సెక్షన్ 97లో.. అధికరణ 371డిని సవరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పేర్కొన్న స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం’ అని పేర్కొన్నారు. అంటే విభజన తర్వాత కూడా అధికరణ 371డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తిస్తుందని స్పష్టమవుతోంది.
4. కొత్త జిల్లాల ఏర్పాటుతో గతంలో నిర్ణయించిన జోన్లు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. అలా మార్చే అధికారం రాష్ట్రానికి లేదు.
5. కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా స్థానిక అభ్యర్థులు అంటే ఎవరు? లోకల్ ఏరియా ఏమిటి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
6. 1975లో ఇచ్చిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉత్తర్వుల్లో ప్రతి జిల్లాను లోకల్ ఏరియాగా పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు 80శాతం రిజర్వేషన్లు కల్పించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోన్లు మారిపోతాయి. పూర్వ ప్రక్రియ అంతా మారిపోతుంది.
7.పునర్నిర్మాణ జిల్లాలు, డివిజన్లు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అది ఏపీ జిల్లా(ఏర్పాటు) చట్టం-1974 నిబంధనలను ఉల్లంఘించడమే. ఆ చట్టప్రకారం అభ్యంతరాలను స్వీకరించి, పరిగణనలోకి తీసుకోవాలి. జనవరి 26న ఇచ్చిన నోటిఫికేషన్లో అభ్యంతరాల గురించి ప్రస్తావనే లేదు.
8. తుది నోటిఫికేషన్ ఇచ్చే ముందు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ జిల్లా ఏర్పాటు చట్టం స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ 8వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలు, డివిజన్లు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 3న మెమో జారీచేస్తూ పోస్టులను కేటాయించింది.
9. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వ్యవహారమై ఇప్పటికే గుర్తించిన జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు.
10. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భారీగా అప్పుల్లో ఉంది. కేంద్రం కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసేందుకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..