PRC: భగ్గుమన్న ఉద్యోగులు
పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంపై పలు ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) భేటీకి కొనసాగింపుగా నిర్వహించిన సమావేశాన్ని మెజార్టీ ఉద్యోగసంఘాలు బహిష్కరించాయి. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ సేవల సంఘం, ఉపాధ్యాయ సంఘాల
పీఆర్సీ నివేదిక ఇవ్వలేదంటూ జేఎస్సీ సమావేశాన్ని బహిష్కరించిన 9 సంఘాలు
ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండు
స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
ఈనాడు డిజిటల్, అమరావతి: పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంపై పలు ఉద్యోగసంఘాలు భగ్గుమన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (జేఎస్సీ) భేటీకి కొనసాగింపుగా నిర్వహించిన సమావేశాన్ని మెజార్టీ ఉద్యోగసంఘాలు బహిష్కరించాయి. ఏపీ ఎన్జీవో, రెవెన్యూ సేవల సంఘం, ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశం మొదలైన కాసేపటికే బయటికొచ్చి నిరసన తెలిపారు. సీఎం చెబితే తప్ప నివేదిక ఇవ్వలేమన్నట్లు అధికారులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ వైఖరి నశించాలంటూ.. సచివాలయంలోని 4వ బ్లాకు ఎదుట నినాదాలు చేశారు. అక్టోబరు 29న నిర్వహించిన జేఎస్సీకి కొనసాగింపుగా ప్రభుత్వం శుక్రవారం 13 సంఘాలతో సమావేశమైంది. ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, శశిభూషణ్కుమార్ నేతృత్వం వహించారు. సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవగా.. గంటకే కొన్ని సంఘాలు బయటికొచ్చేశాయి. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తదితర సంఘాల నేతలతో అధికారులు సమావేశం కొనసాగించారు. ఈ సందర్భంగా నేతలు విలేకర్లతో మాట్లాడారు.
ఎందుకీ దోబూచులాట..?
‘పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఎందుకు దోబూచులాడుతోంది..? ఇది ఉద్యోగ సంఘాలను అవమానించడమే. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే కార్యాచరణ ప్రకటిస్తాం. నివేదిక ఇస్తారనే వచ్చాం. అధికారులు వాళ్ల చేతుల్లో లేదంటున్నారు. 13 సంఘాల్లో 9 సమావేశాన్ని బహిష్కరించాయి. అక్టోబరు నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో ప్రకటించారు. పీఆర్సీ సంగతి దేవుడెరుగు.. ముందు నివేదిక ఇవ్వాలి. రహస్యంగా ఉంచితేనే అనుమానం కలుగుతోంది. ప్రతి ఉద్యోగికి రూ.కోటి వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసుల్లో ఉందా.. ఏంటి?’
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు
జీతం ఇవ్వడమే గొప్ప అంటున్నారు
‘గత సమావేశంలో పీఆర్సీ నివేదిక అడిగితే ఫిట్మెంట్ సిఫారసు పత్రాన్ని ఎందుకు బయటపెట్టారు? ఉద్యోగులకు పీఎఫ్ కింద రూ.1000 కోట్లు, ఏపీజీఎల్ఐ కింద రూ.300 కోట్లు, వైద్యబిల్లులు రూ.21 కోట్లు, రిటైర్డు ఉద్యోగుల లీవ్ ఎన్క్యాష్మెంట్ రూ.40 కోట్లు బకాయిలు చెల్లించాలి. ఇవన్నీఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు. ఈ నెల 1న జీతాలు, పింఛను ఇవ్వడమే గొప్ప అంటున్నారు. సమస్యలపై అధికారులకే స్పష్టత లేదు. పీఆర్సీ నివేదికతో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులు ఎదురుచూస్తున్నారు’
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సేవల సంఘం అధ్యక్షుడు
సీఎం నిర్ణయం తీసుకోవాలి
‘పీఆర్సీపై ప్రభుత్వానికి సాగదీసే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదో అర్థం కావట్లేదు. దీనిపై సీఎం రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ప్రస్తావిస్తే విచారణ జరిపిస్తామని అధికారులు చెప్పారు. పది రోజుల్లోగా విచారణ జరిపించకపోతే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. సీఎఫ్ఎంఎస్ సీఈవో, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిపై తొలి ఫిర్యాదు నేనే చేస్తా’
- కేఆర్ సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
మెడికల్ రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ..
‘త్వరలో నిర్వహించే సమావేశంలోగా పీఆర్సీ నివేదిక ఇవ్వాలని కోరాం. మెడికల్ రీయింబర్స్మెంట్ను పునరుద్ధరించేందుకు అధికారులు అంగీకరించారు. వచ్చే ఏడాది మార్చి 30లోగా బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించేలా షెడ్యూలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు’
-వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు
నగదు ఉపసంహరణపై విచారణ
ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై విచారణ చేయిస్తామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు.కరవుభత్యం బకాయిల్ని చెల్లించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. మూడు నెలలుగా ప్రభుత్వ రాబడి మెరుగైందని, వివిధ బకాయిల్ని వచ్చే ఏడాది మార్చిలోగా చెల్లిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం