Srisailam:శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు ఉత్త చేయేనా?
శ్రీశైలం డ్యాం భద్రత పనులను కేంద్ర జలశక్తిశాఖ చేపట్టిన డ్రిప్-2 విభాగంలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. డ్యాం భద్రత కోసం ప్రతిపాదిస్తున్న రూ.700 కోట్ల ప్లంజ్ పూల్ పనులను డ్రిప్ పథకంలో చేర్చడంపై ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం భద్రత కమిటీ నిరాసక్తత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాంక్రీటుతో పూడ్చినా ప్రయోజనం ఉండదు
డ్యాం భద్రతా కమిటీ ఛైర్మన్ వ్యాఖ్య
ఆ పనులు డ్రిప్-2 పథకంలో చేర్చడం అనుమానమే
ఈనాడు, అమరావతి: శ్రీశైలం డ్యాం భద్రత పనులను కేంద్ర జలశక్తిశాఖ చేపట్టిన డ్రిప్-2 విభాగంలో చేర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. డ్యాం భద్రత కోసం ప్రతిపాదిస్తున్న రూ.700 కోట్ల ప్లంజ్ పూల్ పనులను డ్రిప్ పథకంలో చేర్చడంపై ఇటీవల ప్రాజెక్టును పరిశీలించిన డ్యాం భద్రత కమిటీ నిరాసక్తత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశంలోని వివిధ ఆనకట్టల భద్రత నిమిత్తం కేంద్ర జలశక్తిశాఖ ప్రపంచ బ్యాంకు నిధులతో డ్రిప్ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో కేంద్ర, రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పథకానికి ఏపీ నుంచి 31 ప్రాజెక్టులను పరిశీలించినా అవి పథకం మార్గదర]్శకాల ప్రకారం లేకపోవడంతో డ్రిప్ నిధులు తెచ్చుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి సంబంధించిన కొన్ని పనులను ప్రతిపాదించారు.
వరదలతో పెద్ద గొయ్యి
2009 వరదల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు డ్యాం డిజైన్ను మించి ప్రవాహాలు వచ్చాయి. ఆ స్థాయి ప్రవాహాన్ని తట్టుకునేలా పనులు చేపట్టాలి. ఇప్పటికే శ్రీశైలం స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్లా పెద్ద గొయ్యి ఏర్పడింది. అది స్పిల్వే వరకు విస్తరిస్తోంది. డ్యాం భద్రతా కమిటీ 2017, 2020ల్లో రెండుసార్లు శ్రీశైలం భద్రతపై సమీక్షించి, అనేక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం డ్రిప్-2 పథకంలో.. రూ.700 కోట్లతో శ్రీశైలం ప్లంజ్ పూల్ను కాంక్రీటుతో పూడ్చటం, మరో రూ.90 కోట్లతో పలు చిన్న చిన్న పనులు ప్రతిపాదించారు. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్ పాండ్యా నేతృత్వంలో ఏర్పడ్డ డ్యాం భద్రతా కమిటీ ఈ ప్రాజెక్టులను పరిశీలించి డ్రిప్ కింద ఈ పనులు చేపట్టవచ్చని నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా డ్యాం భద్రతా కమిటీ శ్రీశైలం డ్యామ్ను ఈ నెల మొదటి వారంలో సందర్శించి, అక్కడే సమావేశమైంది.
గండిపడ్డట్లేనా..!
ప్లంజ్ పూల్ ఏర్పడటం అత్యంత సహజమని డ్యాం భద్రతా కమిటీ ఛైర్మన్ పాండ్యా ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. 2005లో అక్కడ కాంక్రీటుతో పనులు చేస్తే కనీసం ఆనవాళ్లు కూడా లేవని, ప్లంజ్ పూల్ను కాంక్రీటుతో నింపితే ఉపయోగమేమీ ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో డ్రిప్లో ఈ పనులకు నిధులు వచ్చే అవకాశాలు లేనట్లేనని సమాచారం. రూ.90 కోట్ల విలువైన చిన్నచిన్న పనులకే డ్రిప్లో అవకాశం దక్కొచ్చని తెలిసింది. శ్రీశైలం ప్రాజెక్టుకు శాశ్వత రక్షణ పనులపైనా సమావేశంలో కొంత చర్చ జరిగిందని తెలిసింది. ప్రాజెక్టు వద్ద ఉన్న రాతిపొరల్లో సున్నపురాయి ఉంటుంది. నీటి ప్రవాహానికి అది కరిగిపోతూ రాయి స్థిరత్వం కొంత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో ఫైమెట్ ఎలిమెంట్ మేథమేటికల్ ఎనాలసిస్ చేయించాలని ఈ కమిటీ సూచించింది. చెన్నై ఐఐటీ నిపుణులతో గతంలో ఇలాంటి విశ్లేషణ చేయించామని, ఆ నివేదిక ప్రతిని తెప్పిస్తామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి సంబంధించి ప్రతిపాదించిన రూ.60 కోట్ల పనులకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.