Ukraine Crisis: వీడని ‘యుద్ధ’ముడి!
శాంతి చర్చలతో యుద్ధం ఓ కొలిక్కి వస్తుందన్న ఆశలు సోమవారం నీరుగారాయి. ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండు దేశాల బృందాలు బెలారస్ సరిహద్దు సమీపంలో దాదాపు ఐదు గంటలపాటు చర్చలు జరిపాయి.
రష్యా-ఉక్రెయిన్ చర్చలు అసంపూర్ణం
త్వరలో మళ్లీ భేటీకి అంగీకారం
ఆయుధాల గర్జనకు మాత్రం కాస్త విరామం
తమను ఈయూలో చేర్చుకోవాలని జెలెన్స్కీ దరఖాస్తు
పుండుమీద కారం చల్లిన పరిణామం
కీలక సమావేశాలు నిర్వహించిన ఐక్యరాజ్యసమితి
ఉక్రెయిన్, రష్యా ప్రతినిధుల తీవ్రస్థాయి వాగ్వాదం
ఓటింగ్కు భారత్ మళ్లీ దూరం
ఆర్థిక ఆంక్షల దెబ్బకు రష్యా రూబుల్ కుదేల్
కీవ్: శాంతి చర్చలతో యుద్ధం ఓ కొలిక్కి వస్తుందన్న ఆశలు సోమవారం నీరుగారాయి. ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండు దేశాల బృందాలు బెలారస్ సరిహద్దు సమీపంలో దాదాపు ఐదు గంటలపాటు చర్చలు జరిపాయి. తక్షణం యుద్ధాన్ని విరమించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారుల్ని ఉక్రెయిన్ ఈ భేటీకి పంపించగా, రష్యా అధ్యక్షుని సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న మాజీ మంత్రి వ్లాదిమిర్ మెడిన్స్కీ నేతృత్వంలో ఆ దేశ బృందం హాజరైంది. చర్చలను రష్యా ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ప్రాథమిక డిమాండ్లపై ఇరువర్గాలు తమ పట్టు సడలించపోవడంతో చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. త్వరలోనే మరో విడత సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక విధానం ద్వారా తమ దేశాన్ని వెంటనే ఐరోపా సమాజం (ఈయూ)లో చేర్చుకోవాల్సిందిగా కోరుతూ సంబంధిత దరఖాస్తుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకం చేయడం కీలక పరిణామం. ఇది ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోయొచ్చన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి. దరఖాస్తు చేస్తున్న ఫొటోను స్వయంగా అధ్యక్షుడే పత్రికలకు విడుదల చేశారు.
రవ్వంత విరామం..
సోమవారం రణభేరికి కొంతమేర విరామం లభించింది. దూకుడును రష్యా ఒక్కసారిగా తగ్గించింది. ఉక్రెయిన్ బలగాలు కూడా సంయమనం పాటిస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై ఐరాస రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. వాటిలో రెండు దేశాల ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దూతలను నియమించింది. వివిధ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావంతో విలవిల్లాడుతున్న రష్యా తాజాగా మరిన్ని దేశాల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
క్షిపణులు, ఆయుధాలు ఇస్తామన్న అమెరికా
ఉక్రెయిన్కు స్టింగర్ క్షిపణుల్ని, ఇతర ఆయుధాలను ఇస్తామని అమెరికా, జర్మనీ ప్రకటించాయి. ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటివి ఐరోపా సమాజం సరఫరా చేస్తోంది. యుద్ధ విమానాలను సరఫరా చేయాలన్న ఉక్రెయిన్ అభ్యర్థనను పశ్చిమ దేశమొకటి పరిశీలిస్తోందని ఐరోపా అధికారి ఒకరు తెలిపారు. ఆయుధాలు అందకుండా నౌకలను అడ్డుకోవడం రష్యాకు ప్రాధాన్య అంశంగా మారింది. కీవ్తో పాటు ఉక్రెయిన్లోని లుట్స్క్, ఇవానో ఫ్రాంకివ్స్క్, చెర్నిహైవ్, ఖార్కివ్, ఒడెసా, ఖేర్సన్ తదితర నగరాల్లో రష్యా దాడులు ఒకస్థాయిలో జరిగాయి. సుమీ నగరంలో చమురు డిపోపైనా బాంబులు పడ్డాయి. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పలుచోట్ల ఉక్రెయిన్ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. అణు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పుతిన్ ఇచ్చిన పిలుపు మేరకు భూమి, జల, ఆకాశ మార్గాల్లో అణ్వాయుధ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్ల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు వెల్లడించాయి. అణ్వాయుధాలున్న యుద్ధవిమానాన్ని ఉక్రెయిన్ గగనతలానికి తీసుకువెళ్లారా అనే అనుమానాలు రేకెత్తించేలా రష్యా స్పందన ఉంది.
సడలిన కర్ఫ్యూ.. మార్కెట్లు కిటకిట
శనివారం నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూను సోమవారం సడలించడంతో నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు వచ్చారు. ఆహారం, తాగునీరు వంటివి కొనడానికి వచ్చినవారితో సూపర్ మార్కెట్లు కిటకిటలాడాయి. వీటితో పాటు ఏటీఎంల వద్ద పెద్దఎత్తున బారులు తీరిన ప్రజలు కనిపించారు. బాంబుదాడులు తాత్కాలికంగా ఆగినట్లు కనిపించినా ఇది ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. రష్యాకు సాయపడేందుకు బెలారస్ తన బలగాలను పంపించే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సురక్షిత మార్గంలో ప్రజలు కీవ్ను విడిచివెళ్లేందుకు అనుమతిస్తామని రష్యా సైనిక వర్గాలు చెప్పడంతో మున్ముందు ఏం జరగబోతోందో అనే ఆందోళన వివిధ వర్గాల్లో ఉంది.
ఉక్రెయిన్ గగనతలం పూర్తిగా మా నియంత్రణలో ఉంది: రష్యా
గగనతల దాడుల తర్వాత ఉక్రెయిన్ గగనతలం పూర్తిగా తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా సైన్యం ప్రకటించింది. దీన్ని అమెరికాఅధికారులు నమ్మడం లేదు. ప్రపంచం దృష్టి మళ్లించడానికే అణ్వాయుధాల గురించి పుతిన్ మాట్లాడుతున్నట్లు ఉందని బ్రిటన్ పేర్కొంది.
బెలారస్లో అమెరికా ఎంబసీ మూసివేత
బెలారస్లో తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. రష్యాలోని దౌత్య కార్యాలయంలో అత్యవసరేతర సిబ్బంది అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. మిన్స్క్ ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో భద్రత చర్యల కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
4500 మంది రష్యా సైనికుల్ని చంపాం: జెలెన్స్కీ
యుద్ధంలో రష్యాకు చెందిన 4,500 మందికి పైగా సైనికుల్ని చంపేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా దాడుల వల్ల గత నాలుగు రోజుల్లో 16 మంది పిల్లలు చనిపోయారని తెలిపారు. ‘ఆయుధాలు వదిలిపెట్టండి. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీ కమాండర్లను విశ్వసించవద్దు. మీ ప్రాణాలు కాపాడుకోండి’ అని రష్యా సైనికులకు విజ్ఞప్తి చేశారు. సాధారణ పౌరుల్లో కనీసం 102 మంది చనిపోయారని ఐరాస మానవ హక్కుల విభాగం అంచనా వేసింది. రష్యా దాడుల్లో 14 మంది పిల్లలు సహా తమ ప్రజలు 352 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. 1,684 మంది గాయాలపాలైనట్లు తెలిపింది. కచ్చితమైన లెక్కలు ఇప్పటికీ తెలియరావడం లేదు. యుద్ధ భయంతో ఇప్పటివరకు వలస వెళ్లినవారు 5 లక్షలకు పైగా ఉంటారని ఐరాసలో సంబంధిత విభాగం అంచనా వేసింది.
* యుద్ధాన్ని ముగించడానికి తన వంతు చేయూత అందించడానికి వాటికన్ సిటీ కూడా ముందుకు వచ్చింది. చర్చలకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుందని, ఈ విషయంలో తమ సేవల్ని పొందవచ్చని వాటికన్ సిటీ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.11,672 కోట్లు.. ఒక్కో షేరుకు ₹10 డివిడెండ్
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట