Jio: ఆగస్టులో జియో టాప్..
దేశీయ దిగ్గజ టెలికం సంస్థ జియో ఆగస్ట్లో కూడా తన హవా కొనసాగించింది. బుధవారం ట్రాయ్ డేటాను విడుదల చేసింది. జియోకు ఈ నెలలో 6.49లక్షల
ఇంటర్నెట్డెస్క్: దేశీయ టెలికం దిగ్గజ సంస్థ జియో ఆగస్ట్లో కూడా తన హవా కొనసాగించింది. బుధవారం ట్రాయ్ కొత్త సబ్స్క్రిప్షన్ల డేటాను విడుదల చేసింది. జియోకు ఈ నెలలో 6.49లక్షల మంది కొత్త సబ్స్క్రిప్షన్లు వచ్చాయి. అదే సమయంలో భారతీ ఎయిర్టెల్కు 1.38లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 8.33 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కాకపోతే జులై నెలతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం ఒక్కటే ఆ కంపెనీకి ఊరట.
కొత్త సబ్స్క్రైబర్ల చేరికతో జియో వినియోగదారుల సంఖ్య 44.38 కోట్లకు చేరింది. ఇక భారతీ ఎయిర్ టెల్ వినియోగదారుల సంఖ్య 35.41 కోట్లకు పెరగ్గా, వొడాఫోన్ వినియోగదారుల సంఖ్య 27.1 కోట్లకు తగ్గింది. ఏజీఆర్ దెబ్బకు కష్టాల్లో టెలికం ఆపరేటర్లకు ఇటీవల ప్రభుత్వం నుంచి ఊరట లభించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు